Home » Kadiri
నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేద్దామని మున్సిపల్ కమిషనర్ కిరణ్కుమార్, వయో జన విద్యాశాఖ నోడల్ అధికారి జనార్దన పిలుపునిచ్చారు. నిరక్షరాస్యులను చదువరులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్ అక్షరాం ధ్ర కార్యక్రమంపై బుధవారం మున్సిపల్ కార్యాలయంలో అవగాహన సద స్సు నిర్వహించారు.
మండల కేంద్రం లోని బు క్కపట్నం రహదారి సమీపం లో ఉన్న నల్లమ్మ ఆ లయం మలుపులో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు, ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఏమీ కాలేదు. ఆ మ లుపులో ఇరు వాహనాల డ్రైవర్లు హారన కొట్టకుండా ఎదురెదు రుగా వచ్చారు. అయితే ఇరువురూ సడన బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో విద్యార్థులు భయపడి కేకలు వేశారు.
‘నాడు - నేడు’ పథకం కింద ఎంపికైన కొన్ని ప్రభుత్వ పాఠ శాలల్లో చేపట్టే పనులకు నిధులున్నా, నేటికీ సౌకర్యాలు కల్పించడం లేదు. మండల వ్యాప్తంగా 58 ప్రభుత్వ పా ఠశాలలు ఉన్నాయి. 46 ప్రాథమిక, ఏడో ప్రాథమికోన్న త, నాలుగు జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలు, కేజీబీ వీ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మా ర్చి కార్పొరేటు పాఠశాలలకు దీటు గా తీర్చిదిద్దుతామని చెప్పిన గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో నిధులు ఇ వ్వకపోవడంలో పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి.
గంటల కొద్దీ త్వరగా వెరిఫికే షన పూర్తి చేయాలని దివ్యాంగ పింఛన దారులు సోమవారం స్థానిక ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. వైసీపీ పాలనలో ఇష్టారాజ్యంగా పింఛన్లు పంపిణీ చేశారు. అర్హత లేకపోయినా కొంతమంది దివ్యాంగుల పేరుతో ధృవప్రతాలు సంపాదించి పింఛన్లు పొందుతున్నారు.
మండల కేంద్రంలోని సచివాల యం-3లో డిజిటల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ, వెల్పేర్అసిస్టెంట్, ఏఎనఎం, మహిళా పోలీసు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన వారు డెప్యుటేషనపై కలెక్టరేట్కు, డీపీఓ కార్యాలయానికి వెళ్లినట్లు సమా చారం. దీంతో వివిధ పనులపై సచివాలయానికి వచ్చే సంబంధిత సిబ్బం ది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సమీపంలోని వాగు ప్రవహిస్తే మండల కేంద్రంలోని విద్యుత సబ్స్టేషనలోకి నీరువస్తాయి. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో కదిరి - రాయచోటి రోడ్డు వద్ద వాగు పక్కన విద్యుత సబ్ స్టేషన నిర్మించారు. గతంలో భారీ వర్షా ల కారణంగా సబ్స్టేషనలోకి నీరు చేర డంతో విద్యుత అంతరాయం ఏర్పడింది. అయితే ఇప్పటివరకు సబ్స్టేషనలోకి వాగు నీరు ప్రవహించకుండా ఎలాంటి ప్రహరీ నిర్మించలేదు.
మండలంలోని బడన్న పల్లికి వెళ్లాలంటే ఇప్పటికీ మట్టి రోడ్డే గతి. పైగా ఆ రోడ్డులో గుంతలు ఏర్ప డ్డాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆ గుంతల్లో వర్షపునీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ధర్మవరానికి వెళ్లే రహదారి క్రాస్ నుంచి రైల్వే బ్రిడ్జి కింద వరకు కిలోమీటర్ మేర మట్టిరోడ్డు గుంతలమయం అయింది. దీంతో ప్ర స్తుతం కురుస్తున్న వర్షాలతో నీరంతా ఆ గుంతల్లో నిలిచి మడుగును తలపిస్తోంది. అలాగే రోడ్డుంతా బురదమయం అయింది.
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పే ర్కొన్నారు. ఆయన ఆదివారం మండలంలోని చెర్లోపల్లి రిజర్వాయర్ నుం చి పుంగనూరు బ్రాంచ కెనాల్కు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారఽథి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇనచార్జ్ భైరవప్రసాద్తో కలిసి నీటిని విడుదల చేశారు.
ఆ రోడ్లలో ప్రయాణించా లంటే ఒళ్లు గుల్ల అవుతోంది. అసలే వర్షాకాలం, ఏ గుంత ఎంత లోతు ఉంటుందో తెలియని పరిస్థితి. రోడ్లు వర్షపు నీటితో నిండిపోవడంతో ఎక్కడ ఎంతలోతు గుంతలున్నాయో తెలియక ద్విచక్రవాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. అదుపు తప్పి గాయాలపాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేశారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. లచ్చన్న సాహసానికి, కార్య దీక్షతకు మెచ్చి ప్రజలే సర్దార్ అనే బిరుదును ఆయనకిచ్చారని గుర్తు చేశారు.