Home » Kadiri
మండలపరిధిలోని కటారు పల్లిలో ఈ నెల 19న నిర్వహించే యోగివేమన జయంతి ఉత్సవాల ఏ ర్పాట్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఎమ్మెల్యే కందికుంట అభ్యర్థనకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం యోగి వేమన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు అనుమ తి ఇచ్చింది.
రోడ్డు భద్రత అందరి బాధ్యత అని ఆర్టీవో శ్రీనివాసులు పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక కుటాగుల్ల వద్ద ఓబులేశ్వర డిఫెన్స అకాడమీలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురష్కరించుకుని సోమవారం మండల పరిధిలోని కుమ్మవాండ్ల పల్లిలో స్తోత్రాద్రి కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు.
పట్టణంలో వడ్డె ఓబన్న జయం తి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళి అ ర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సమాజంలో అన్నివర్గాల ప్రజలకు మంచిచేయాలనే ధోరణిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు.
మండలపరిధిలోని కటారు పల్లిలో ఈ నెల 19న యోగివేమన జయంతి ఉత్సవాలను అధికారు లు, గ్రామ పెద్దలు కలిసి ఘనంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సూచించారు. కటారుపల్లిలో చేపట్టిన యోగి వేమన జయంతి ఉత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు.
పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి పైపులు లీకవుతున్నాయి. వాటి వల్ల కొన్నిచోట్ల నీరు కలుషిత మవుతోంది. మరికొన్ని చోట్ల లీకేజీ అయిన నీరు పారి రోడ్లు పా చిపట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లీకుల్లో ఏర్పడిన గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధాన రోడ్లలో సైతం తాగునీటి పైపులు లీక్ అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు.
మండలపరిధిలోని కటారుపల్లిలో ఈ నెల 19న నిర్వహించే వేమన జయంతి ఉత్సవాల కు కావల్సిన ఏర్పాట్లను శనివారం ప్రారంభించారు. యోగివేమన ఉత్సవాలను కటారుపల్లిలో అధికారికంగా జరపాలని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ కోరగా ప్రభుత్వం అందుకు స్పందించింది.
తలుపుల మండలపరిధిలోని నిగ్గిడి గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటుపై టీడీపీ నాయకులు శనివారం పరిశీలించారు. నిగ్గిడి కల్పించాని రోడ్డు నిర్మించాలని ఆ గ్రామస్థులు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్కు ఇటీవల విన్న వించారు.
రియల్టర్లకు కాసులు వర్షం కురుస్తుందంటే వాగులను కూడా మూసి వేస్తారు. ప్రజల ఎటువంటి సమస్యల పట్టించుకోరనే విమర్శలు మండల ప్రజల నుంచి వినవస్తు న్నాయి. ప్రభుత్వ అనుమతులు ఏ మాత్రం లేకుండా లేఅవు ట్లు వే యడం, ప్రజల నుంచి డబ్బులు దండుకోవ డమే పరిపాటిగా మారుతోంది. దీంతో ప్లాట్లు కొన్నవారు భవిష్య త్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి కంకర మిషన్ను అధికారులు మూసివేశారు. నిబంధనలు పాటించడం లేదనే కారణంలో మిల్లును మూసివేసినట్లు అధికారులు పేర్కొంటున్నా... అసలు కారణాలు వేరే ఉన్నాయనే విమర్శలొస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి.