Home » Kadiri
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం తలుపుల మండ లంలోని పెద్దన్నవారిపల్లికి వచ్చారు. హెలిప్యాడ్ వద్ద నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రెవెన్యూ శాఖమంత్రి, జిల్లా ఇనచార్జ్ మంత్రి అవగా న సత్యప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి ఎమ్మెల్యేలు కందికుంట వెంక టప్రసాద్, పరిటాల సునీత, పల్లె సింధూరరెడ్డితదితరులు పుష్పగుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు.
మండలకేంద్రంలో వెలసిన హజరత ఓడీసీ బాబా పదో ఆరాఽధనోత్సవాన్ని బాబా దర్గా సన్నిధిలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు బైపరెడ్డి ఆధ్వర్యంలో దర్గా ఆవరణను వివిధరకాల పుష్పాలు, విద్యుతదీపాలతో అలంకరిం చారు. రాత్రి బాగేపల్లి స్వామివారి ఆధ్వర్యంలో గంధోత్సవం నిర్వహించారు. పెనుకొండ ఫకీర్ల జలసాలతో బాబాకు గంధం సమర్పించారు.
స్థానిక ఎస్టీఎస్ఎన డిగ్రీ కళాశాలలో శుక్రవారం మూడో రోజు ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్ -14, 17 బాల బాలికల క్రీడల పోటీలు కొనసాగా యి. ఇందులో హైజంప్, లాంగ్ జంప్, 100, 200, 400, 800, 1500 మీటర్ల పరుగుపందెంతో పాటు డిస్క్ త్రో, షాట్పుట్, జావ్లింగ్ త్రో సంబంధిత క్రీడల పోటీలు నిర్వహించారు.
ఎవరో వస్తా రనీ... ఏదో చేస్తారనీ ఎదురు చూడకుండా మండలం లోని నడిమికుంటపల్లి, రత్నగిరి, సుబ్బరాయనిపల్లి ప్రజలు ఒక్కటయ్యారు. మూడు గ్రామా లలో గ్రామపెద్దల సమక్షంలో సమావేశమై ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి, కొంత విరా ళం వచ్చేలా తీర్మానించారు. మూడు గ్రా మాలలో కలిపి రూ. లక్ష సేకరించారు. ఇంటికి ఒకరు చొప్పున కలిసి, ఎక్స్కవేటర్, ట్రాక్టర్లు అద్దెకు తీసుకున్నారు.
ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగిన డివిజన స్థాయి పోటీలను రెండో రోజు గురువారం ఎంఈఓలు చెన్నకృష్ణ, ఓ బులరెడ్డి ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయురాలు స్వరూప అధ్యక్ష త వహించారు. అండర్-14, 17 బాలికల ఖోఖో విన్నర్స్గా గాండ ్లపెంట మండలం, రన్నర్స్గా కదిరి మండలం జట్లు నిలిచాయి. అండర్ -14, 17 బాలుర ఖోఖో విన్నర్స్గా గాండ్లపెంట మండలం జట్లు, అండర్ -14 రన్నర్గా తనకల్లు మండలం, అండర్-17 రన్నర్ గా కదిరి మండలం జట్టు నిలిచాయి.
మండలకేంద్రంలో పాడుబడిన పోలీస్ క్వార్టర్స్ ప్రాంతంలో ముళ్లకంపలు, పిచ్చికంపలు పెరిగి పోవడంతో చుట్టుపక ్కల కాపురాలున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి నుంచి ప్రతిరోజు పాములు బయటకు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఇళ్లకు వాకిళ్లు వేసుకొని, బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని, ఎవరితో చెప్పుకోవాలని వాపోతున్నారు.
వచ్చే ఏడాది 2025-26 సంవత్సరంలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను అసిస్టెంట్ కమిషనర్ లాజర్ బుధవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో వచ్చే ఏడాది నిర్వహించే పదో తగరతి పరీక్షా కేంద్రంలో వసతులు, గదులు, బల్లలు, ఫ్యానలు, మంచి నీటి సౌకర్యంపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో ఆరా తీశారు.
మండలపరిదిలోని గంటాపురం గ్రామంలో సాగు చేసిన కంది, వేరుశనగ, మొక్కజొన్న పంటలను శాస్త్రవేత్త మాధవిలత, ఏడీఏ లక్ష్మనాయక్ బుధవారం పరిశీలించారు. కందిలో మరుకా మచ్చల పురుగును గుర్తించారు. దీని నివారణకు వేప నూనె 1000మి.లీ. క్లోరోఫైరిఫాస్ 500మి.లీ. కలిపి ఎకరాకు పిచికారి చేయాలని తెలిపారు.
పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కదిరి డివిజన స్థాయి ఎస్జీఎఫ్ పోటీలను డీఈఓ కిష్టప్ప బుధవారం ప్రారంభించారు. బాల బాలికలు అండర్ -14, 17 విభాగాలలో చెస్, యోగా, షటీల్ క్రీడలలో పాల్గొన్నారు.
మునిసిపాలిటీలో ఏ స్థాయి ఉద్యోగి అయినా అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హెచ్చరించారు. ఎమ్మెల్యే బుధవారం మున్సిపల్ కార్యాలయంలోని చైర్పర్సన చాంబర్లో చైర్పర్సన దిల్షాద్ ఉన్నీసా, వైస్ చైర్మెన రాజశేఖర్ ఆచారితో పాటు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడితే ఏ స్థాయి ఉద్యోగి అయినా ఉపేక్షించమని అన్నారు.