Home » Kadiri
మండలకేంద్రంలో బస్ షెల్టర్ లేదు. దీంతో మహిళా ప్రయాణికులు, ఉద్యోగినులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. తనకల్లులోని అంబే డ్కర్ కూడలి, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆర్టీసీ బస్సులను ఆపుతున్నారు. దీంతో మండలపరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే మహిళలతో పాటు తనకల్లులోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయినులు తమ తమ గ్రామాలకు వెళ్లే బస్సులు ఎక్కడానికి తనకల్లులోని అంబేడ్కర్ సర్కిల్లో వేచి ఉండాల్సి వస్తోంది.
వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తే మైనింగ్ నిర్వాహకులపై చర్యలు తప్పవని ఆర్డీవో వీవీఎస్ శర్మ హెచ్చరించారు. మండలపరిధిలోని దనియానచెరువు పంచాయతీ సోమరాజుకుంట సమీపంలోని నెమళ్లగుట్టలో ఇటీవల మైనింగ్ పనులు చేపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికతో పాటు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి సోమరాజుకుంట గ్రామస్థులు తీసుకెళ్లారు.
కూటమి ప్రభుత్వంపై అవా కులు, చవాకులు పేలితే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని వైసీపీ ఇనచార్జ్ మగ్బూల్ బాషాపై టీడీపీ నాయకులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. తెలుగుయువత మండలాధ్యక్షుడు కావడి ప్రవీణ్కుమార్, నా యకులు షేక్ మహబూబ్బాషా, పులికంటి నరసింహులు తదితరులు మంగళవారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా సోమవారం విభిన్న ప్రతిభావంతులు మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐటీఐ నుంచి ప్రధాన వీధుల గుండా అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది.
పట్టణంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే ఇజ్తమా ఏర్పాట్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆది వారం పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కదిరిలోని బైపాస్ రోడ్డులో ముస్లింలు ఇజ్తమా నిర్వహిస్తున్నారు. అందుకు కావలసిన మైదానం, ఏర్పాట్లును ముస్లిం మత పెద్దలతో కలిసి పరిశీలించారు.
మండలపరిధిలోని కోటపల్లి గ్రామ సచివాలయం వద్ద సమాచార హక్కు చట్టం బోర్టును అఽధికారులు ఏర్పాటు చేశారు. అందులో ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన అధికారుల పేర్లు, బదిలీ అయిన అధికారుల పేర్లే ఇప్పటికీ కనిపిస్తు న్నాయి. ఏడాది కాలంగా పేర్లను మార్చకపోవడాన్ని చూసి పలువురు ఆశ్చర్యం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మండల పరిధిలోని గొడ్డువెలగల పంచా యతీలో అర్ధాంతరంగా నిలిచిపోయిన రోడ్డు పనులను శనివారం ప్రారంభించారు. తుమ్మల బైలు నుంచి గొడ్డువెలగల పంచాయతీకి గతంలో తారు రోడ్డు వేశారు. గొడ్డు వెలగల సమీపాన అటవీ ప్రాంతంలో అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో కొంత వరకు సిమెంట్ రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని ఎమ్మెల్యే కందికుం ట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శని వారం కదిరి పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.
అభివృద్ధి, సంక్షేమం డబుల్ ఇం జన సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొ న్నారు. అలాగే ముందుకెళ్తున్నా మని అన్నారు. మండలపరిధిలోని కౌలేపల్లి వద్ద రూ.56 కోట్లతో నిర్మించిన రోడ్డు ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ)ని ఆ యన శనివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... గతంలో ఎన్డీఎ పాలనలో రెండు ఆర్వోడీలు మంజూరయ్యాయని, వా టిని పూర్తి చేయడంలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఎన్నేళ్లు... ఇలా ప్రైవేటు భవ నాల్లో ప్రభుత్వ విద్యార్థులకు విద్యాబోధన సాగిస్తారని ఆ గ్రామ స్థులు ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారం చేపట్టినా, విద్యకు పెద్ద పీట వేస్తున్నట్లు ప్రగాల్భాలు పలకడమే తప్ప ఆచరణలో కనిపించడం లేదంటున్నారు. మండలపరిధిలోని ఎర్రగుంటపల్లిలో ఈ పరిస్థితి కనిపి స్తుంది.