Home » Kadiri
ప్రజాసమస్యల పరిష్కారినికి ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు.
పాత చట్టాలలో ఉన్న కొద్దిపాటి హక్కులను కూడా రద్దు చేసి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని సీపీఎం పొలిట్ సభ్యుడు బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు.
మండల పరిఽఽధిలోని తూ పల్లి పంచాయతీ పోరెడ్డివారిపల్లిలో బుధవారం ‘రైతన్నా మీకోసం’ కార్య క్రమం నిర్వహించారు. ఆర్డీఓ వీవీఎస్ శర్మ పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ రెండో విడత రూ. 7వేలు వారి ఖాతాలో జమచేసిందన్నారు. జమ కాని రైతులు వ్యవసాయ కా ర్యాలయంలో అధికారులను సంప్రదించాలని సూచించారు.
స్వచ్ఛత, పరిశుభ్రత అంటూ అధికారులు ఫొటోలకు ఫోజులు ఇస్తారు కానీ ఆచరణ, ఆమలు పట్టించుకోరని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు. దీంతో గ్రామాల్లో పరిశుభ్రత, చెత్త నుంచి సంపద సృష్టి, తద్వారా పంచాయతీల అభివృద్ధి అనే ప్రభుత్వ లక్ష్యాన్ని పాలకులు, అధికారులు తుంగలో తొ క్కేస్తున్నా రనే విమర్శలు వినవస్తున్నాయి.
ఇమామ్లు, మౌజన లకు గౌరవ వేతనం ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేసిన కారణంగా నల్లచెరువు బస్టాండ్ కూడలిలో మండలంలోని ముస్లిం మత పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
మండల పరిధిలోని ఓరు వాయి పంచాయతీ కుమ్మరవాండ్లపల్లిలో మంగళవారం మండల వ్యవ సాయ అధికారి లక్షీప్రియ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమం నిర్వ హించారు. గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వివరించారు.
నియోజక పరిధిలోని పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుమారు 1000 విద్యా ర్థులకు మాదిరి ప్రశ్న పత్రాల పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు స్థానిక సిమ్స్ హాస్పిటల్ అధినేత నిసార్ యాసీన ఖాన, యూటీఎఫ్ సీనియర్ నాయకులు బి. మైనుద్దీన రూ.80 వేలను అందజేశారు. ఈ సొమ్మును వారు సోమవారం సిమ్స్ హాస్పిటల్ వద్ద యూటీఎఫ్ జిల్లా కోశాధికారి డి. శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి తాహేర్వలికి అందజేశారు.
తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో తన వంతుగా సొంత నిధులు రూ. 70వేలతో పూర్వ విద్యార్థి, జనసేన మండల కార్యదర్శి కొండబోయన సతీష్ డయాస్ నిర్మాణ పనులను చేపట్టారు.
ప్రజల ఆరోగ్యం బాగు కోసం ఫ్లోరైడ్ రహిత నీటిని ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకా న్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంక్రింద రూ. 2లకు 20 లీటర్ల శుద్దినీటిని పంపిణీచేసే విధంగా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఓబుళదేవరచెరువు సమీపంలోని ఆకుతోటపల్లి వద్ద తాగునీ టి కేంద్రాన్ని ఏర్పాటు చేసి యంత్రాలను సమకూర్చింది.
పంచాయతీ అధికా రులు, పాలకుల నిర్లక్ష్యా నికి అద్దంపట్టే విధంగా మండలంలోని వేపరాల్ల గ్రామంలోని తాగునీటి ట్యాక్ దర్శనమి స్తోందని గ్రామ స్థులు విమర్శిస్తున్నారు. వేపరాల్ల పంచాయతీలో సుమారు వందకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలోని పంచాయతీ తాగునీటి ట్యాంక్ నీటినే వారు తాగడానికి వినియోగిస్తారు.