Home » Kadiri
ప్రతి కార్యకర్తకు అండ గా ఉంటాననీ, కార్యకర్తలే తన కుటుంబ సభ్యులని ఎమ్మెల్యే కంది కుంట వెం కటప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన హాల్లో బుధవారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజాస్వామ్యం, కేసుల గురించి మాట్లాడే అర్హత వైసిపి నేతలకు లేదన్నారు.
పట్టణంలో వెలసిన ప్రముఖ పు ణ్యక్షేత్రమైన ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన క్యాలెం డర్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బుధవారం ఆలయంలో ఆవిష్కరించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థించామ న్నారు.
మండలపరిధి లోని పెడబల్లిగ్రామ చెరువు ఆకట్టు కింద రైతులు పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో విద్యుత 11కేవీ వైర్లు చాలా తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి. దీంతో ఆ వైర్లు వెళుతున్న తమ పొలాల్లోకి వ్యవసాయ పనులు చేసేందుకు ట్రాక్టర్లు రావడం లేదని రైతులు వెంకటరమణ, వెంకటయ్య తదితరులు పేర్కొన్నారు.
ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని మంగళవారం మం డల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో స్తోత్రాద్రి కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు.
మండలపరిధిలోని చంద్ర బాబునాయుడు కాలనీలో అధికారులు తాగునీటి సరఫరా కోసం కొళా యిలు ఏర్పాటుచేశారు. కాలనీలోని రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన కొ ళాయి నీరు ఎటూ వెళ్లడానికి వీలు లేకుండాపోయింది. దీంతో కొళాయి చుట్టూ పెద్ద గుంత ఏర్పడి, నీరు నిలువ ఉంది. ఈ నీటిలో దోమలు విచ్చలవిడిగా వృద్ది చెందుతున్నాయి.
ఉపముఖ్యమంత్రి పవన కళ్యాణ్పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు ఆదివారం రూరల్ సీఐ నాగేంద్రకు ఫిర్యాదు అందజేశారు. గాండ్లపెంట మండల పరిధి లోని చామాలగొందికి చెందిన హరినాయుడు సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రిపై అసభ్యకర పోస్టులు పెట్టారన్నారు.
తాము చదువుకున్న పాఠ శాలలో నీటి సమస్య ఉన్నట్లు తెలుసుకున్న పూర్వ విద్యార్థులు స్పందిం చారు. పాఠశాలలో బోరు వేయించి, నీటి సమస్యను పరిష్కరించారు. మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల మున్సిపల్ ఉన్నతపాఠశాలలో చాలా రోజుల నుంచి నీటి సమస్య నెలకొంది. విద్యార్థులు ఇళ్ల నుంచి బాటిళ్లలో నీటిని తెచ్చుకుని దాహార్తి తీర్చుకునేవారు.
ఖరీఫ్లో సాగు చేసిన కందిపంటకు మంచు కురవడంతో కందిపూత దెబ్బతినే అవకాశం ఉం దని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో మండల వ్యాప్తంగా పలువురు రైతులు కందిపంట సాగు చేశారు. అయితే కంది సస్యరక్షణకు ఎన్నో మెళకువలు పాటించి, తెగుళ్ల నివారణకు మందులు పిచికారీ చేశారు.
మండలపరిధిలోని నల్ల గుట్టపల్లి తండాకు వెళ్లే రహదారి మధ్యలో ఉన్న బ్రిడ్జిపై ప్రయాణం ప్ర మాదకరంగా ఉందని గ్రా మస్థులు అంటు న్నారు. పెడబల్లి నుంచి నల్లగు ట్టపల్లికి వెళ్లే మార్గ మధ్య లో ఆర్డీటీ ఆధ్వర్యంలో పాపాగ్ని నదికి అడ్డంగా ఈ బ్రిడ్జి నిర్మించారు.
లబ్ధిదారుల సమస్యలను పరిష్కామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండల పరిధిలోని చామాలగొంది పంచాయతీ బయ్యా రెడ్డిగారిపల్లిలో శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయనతో పాటు ఆర్డీవో వీవీఎస్ శర్మ పాల్గొన్నారు.