Home » Kadiri
పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఆదివారం మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ వరప్ర సాద్ కదిరి పట్టణంలోని వాహనాల యజమానులకు, డ్రైవర్లకు రహదా రి భద్రత నిబంధనలపై అవగాహన క్యార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐపై మాట్లాడుతూ... రహదారి సూచనలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు.
తమకు న్యాయం చేయాలంటూ ఈ నెల 3వ తేదీన చలో విజయవాడ (అగ్రిగోల్డ్ బాధి తుల ఆవేదన యాత్ర) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అగ్రిగోల్డ్ బాధి తుల సంఘం మండల కార్యదర్శి షమీవుల్లా ఆదివారం తెలిపారు. ఆయన ఆదివారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ... అగ్రిగోల్డ్ కంపెనీ చేతిలో మోసపోయి, చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.
మండల వ్యాప్తంగా పలు పంచాయతీల్లో స్వచ్ఛ సంకల్పం సైకిళ్లు తుప్పు పడుతున్నాయి. అయినా అధికారులు, పాలకులు పట్టించు కోవడం లేదు. మండలంలోని 14 పంచాయతీలలో ప్రతి పంచాయతీకి స్వచ్ఛ భారత, స్వచ్ఛ సంకల్పం అనే ట్రై సైకిళ్ళను పంపిణీ చేశారు. అయితే పలు పంచాయతీల్లో వాటి ని వినియోగంచడం అంతంత మాత్రంగానే ఉండటంతో మూలన పడివేశారు.
మండలపరిధిలోని కటారుపల్లిలోని క్రాస్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ) వద్ద నెలకొన్న స్థల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ గ్రామస్థులకు తెలిపారు. ఖబ్బం నరసింహస్వామి ద్వారం స్థలం వివాదాన్ని పరిష్కరించాలని కటారుపల్లి పంచాయతీ వా సులు గత ప్రజావేదికలో ఇచ్చిన అర్జీపై స్పందించిన ఎమ్మెల్యే శనివా రం అక్కడికి వెళ్లి పరిశీలించారు.
మండల పరిధిలోని పి.కొత్తపల్లి పంచాయతీ కేంద్రంలో ఉన్న గ్రామసచివాలయంలో కొద్ది నెలలుగా ప్రింటర్ మిషన పనిచేయడం లేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం వేళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పి.కొత్తపల్లి, పి. కొత్తపల్లి తండా రెండు పంచాయతీలకు సంబంధించి ఇదే గ్రామ సచివాలయం.
ప్రజాసమస్యల పరిష్కారినికి ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు.
పాత చట్టాలలో ఉన్న కొద్దిపాటి హక్కులను కూడా రద్దు చేసి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని సీపీఎం పొలిట్ సభ్యుడు బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు.
మండల పరిఽఽధిలోని తూ పల్లి పంచాయతీ పోరెడ్డివారిపల్లిలో బుధవారం ‘రైతన్నా మీకోసం’ కార్య క్రమం నిర్వహించారు. ఆర్డీఓ వీవీఎస్ శర్మ పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ రెండో విడత రూ. 7వేలు వారి ఖాతాలో జమచేసిందన్నారు. జమ కాని రైతులు వ్యవసాయ కా ర్యాలయంలో అధికారులను సంప్రదించాలని సూచించారు.
స్వచ్ఛత, పరిశుభ్రత అంటూ అధికారులు ఫొటోలకు ఫోజులు ఇస్తారు కానీ ఆచరణ, ఆమలు పట్టించుకోరని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు. దీంతో గ్రామాల్లో పరిశుభ్రత, చెత్త నుంచి సంపద సృష్టి, తద్వారా పంచాయతీల అభివృద్ధి అనే ప్రభుత్వ లక్ష్యాన్ని పాలకులు, అధికారులు తుంగలో తొ క్కేస్తున్నా రనే విమర్శలు వినవస్తున్నాయి.
ఇమామ్లు, మౌజన లకు గౌరవ వేతనం ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేసిన కారణంగా నల్లచెరువు బస్టాండ్ కూడలిలో మండలంలోని ముస్లిం మత పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.