Home » Kadiri
స్థానిక ఎంపీడీఓ కార్యా లయం ఆవరణంలో గురువారం ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదికను ఎంపీడీఓ ఆజాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పంచాయతీల వారీగా చేసిన పనులను, అందులో జరిగిన అవినీతిని సామాజిక తనిఖీ అధికారులు వెల్లడించారు.
అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న పేదలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 29 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ. 20లక్షలు చెక్కు లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గురువారం పంపిణీ చేశారు.
మండలంలోని కంబాలపర్తి గ్రామ సమీపంలో గొడ్డిచింతమాను వద్ద ఉన్న ఎగువ బ్రిడ్జికి ఇరురువైపులా రక్ష గోడలు లేవు. దీంతో ఆ దారివెంట రాకపోకలు సాగించే పలువురు ప్రమా దాల బారిన పడుతున్నట్లు ప్రయాణికులు, గ్రామస్థులు వాపోతున్నారు. నల్లమాడ నుంచి పుట్టపర్తికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ఎగువ బ్రిడ్జి రోడ్డుకు సమానంగా ఉంది.
మండలపరిధిలోని పట్నం జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళ నం నిర్వహించారు. ఆ పాఠ శాలలో 1993-94లో పదో తరగతి చదివిన విద్యార్థులు మూడు దశాబ్దాల తరువాత అందరూ ఒకచోట చేరారు.
మండలపరిధిలోని పాలపాటి దిన్నె ఆంజనేయస్వామి ఆలయం శ్రావణమాసం చివరి శనివారం పురస్క రించుకుని భక్తులతో కిటకిటలా డింది. ఈ సందర్భంగా అర్చకులు స్వా మివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగించారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్తప్ర సాదాలు అందచేశారు.
మండల కేంద్రంలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతోందని గ్రామస్థు లు వాపోతున్నారు. మురుగునీరు వెళ్లడానికి ఏర్పాటు చేసిన కాలువలు చెత్తచెదారంతో నిండిపోయాయి. జీన్లకుంట రోడ్డులోని వెలుగు కార్యా లయానికి వెళ్లే దారిలో కాలువ పూడిపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే పారుతోంని. ఆ నీటిలోనే నడుచుకుంటూ కార్యాలయాలకు, వీధిలోకి వెళ్లాల్సి వస్తోందని కాలనీవాసులు వాపోతున్నారు.
గణేష్ ఉత్సవాలను ప్రశాం తంగా జరుపుకుందామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నా రు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో గురువారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... అందరి సహ కారంతో గణేష్ ఉత్సవాలను వైభవంగా జరుపుకుందామని పేర్కొన్నారు.
మండలకేంద్రంలోని జిల్లాపరిషత ఉన్నతపాఠశాల ఆవరణంలో ఉన్న ఎమ్మార్సీ కార్యాలయం ఇటీవల కురిసిన వర్షానికి కారుతోంది. ఈ భవనాన్ని 1999లో నిర్మించారు. ఈ కార్యాలయంలో ఇద్దరు ఎంఈఓలు, ఒక ఎంఐసీ కోఆర్డినేటర్, ఓ ఆపరేటర్, ఓ మెసెంజర్ విధులు నిర్వహిస్తుంటారు. మండల వ్యాప్తంగా 63 ప్రభుత్వ పాఠశాలలున్నాయి.
కదిరి నుంచి జిల్లా సరిహద్దుగా ఉన్న తనకల్లు మండలంలోని చీకటిమానుపల్లి వరకు అనేక మలుపులున్నాయి. ఈమలుపుల్లో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడంలేదు. ముఖ్యంగా నల్లచెరువు మండలంలోని పెద్దయల్లంపల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు పూర్తిగా కనిపించవు.
మండలపరిధిలోని నిలువురాతి పల్లిలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠను బుధవా రం ఘనంగా నిర్వ హించారు. గ్రామస్థు లంతా కలిసి రూ. కోటి వ్యయంతో గ్రా మంలో నూతనంగా రామాలయం నిర్మించారు. ప్రధాన పౌరోహి తులు మునికోటి కోదండపాణి శర్మ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా 15 మంది వేద పండితులు గణపతి పూజ, కలశస్థాపన, హోమా లు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.