Home » Kadiri
ఖరీఫ్లో సాగు చేసిన కందిపంటకు మంచు కురవడంతో కందిపూత దెబ్బతినే అవకాశం ఉం దని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో మండల వ్యాప్తంగా పలువురు రైతులు కందిపంట సాగు చేశారు. అయితే కంది సస్యరక్షణకు ఎన్నో మెళకువలు పాటించి, తెగుళ్ల నివారణకు మందులు పిచికారీ చేశారు.
మండలపరిధిలోని నల్ల గుట్టపల్లి తండాకు వెళ్లే రహదారి మధ్యలో ఉన్న బ్రిడ్జిపై ప్రయాణం ప్ర మాదకరంగా ఉందని గ్రా మస్థులు అంటు న్నారు. పెడబల్లి నుంచి నల్లగు ట్టపల్లికి వెళ్లే మార్గ మధ్య లో ఆర్డీటీ ఆధ్వర్యంలో పాపాగ్ని నదికి అడ్డంగా ఈ బ్రిడ్జి నిర్మించారు.
లబ్ధిదారుల సమస్యలను పరిష్కామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండల పరిధిలోని చామాలగొంది పంచాయతీ బయ్యా రెడ్డిగారిపల్లిలో శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయనతో పాటు ఆర్డీవో వీవీఎస్ శర్మ పాల్గొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో నూతనంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం విది తమే. అయితే చాలా చోట్ల ప్రభుత్వ భవనాలను పూర్తిచేయడంలో మరి చింది. మండల వ్యాప్తంగా సచివాల యాలు పలు సచివాలయాలు నిర్మా ణ దశలోనే ఉన్నాయి. దీంతో వాటిని ఇరుకైన అద్దెగదుల్లో నిర్వహిస్తుం డడంతో ప్రజలు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అమడగూరు, కసముద్రం, మహమ్మదాబాద్లలో గ్రామ సచివాలయాలకు మంజూరైన భవనాలను పూర్తిగా నిర్మించారు.
మండలకేంద్రంలో బస్ షెల్టర్ లేదు. దీంతో మహిళా ప్రయాణికులు, ఉద్యోగినులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. తనకల్లులోని అంబే డ్కర్ కూడలి, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆర్టీసీ బస్సులను ఆపుతున్నారు. దీంతో మండలపరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే మహిళలతో పాటు తనకల్లులోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయినులు తమ తమ గ్రామాలకు వెళ్లే బస్సులు ఎక్కడానికి తనకల్లులోని అంబేడ్కర్ సర్కిల్లో వేచి ఉండాల్సి వస్తోంది.
వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తే మైనింగ్ నిర్వాహకులపై చర్యలు తప్పవని ఆర్డీవో వీవీఎస్ శర్మ హెచ్చరించారు. మండలపరిధిలోని దనియానచెరువు పంచాయతీ సోమరాజుకుంట సమీపంలోని నెమళ్లగుట్టలో ఇటీవల మైనింగ్ పనులు చేపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికతో పాటు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి సోమరాజుకుంట గ్రామస్థులు తీసుకెళ్లారు.
కూటమి ప్రభుత్వంపై అవా కులు, చవాకులు పేలితే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని వైసీపీ ఇనచార్జ్ మగ్బూల్ బాషాపై టీడీపీ నాయకులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. తెలుగుయువత మండలాధ్యక్షుడు కావడి ప్రవీణ్కుమార్, నా యకులు షేక్ మహబూబ్బాషా, పులికంటి నరసింహులు తదితరులు మంగళవారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా సోమవారం విభిన్న ప్రతిభావంతులు మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐటీఐ నుంచి ప్రధాన వీధుల గుండా అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది.
పట్టణంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే ఇజ్తమా ఏర్పాట్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆది వారం పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కదిరిలోని బైపాస్ రోడ్డులో ముస్లింలు ఇజ్తమా నిర్వహిస్తున్నారు. అందుకు కావలసిన మైదానం, ఏర్పాట్లును ముస్లిం మత పెద్దలతో కలిసి పరిశీలించారు.
మండలపరిధిలోని కోటపల్లి గ్రామ సచివాలయం వద్ద సమాచార హక్కు చట్టం బోర్టును అఽధికారులు ఏర్పాటు చేశారు. అందులో ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన అధికారుల పేర్లు, బదిలీ అయిన అధికారుల పేర్లే ఇప్పటికీ కనిపిస్తు న్నాయి. ఏడాది కాలంగా పేర్లను మార్చకపోవడాన్ని చూసి పలువురు ఆశ్చర్యం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.