Home » Kadiri
మండలకేంద్రంలో పాడుబడిన పోలీస్ క్వార్టర్స్ ప్రాంతంలో ముళ్లకంపలు, పిచ్చికంపలు పెరిగి పోవడంతో చుట్టుపక ్కల కాపురాలున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి నుంచి ప్రతిరోజు పాములు బయటకు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఇళ్లకు వాకిళ్లు వేసుకొని, బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని, ఎవరితో చెప్పుకోవాలని వాపోతున్నారు.
వచ్చే ఏడాది 2025-26 సంవత్సరంలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను అసిస్టెంట్ కమిషనర్ లాజర్ బుధవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో వచ్చే ఏడాది నిర్వహించే పదో తగరతి పరీక్షా కేంద్రంలో వసతులు, గదులు, బల్లలు, ఫ్యానలు, మంచి నీటి సౌకర్యంపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో ఆరా తీశారు.
మండలపరిదిలోని గంటాపురం గ్రామంలో సాగు చేసిన కంది, వేరుశనగ, మొక్కజొన్న పంటలను శాస్త్రవేత్త మాధవిలత, ఏడీఏ లక్ష్మనాయక్ బుధవారం పరిశీలించారు. కందిలో మరుకా మచ్చల పురుగును గుర్తించారు. దీని నివారణకు వేప నూనె 1000మి.లీ. క్లోరోఫైరిఫాస్ 500మి.లీ. కలిపి ఎకరాకు పిచికారి చేయాలని తెలిపారు.
పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కదిరి డివిజన స్థాయి ఎస్జీఎఫ్ పోటీలను డీఈఓ కిష్టప్ప బుధవారం ప్రారంభించారు. బాల బాలికలు అండర్ -14, 17 విభాగాలలో చెస్, యోగా, షటీల్ క్రీడలలో పాల్గొన్నారు.
మునిసిపాలిటీలో ఏ స్థాయి ఉద్యోగి అయినా అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హెచ్చరించారు. ఎమ్మెల్యే బుధవారం మున్సిపల్ కార్యాలయంలోని చైర్పర్సన చాంబర్లో చైర్పర్సన దిల్షాద్ ఉన్నీసా, వైస్ చైర్మెన రాజశేఖర్ ఆచారితో పాటు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడితే ఏ స్థాయి ఉద్యోగి అయినా ఉపేక్షించమని అన్నారు.
తాగునీటి సౌకర్యం కల్పించాలంటూ మండలపరిధి లోని దోరణాల గ్రామస్థులు కోరారు. ఈమేరకు మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మండల పరిధిలోని కటారుపల్లి పంచాయతీ దోరణాల గ్రామంలో తాగునీటి బోరు తరచూ మరమ్మతులకు గురు వుతోందని తెలిపారు.
మండలంలో రైతులు సాగుచేసిన కర్బూజ పంట పొలాలను ఉద్యానశాఖాధికారులు సోమవారం పరిశీలించారు. మండల వ్యాప్తంగా సాగుచేసిన పలువురు రైతులకు కర్బూజ కన్నీరు మిగిల్చింశీ ‘కన్నీళ్లు మిగిల్చిన కర్బూజ’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో సోమవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన ఉద్యానశాఖ అధికారి ప్రతాప్రెడ్డి మండలంలో కర్బూజ సాగు చేసిన పొలాలను పరిశీలించారు.
జిల్లాలో చియా సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ. శ్యాంసుందర్ వ్యవశాయ శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమం అనంతరం చియా సాగు విఽధానంపై ప్రచార కరపత్రాలను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి రాము నాయక్, ఆర్డీఓ వీవీఎస్ శర్మతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.
పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు సమస్యల వెల్లు వెత్తాయి. నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు అమడ గూరు మండల ప్రజలు తరవచ్చారు. మొత్తం 551 ిఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఎన్పీకుంట మం డలం వంకమద్దికి చెందిన రైతులు తాము తమ భూములను సోలార్కు ఇవ్వమని, తమకు జీవానాధారం అవేనని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
మండల పరిఽధిలోని ముండ్లవారి పల్లి సమీపంలో పాపాగ్ని నదికి అడ్డంగా నిర్మించిన సీజీ ప్రా జెక్ట్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. పది రోజులుగా కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వందమానేరు, పాపాగ్ని నది ప్రవహించ డంతో డ్యాంకు పూర్తి స్థాయిలో నీరుచేరింది. దీంతో మూడు రోజుల నుంచి ప్రతి రోజు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నా రు.