Home » Kadiri
మండల పరిధిలోని మహమ్మదాబాద్ మూడు రోడ్లు కూడలిలో హోటల్ యజమానులు ఏర్పాటుచేసుకున్న తాగునీటి పైప్లైన పగిలింది. ఈ రోడ్డుపై భారీ వాహనాలు వెళ్తుంటాయి. రోడ్డు పక్కనే తక్కువలోతులో పైప్లైన ఉండడంతో ఆ వాహనాలు వెళ్లినప్పుడు పైప్లైన పగిలిపోయే అవకాశం ఉంది. గతంలోనూ ఈ సంఘటన జరిగింది.
మండలంలోని వెంకటాపురం(నల్లగుట్లపల్లి)గ్రామానికి చెందిన బీరే కరుణాకర్ నాయుడు స్వగృహంలో శనివారం అర్ధరాత్రి విద్యుతషాట్ సర్క్యూట్ అయింది. ఈ ప్రమాదంలో రూ. 3లక్షలు నష్టం వాటిల్లినట్లు బాఽధి తుడు వాపోయాడు. వెంకటాపురానికి చెందిన బీరే కరుణాకర్ నా యుడు, కుటుంబసభ్యులు ప్రతి రోజులాగానే శనివారం రాత్రి ఆరు బయట నిద్రించారు.
బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాషా్ట్ర ల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచిస్తోం ది. దీంతో వరి రైతుల్లో తుఫాను భయం చు ట్టుకుంది. గాండ్లపెంట మండల వ్యాప్తంగా 14 పంచా యతీల్లో 813 ఎకరాల్లో వరి సాగు చేశారు. వరి సాగుకు ఎకరాకు సు మారు రూ. 20వేలు వరకు ఖర్చు చేశారు. ఈ సీజనలో చీడపీడల నివారణ కూడా ఎంతో కష్టతరం గా మారింది.
వేపరాళ్ల పంచాయతీ సచివాలయంలో శుక్రవారం విధులకు డుమ్మా కొట్టారు. సిబ్బంది రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఇక్కడ 9 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఏ ఒక్కరూ సచివాలయంలో లేకపోవడం, వివిధ సమస్యలపైన వచ్చిన ప్రజలు వెనుతిరిగినట్లు తెలిసింది.
మండలపరిధిలోని మం డ్లిపల్లి మిట్ట వద్ద రైతు రామిరెడ్డి సాగుచేసిన మల్బరీ తోటలో మ ల్బరీ సాగుచేసే రైతులకు సెరికల్చర్ ఏడీ వెంకట స్వామినాయక్ గురువారం అవగాహన కల్పించారు. ఎకరం మల్బరీ సాగుకు సాధారణ రైతులకు ప్రభుత్వం రూ.22,500, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.27వేల సాయం అందిస్తోందన్నారు. ఐదెకరాల వరకు ప్రభు త్వం సబ్సిడీ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు
తలుపుల మండలం ఓబుల రెడ్డిపల్లిలోని స్థానిక జిల్లాపరిషత ఉన్నత పాఠశాల ఆవరణంలో గురువారం ఎస్టీయూ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా విజయవర్ధన రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా హరిప్రసాద్రెడ్డి, మహిళా కన్వీనర్ పద్మజ, మైనార్టీ కన్వీనర్ తబ్రేజ్ బాషా, జిల్లా కౌన్సిలర్లుగా రమణానాయక్, మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన సొమ్మును విడుదల చేసినందుకు బుధవారం టీడీపీ మండల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభి షేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు.
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్ర సాద్ పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని హిందూపురం రోడ్డులో ఉన్న వ్యవసాయ పరిశోధన కేంద్రంలో బుధవారం ‘పీఎం కిసాన - అన్నదాత సుఖీభవ’ పథకం కింద రెండో విడుత సహయాన్ని పంపిణీ చేశారు.
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా కుమ్మరవాండ్లపల్లిలోని స్తోత్రాద్రి కొండ చుట్టూ స్వామివారి భక్తులు మంగళవారం గిరిప్ర దక్షిణ చేశారు. మొదటగా స్వామివారి భక్తులు లక్ష్మీనరసింహ స్వా మి వారి తూర్పు రాజగోపురం వద్ద నుంచి బయల్దేరారు. శ్రీవారు వెలసిన స్తోత్రాద్రికి హారతి ఇచ్చిన అనంతరం హరినామ కీర్తనలు, గోవింద నామస్మరణతో శ్రీవారి స్తోత్రాద్రి కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు.
మండలకేంద్రం లోని ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సోమవారం 72వ అఖిలభారత సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చైర్మన చంద్రశేఖర్నాయుడు, సబ్డివిజనల్ సహ కార అధికారి ప్రభావతి, సీఈఓ బాబాఫకృద్దీన హాజరయ్యారు. ముం దుగా జెండాను ఆవిష్కరించారు.