Home » Kadiri
దాదాపు యాభై ఏళ్ల క్రితం వారపుసంత నిర్వహించేందుకు మండలకేంద్రానికి కూతవేటు దూరం లో సంతగేటు కాలనీ ఏర్పాటైంది. ఎంతోమంది నిరుపేదలు అక్క డ ఇళ్లు నిర్మించుకుని నివాసాలుండేవారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా, ప్రస్తుతం 20కి పైగా కుటుంబాలు ఉన్నాయి. 150 మం దికిపైగా జనం నివసిస్తున్నారు.
ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవీ మాత ఆత్మార్పణ దినాన్ని పట్టణంలోని కన్యకాపరమేశ్వర ఆల యంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వ హించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభించారు. వాసవీ మాతకు వెయ్యిలీటర్లకుపైగా పాలతో అభిషేకం చేశారు.
మున్సిపాలిటీలో పనిచేస్తున్న అదనపు కార్మికులు, కరోనా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని వారు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
యోగివేమన జయంతి ఉత్స వాల సందర్భంగా మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ అనం తపురం జిల్లా అధ్యక్షుడు పూ ల నాగరాజు, జిల్లా నాయకులు గుండుమల తిప్పేస్వామి తదితరులు యోగివేమన ఆలయంలోని సమాధి వద్ద నివాళులు అర్పించారు.
దేశ రాజకీయాలలో ఒక సంచలనంగా మొదలైన ప్రస్థానం ఎవరిదైనా ఉందంటే.. ఆల్ టైమ్ రికార్డ్గా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుదేనని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీ రామారావు వర్ధంతిని ఆదివారం పట్టణంలో టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఆదర్శ పాలకుడిగా శ్రీకృష్ణదేవరాయలు చరిత్రలో నిలిచారని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ నాయకులు కొనియాడారు. శనివారం శ్రీకృష్ణదేవరాయలు జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని కోనేరు వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
ఎంపీటీసీలకు చెల్లించాల్సిన గౌరవ వేతనం మూడున్నరేళ్లుగా చెల్లించలేదని, తమ పదవీకాలం పూ ర్తి అయ్యేలోగా చెల్లిస్తారా? అని కోటపల్లి ఎంపీటీసీ సభ్యురాలు వెంకట సుబ్బమ్మ అధికారులను ప్రశ్నించారు. మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఎంపీపీ వైవీ కౌసల్య అధ్యక్షతన అధికారులు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
యోగా వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా మండలపరిధిలోని కటారుపల్లి ఆలయ ప్రాంగ ణంలో పలు అభివృధ్ది పనులను ముమ్మరంగా చేపట్టారు. కటారుప ల్లిలో ప్రజాకవి విశ్వవేమన జయంతిని అధికారికంగా జరపాలని నిర్ణయించడంతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఎగుడు దిగుడు, గుంతల రోడ్లతో ప్రయాణం భా రమవుతోంది. పాలకులు మారినా తమ బాధలు తప్పలేదని వెంకటాపురం పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. మండలపరిధిలో కదిరి - హిందూపురం ప్రధాన రహదారి... వెంక టాపురం పంచాయ తీ లోని నారప్పగారిపల్లి నుంచి వెంకటాపురం మీదుగా కరకమాను తోపు వరకు పూర్తిగా దెబ్బ తింది.
మండల కేంద్రంలోని కదిరి - రాయచోటి ప్రధాన రహదారిలో ద్విచక్రవాహనాలు, ఆటోలను ఎక్కడప డితే అక్కడ నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతు న్నాయని ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు తెలుపుతున్నారు. కదిరి - రాయచోటి ప్రధాన రహదారి నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది.