Home » Kadiri
వైసీపీ హయాంలో ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా వృథా చేశారనేందుకు నిదర్శనమే ఈ జగనన్న కాలనీ. అధికారులు, ప్రజాప్రతినిధులు అనాలోచిత నిర్ణయాలతో జగనన్న కాలనీ అడవిని తలపిస్తోంది. తనకల్లు మేజర్ పంచాయతీ పరిధిలోని 30 పల్లెల లబ్ధిదారులకు జగనన్న కాలనీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో 140 మందికి పట్టాలు ఇచ్చారు.
మండల పరిధిలోని గౌళ్లపల్లికి విద్యుత అధికారులు ఎన్నో యేళ్లక్రితమే విద్యుత సౌకర్యం క ల్పించారు. గ్రామంలోకి మూడు వైర్లుతో విద్యుత సరఫరా అందిస్తున్నారు. అయితే గ్రామం సమీపంలో ఆ మూడు విద్యుత వైర్లకు ప చ్చని తీగలు పూర్తిగా అల్లుకుపోయాయి. వైర్ల మొత్తం కిందికి లా గేస్తున్నాయి. అయినా విద్యుత అధికారులు ఆ వైపు కన్నెతి చూసిన పాపాన పోలేదు.
మండల కేంద్రంలోని నివాస గృహాల వద్ద ఉన్న వ్యర్థాల చెత్తకు ఎవరో నిప్పు పెట్టారు. అయిఏ ఆ చెత్త నుంచి దుర్గంధం, కలుషిత వాయువులతో కూడిన పొగ వెలువడుతోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గాండ ్లపెంటలో నిత్యం స్వచ్ఛతా రాయబారులు వీధులలో శుభ్రం చేసి చెత్త, ప్లాస్టిక్, చెప్పులు, పేపర్లు వంటి వ్యర్థాలను ఊరి బయట ఉన్న చెరువు పక్కన దారి వెంబడి వెస్తున్నారు.
రూరల్ పరిధిలోని సున్నపుగుట్ట తండాలో రాత్రికి రాత్రే అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. జాతీయ రహదారికి సమీపంలో శనివారం ఉదయానికే అక్రమ లేఅవు ట్ సిద్ధ మైంది. ఎటువంటి అనుమతులు లేకుండానే రాళ్లు పాతి, ప్లాట్లు వేశా రు. అనధికారికంగా అగ్రిమెంట్లపై అమ్మకాలు కూడా జరిగినట్లు సమాచారం.
విద్యార్థి విద్య పట్ల తప్ప ఇతర ఆ కర్షణలకు లోను కాకూడ దని జూనియర్ సివిల్ కో ర్టు న్యాయాధికారి లోకనా థం పేర్కొన్నారు. పట్టణం లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇనచార్జ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహిం చిన బాలల దినోత్సవంలో న్యాయాధికారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పే ర్కొన్నారు. పట్టణంలోని నిజాంవలీ కాలనీలో ఉన్న వార్డు సచివా లయంలో శుక్రవారం 11, 13, 14, 15, 16, 17 వార్డుల ప్రజల సమస్య లను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆ వార్డులకు సంబంధించిన ఫిర్యాదులను ఎమ్మెల్యే ప్రజల నుంచి స్వీకరించారు.
మండలకేంద్రం లోని పెడబల్లి రోడ్డులో మసీదు సమీపంలో మురుగునీరు రోడ్డుపై నిలు వ ఉంది.. దీంతో వాహనాల రాకపోకల సమయంలో ఈ నీరు పాదాచా రులపై ఎగిరిపడుతోంది. దీంతో మసీదులో ప్రార్థనలు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ముస్లింలు తెలిపారు.
పేదల వైద్యానికి కూటమి ప్రభు త్వం పెద్ద పీట వేసిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నా రు. పట్టణంలోని ఆర్అండ్బీ బంగ్లాలో గురువారం రూ.46లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదల వైద్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునా యుడు పెద్ద పీట వేస్తున్నారన్నారు.
పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ ఎదురుగా వడ్డే ఓబన్న విగ్రహం పక్కన పైపులైన లీకేజీ ఏర్పడింది. అది రోడ్డు మధ్యలో ఉంది. గత 20 రోజులుగా ఆ లీకేజీని తప్పించడానికి మూడు డివైడర్లను అడ్డం పెట్టారు. లీకేజీ ఏర్పడి 20 రోజులైనా మున్సి పాలిటీవారు మరమ్మతులు చేయడం పట్టించుకోలేదు.
టీడీపీలో కష్టపడిన ప్రతి కార్యకర్త కు గుర్తింపు ఇస్తామని, పదవితో గౌరవిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని పీఆర్ గ్రాండ్లో మంగళవారం నూతనంగా ఎన్నికైన క్లస్టర్, యూనిట్, బూత కన్వీనర్లతో ప్రమాణస్వీకా రం చేయించారు. ముందుగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళు లు అర్పించి, కేక్ కట్ చేశారు.