Home » Kadiri
పట్టణంలోని ఖాద్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంతో పాటు శనివారం కావడంతో జిల్లా నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించు కున్నారు. అలాగే వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో వి ద్యార్థులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
అసలే అరకొరగా వస్తున్న నీరు... ఆ పై ఎరువుల కొరత... రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోం ది. ఖరీఫ్ సీజనలో సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలకు యూరి యా వాడకం అధికంగా ఉంటుంది. నెలకు ఒకమారు చొప్పున తక్కువ మోతాదులో యూరియాను పంటలకు వేస్తుంటారు. కానీ మండల రైతులకు ప్రస్తుతం యూరియా అందుబాటులో లేదు.
మండలంలోని చిన్నరామన్నగారిపల్లి పంచాయతీ కేంద్రం నుంచి ఆ పంచా యతీలోని తురకవానిపల్లికి దాదాపు 30 యేళ్ల క్రితం నిర్మించిన రోడ్డు చాలా అధ్వానంగా మారింది. కంకర తేలిన రోడ్డు ప్రయాణించేందుకు ఆ గ్రామస్థు లు చాలా అగచాట్లు పడాల్సి వస్తోంది. చిన్నరామన్నపల్లి నుంచి తురకవానిపల్లి వరకు 30 ఏళ్ల క్రితం మూడు కిలో మీటర్ల తారు రోడ్డు నిర్మాణం చేపట్టారు.
నియోజకవర్గంలోని ఏడు పోలీసు స్టేషనలకు ఎమ్మెల్యే కందికుంట వెం కటప్రసాద్ కొత్త వాహనాలను సమకూర్చారు. వాటి తాళంచెవులను శనివారం ముఖ్యమంత్రి చేతుల మీ దుగా ఎస్పీ సతీ్షకు మార్కు అందజేశారు. ని యోజకవర్గంలో ఉన్న పో లీసు వాహనాలు చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి,
పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి భద్రత అని ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ధర్మవరంలోని కేహెచ ప్రభుత్వ డిగ్రీకళాశాల ఎనఎస్ఎస్ వలంటీర్లు మండలంలోని గొట్లూరులో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబి రాన్ని ఆయన శనివారం సందర్శించారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం తలుపుల మండ లంలోని పెద్దన్నవారిపల్లికి వచ్చారు. హెలిప్యాడ్ వద్ద నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రెవెన్యూ శాఖమంత్రి, జిల్లా ఇనచార్జ్ మంత్రి అవగా న సత్యప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి ఎమ్మెల్యేలు కందికుంట వెంక టప్రసాద్, పరిటాల సునీత, పల్లె సింధూరరెడ్డితదితరులు పుష్పగుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు.
మండలకేంద్రంలో వెలసిన హజరత ఓడీసీ బాబా పదో ఆరాఽధనోత్సవాన్ని బాబా దర్గా సన్నిధిలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు బైపరెడ్డి ఆధ్వర్యంలో దర్గా ఆవరణను వివిధరకాల పుష్పాలు, విద్యుతదీపాలతో అలంకరిం చారు. రాత్రి బాగేపల్లి స్వామివారి ఆధ్వర్యంలో గంధోత్సవం నిర్వహించారు. పెనుకొండ ఫకీర్ల జలసాలతో బాబాకు గంధం సమర్పించారు.
స్థానిక ఎస్టీఎస్ఎన డిగ్రీ కళాశాలలో శుక్రవారం మూడో రోజు ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్ -14, 17 బాల బాలికల క్రీడల పోటీలు కొనసాగా యి. ఇందులో హైజంప్, లాంగ్ జంప్, 100, 200, 400, 800, 1500 మీటర్ల పరుగుపందెంతో పాటు డిస్క్ త్రో, షాట్పుట్, జావ్లింగ్ త్రో సంబంధిత క్రీడల పోటీలు నిర్వహించారు.
ఎవరో వస్తా రనీ... ఏదో చేస్తారనీ ఎదురు చూడకుండా మండలం లోని నడిమికుంటపల్లి, రత్నగిరి, సుబ్బరాయనిపల్లి ప్రజలు ఒక్కటయ్యారు. మూడు గ్రామా లలో గ్రామపెద్దల సమక్షంలో సమావేశమై ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి, కొంత విరా ళం వచ్చేలా తీర్మానించారు. మూడు గ్రా మాలలో కలిపి రూ. లక్ష సేకరించారు. ఇంటికి ఒకరు చొప్పున కలిసి, ఎక్స్కవేటర్, ట్రాక్టర్లు అద్దెకు తీసుకున్నారు.
ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగిన డివిజన స్థాయి పోటీలను రెండో రోజు గురువారం ఎంఈఓలు చెన్నకృష్ణ, ఓ బులరెడ్డి ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయురాలు స్వరూప అధ్యక్ష త వహించారు. అండర్-14, 17 బాలికల ఖోఖో విన్నర్స్గా గాండ ్లపెంట మండలం, రన్నర్స్గా కదిరి మండలం జట్లు నిలిచాయి. అండర్ -14, 17 బాలుర ఖోఖో విన్నర్స్గా గాండ్లపెంట మండలం జట్లు, అండర్ -14 రన్నర్గా తనకల్లు మండలం, అండర్-17 రన్నర్ గా కదిరి మండలం జట్టు నిలిచాయి.