Home » Kadiri
విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ముస్తాబ్ కార్యక్ర మానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు.
హంద్రీనీవా నీటి తో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని పాలకులు ఇచ్చిన మాట ను నిలపెట్టుకున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి చెర్లోపల్లి రిజర్వా యర్కు, అక్కడి నుంచి చిత్తూరు వరకు నీటి సరఫరాకు వెళ్లే ప్రధాన కాలువ నుంచి కదిరి నియోజకవర్గంలో చెరువులకు నీరు నింపేందుకు చిన్న కాలువలు తీశారు.
జాతీయ స్థాయి డ్యాన్స స్పోర్ట్స్ పో టీలకు తమ పాఠశాల వి ద్యార్థి అసద్ అహ్మద్ ఖాన ఎంపికైనట్లు స్థానిక బ్లూమూన విద్యాసంస్థల చైర్మన శివశంకర్ తెలిపా రు. ఆంధ్రప్రదేశ డ్యాన్స స్పోర్ట్స్ అసోసియేషన ఆధ్వర్యంలో ఈ నెల 14న అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన ఏపీ స్టేట్ డ్యాన్సస్పోర్ట్స్ చాంపియనషిప్ పోటీలలో అహ్మద్ పాల్గొని ఉమ్మడి జిల్లా తరఫున మొదటి స్థానంలో నిలిచాడన్నారు.
ప్రతి కార్యకర్తకు అండ గా ఉంటాననీ, కార్యకర్తలే తన కుటుంబ సభ్యులని ఎమ్మెల్యే కంది కుంట వెం కటప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన హాల్లో బుధవారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజాస్వామ్యం, కేసుల గురించి మాట్లాడే అర్హత వైసిపి నేతలకు లేదన్నారు.
పట్టణంలో వెలసిన ప్రముఖ పు ణ్యక్షేత్రమైన ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన క్యాలెం డర్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బుధవారం ఆలయంలో ఆవిష్కరించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థించామ న్నారు.
మండలపరిధి లోని పెడబల్లిగ్రామ చెరువు ఆకట్టు కింద రైతులు పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో విద్యుత 11కేవీ వైర్లు చాలా తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి. దీంతో ఆ వైర్లు వెళుతున్న తమ పొలాల్లోకి వ్యవసాయ పనులు చేసేందుకు ట్రాక్టర్లు రావడం లేదని రైతులు వెంకటరమణ, వెంకటయ్య తదితరులు పేర్కొన్నారు.
ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని మంగళవారం మం డల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో స్తోత్రాద్రి కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు.
మండలపరిధిలోని చంద్ర బాబునాయుడు కాలనీలో అధికారులు తాగునీటి సరఫరా కోసం కొళా యిలు ఏర్పాటుచేశారు. కాలనీలోని రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన కొ ళాయి నీరు ఎటూ వెళ్లడానికి వీలు లేకుండాపోయింది. దీంతో కొళాయి చుట్టూ పెద్ద గుంత ఏర్పడి, నీరు నిలువ ఉంది. ఈ నీటిలో దోమలు విచ్చలవిడిగా వృద్ది చెందుతున్నాయి.
ఉపముఖ్యమంత్రి పవన కళ్యాణ్పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు ఆదివారం రూరల్ సీఐ నాగేంద్రకు ఫిర్యాదు అందజేశారు. గాండ్లపెంట మండల పరిధి లోని చామాలగొందికి చెందిన హరినాయుడు సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రిపై అసభ్యకర పోస్టులు పెట్టారన్నారు.
తాము చదువుకున్న పాఠ శాలలో నీటి సమస్య ఉన్నట్లు తెలుసుకున్న పూర్వ విద్యార్థులు స్పందిం చారు. పాఠశాలలో బోరు వేయించి, నీటి సమస్యను పరిష్కరించారు. మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల మున్సిపల్ ఉన్నతపాఠశాలలో చాలా రోజుల నుంచి నీటి సమస్య నెలకొంది. విద్యార్థులు ఇళ్ల నుంచి బాటిళ్లలో నీటిని తెచ్చుకుని దాహార్తి తీర్చుకునేవారు.