Home » Kadiri
తలుపుల మండలం ఓబుల రెడ్డిపల్లిలోని స్థానిక జిల్లాపరిషత ఉన్నత పాఠశాల ఆవరణంలో గురువారం ఎస్టీయూ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా విజయవర్ధన రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా హరిప్రసాద్రెడ్డి, మహిళా కన్వీనర్ పద్మజ, మైనార్టీ కన్వీనర్ తబ్రేజ్ బాషా, జిల్లా కౌన్సిలర్లుగా రమణానాయక్, మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన సొమ్మును విడుదల చేసినందుకు బుధవారం టీడీపీ మండల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభి షేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు.
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్ర సాద్ పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని హిందూపురం రోడ్డులో ఉన్న వ్యవసాయ పరిశోధన కేంద్రంలో బుధవారం ‘పీఎం కిసాన - అన్నదాత సుఖీభవ’ పథకం కింద రెండో విడుత సహయాన్ని పంపిణీ చేశారు.
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా కుమ్మరవాండ్లపల్లిలోని స్తోత్రాద్రి కొండ చుట్టూ స్వామివారి భక్తులు మంగళవారం గిరిప్ర దక్షిణ చేశారు. మొదటగా స్వామివారి భక్తులు లక్ష్మీనరసింహ స్వా మి వారి తూర్పు రాజగోపురం వద్ద నుంచి బయల్దేరారు. శ్రీవారు వెలసిన స్తోత్రాద్రికి హారతి ఇచ్చిన అనంతరం హరినామ కీర్తనలు, గోవింద నామస్మరణతో శ్రీవారి స్తోత్రాద్రి కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు.
మండలకేంద్రం లోని ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సోమవారం 72వ అఖిలభారత సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చైర్మన చంద్రశేఖర్నాయుడు, సబ్డివిజనల్ సహ కార అధికారి ప్రభావతి, సీఈఓ బాబాఫకృద్దీన హాజరయ్యారు. ముం దుగా జెండాను ఆవిష్కరించారు.
వైసీపీ హయాంలో ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా వృథా చేశారనేందుకు నిదర్శనమే ఈ జగనన్న కాలనీ. అధికారులు, ప్రజాప్రతినిధులు అనాలోచిత నిర్ణయాలతో జగనన్న కాలనీ అడవిని తలపిస్తోంది. తనకల్లు మేజర్ పంచాయతీ పరిధిలోని 30 పల్లెల లబ్ధిదారులకు జగనన్న కాలనీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో 140 మందికి పట్టాలు ఇచ్చారు.
మండల పరిధిలోని గౌళ్లపల్లికి విద్యుత అధికారులు ఎన్నో యేళ్లక్రితమే విద్యుత సౌకర్యం క ల్పించారు. గ్రామంలోకి మూడు వైర్లుతో విద్యుత సరఫరా అందిస్తున్నారు. అయితే గ్రామం సమీపంలో ఆ మూడు విద్యుత వైర్లకు ప చ్చని తీగలు పూర్తిగా అల్లుకుపోయాయి. వైర్ల మొత్తం కిందికి లా గేస్తున్నాయి. అయినా విద్యుత అధికారులు ఆ వైపు కన్నెతి చూసిన పాపాన పోలేదు.
మండల కేంద్రంలోని నివాస గృహాల వద్ద ఉన్న వ్యర్థాల చెత్తకు ఎవరో నిప్పు పెట్టారు. అయిఏ ఆ చెత్త నుంచి దుర్గంధం, కలుషిత వాయువులతో కూడిన పొగ వెలువడుతోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గాండ ్లపెంటలో నిత్యం స్వచ్ఛతా రాయబారులు వీధులలో శుభ్రం చేసి చెత్త, ప్లాస్టిక్, చెప్పులు, పేపర్లు వంటి వ్యర్థాలను ఊరి బయట ఉన్న చెరువు పక్కన దారి వెంబడి వెస్తున్నారు.
రూరల్ పరిధిలోని సున్నపుగుట్ట తండాలో రాత్రికి రాత్రే అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. జాతీయ రహదారికి సమీపంలో శనివారం ఉదయానికే అక్రమ లేఅవు ట్ సిద్ధ మైంది. ఎటువంటి అనుమతులు లేకుండానే రాళ్లు పాతి, ప్లాట్లు వేశా రు. అనధికారికంగా అగ్రిమెంట్లపై అమ్మకాలు కూడా జరిగినట్లు సమాచారం.
విద్యార్థి విద్య పట్ల తప్ప ఇతర ఆ కర్షణలకు లోను కాకూడ దని జూనియర్ సివిల్ కో ర్టు న్యాయాధికారి లోకనా థం పేర్కొన్నారు. పట్టణం లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇనచార్జ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహిం చిన బాలల దినోత్సవంలో న్యాయాధికారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.