Home » Kadiri
పంటల సాగులో రైతుల సౌలభ్యం కోసం గత వైసీపీ ప్రభుత్వం అప్పటి రైతు భరోసా కేం ద్రాలలో(రైతు సేవా కేంద్రాలు) కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒకటి చొప్పున ఏర్పాటు చేసింది. తద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, మందుల నిలువ తెలుసుకోవడంతో పాటు సాగుకు అవసరమైన అంశాలను అందులో పొందుపరిచేందుకు అవకాశం కల్పించింది.
మండల కేం ద్రంలోని చిన్నమిట్ట వద్ద నూ తనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠను సోమవారం ఘ నంగా నిర్వహించారు. ఇం దులో భాగంగా తెల్లవారుజా మున 2 గంటల నుంచి నే త్రోన్మీలనం, మహా పూర్ణా హుతి, నెయ్యి అభిషేకం, మ హా కుంభాభిషేకం తదితర పూజా కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
వర్షం వస్తే చాలు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పరిస్థితే మారిపోతుంది. ఏగదిలో చూసినా వర్షంపు నీరు కారుతోంది. ఇలా అయితే కార్యాలయంలో రికార్డులను ఎలా భద్రపరుస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మండలంలో ఏడువేల ఎకరాలను సోలార్కు ఇచ్చారని, సోలార్ ద్వారా వచ్చే సీఎ్సఆర్ నిధులతో నూతనంగా తహసీల్దార్భవనం నిర్మించాలని ప్రజ లు కోరుతున్నారు.
మండల కేంద్రంలో అయ్యప్పస్వామి గ్రామోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించా రు. అయ్యప్పస్వామి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠలో భాగంగా నాలుగో రోజు అయ్యప్పస్వామి పంచలోహ విగ్రహం, వినాయకుడు తదితర విగ్రహాలను ఊరేగించా రు.
కరువు ప్రాంతమైన అమడగూరు మండలంలో వ్యవసాయంతో రైతులు ప్రతి యేటా నష్టాలు చవి చూస్తున్నారు. దీంతో పె ట్టుబడులు పెట్టి పంటలు సాగుచేయలేక, పంటలు సాగిచేసినా పెట్టుబడులు తిరిరాని పరిస్థితిలో కొట్టుమిట్టాడు తున్నారు. దీంతో చాలామంది రైతులు రైతులు పాడిపరిశ్రమపై మక్కువ చూపుతున్నారు. ఎవరి శక్తి వారు రెండు లేదా నాలుగు ఆవులు, గేదెలు పెట్టుకొని పాలవ్యాపారం చేస్తున్నారు.
పట్టణంలోని ఖాద్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంతో పాటు శనివారం కావడంతో జిల్లా నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించు కున్నారు. అలాగే వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో వి ద్యార్థులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
అసలే అరకొరగా వస్తున్న నీరు... ఆ పై ఎరువుల కొరత... రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోం ది. ఖరీఫ్ సీజనలో సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలకు యూరి యా వాడకం అధికంగా ఉంటుంది. నెలకు ఒకమారు చొప్పున తక్కువ మోతాదులో యూరియాను పంటలకు వేస్తుంటారు. కానీ మండల రైతులకు ప్రస్తుతం యూరియా అందుబాటులో లేదు.
మండలంలోని చిన్నరామన్నగారిపల్లి పంచాయతీ కేంద్రం నుంచి ఆ పంచా యతీలోని తురకవానిపల్లికి దాదాపు 30 యేళ్ల క్రితం నిర్మించిన రోడ్డు చాలా అధ్వానంగా మారింది. కంకర తేలిన రోడ్డు ప్రయాణించేందుకు ఆ గ్రామస్థు లు చాలా అగచాట్లు పడాల్సి వస్తోంది. చిన్నరామన్నపల్లి నుంచి తురకవానిపల్లి వరకు 30 ఏళ్ల క్రితం మూడు కిలో మీటర్ల తారు రోడ్డు నిర్మాణం చేపట్టారు.
నియోజకవర్గంలోని ఏడు పోలీసు స్టేషనలకు ఎమ్మెల్యే కందికుంట వెం కటప్రసాద్ కొత్త వాహనాలను సమకూర్చారు. వాటి తాళంచెవులను శనివారం ముఖ్యమంత్రి చేతుల మీ దుగా ఎస్పీ సతీ్షకు మార్కు అందజేశారు. ని యోజకవర్గంలో ఉన్న పో లీసు వాహనాలు చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి,
పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి భద్రత అని ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ధర్మవరంలోని కేహెచ ప్రభుత్వ డిగ్రీకళాశాల ఎనఎస్ఎస్ వలంటీర్లు మండలంలోని గొట్లూరులో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబి రాన్ని ఆయన శనివారం సందర్శించారు.