Home » Kadiri
మండలంలోని బొం తపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు వంకలు, వాగులు, చెరువులు, కుంటలు పొంగిపోర్లాయి. బొంతలపల్లికి చెందిన రామిరెడ్డి మూ డున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగుచేశారు. పంట సాగు చేయడానికి రూ.50వేలుకు పైగా ఖర్చు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో భారీగా కురిసిన వర్షాలకు పూర్తిగా నీటిలో మునిగి పోయింది.
ప్రస్తుతం సీజనలో జ్వరాలు ప్రబలుతున్నాయని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీఎంహెచఓ ఫైరోజ్ బేగం పేర్కొన్నారు. ఆమె గురువారం పట్టణంలోని నాలుగు అర్బన హెల్త్ సెంటర్లతో పాటు నల్లచెరువు మండలంలోని ఎం. అగ్రహా రంలో పర్యటించారు. ఎం. అగ్రహారం ప్రాథమిక కేంద్రంలో మహిళ ఆ రోగ్యం, కుటుంబ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన డైరెక్టర్ ఫర్వీన బాను పేర్కొన్నారు. పట్టణంలోని ఐదో వార్డులో ఉన్న మున్సిపల్ పార్కులో గురువారం చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిం చారు.
మండలపరిధిలోని జాతీయ రహదారికి అనుకుని ఉన్న దేవరింటిపల్లి బస్షెల్టర్ ప్రాంతలో అపరిశు భ్రత నెలకొంది. బస్టాప్ చుట్లూ పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు ఏపుగా పెరిగి పోయింది. ఆ ప్రాంతం చెత్తచె దారంతో నిండిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి మండలంలోని ప్రసిద్ధి చెందిన పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి దేవస్థానానికి వెళ్లే భక్తులు ఈ బస్టాప్ వద్దే దిగుతారు.
పట్టణంలోని తహసీల్దార్ కార్యాల యం వద్ద వాహనాలు నిలపకుండా రెవెన్యూ అధికారులు తీసిన గుంతల తో దివ్యాంగుల ఉపాధికి ఆటకం ఏర్పడింది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట పలువురు దివ్యాంగులు ఆర్జీలను పూర్తిచేసి, లబ్ధిదారులకు అంది స్తుంటారు. దానితో వచ్చే ఆదాయం వచ్చేది. గుంతలు తీయడం వల్ల ది వ్యాంగులు కూర్చోవడానికి అవకాశం లేకుండాపోయింది.
ఓజోన పొరను కా పాడుకుందామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ స్మిత పేర్కొన్నారు. ప్రపంచ ఓజోన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కళాశాలలో అవగాహన కల్పించారు. ఇండియన రెడ్క్రాస్ సొసైటీ, ఎనసీసీ, ఎనఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్ర మం నిర్వహించారు.
విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్సిస్తూ, విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో నూతనంగా పీఎం సీ నిధులతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
మండల వ్యాప్తంగా పశు వు ల దాహార్తి తీర్చడానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద 45 నీటి తొట్టె లు నిర్మించారు. వాటికి పైప్లైన ఏర్పాటు చేసి, నీటిని సరఫరా చేయ డం లేదు. ఈ యేడాది వర్షాలు తక్కువగా నమోదు కావడంతో మండలం లో నీటి నిల్వలు లేవు. పలు గ్రామాల్లో తొట్టెలకు నీటిని సరఫరా చేయక పోవ డంతో పశువుల దాహార్తి తీర్చేందుకు వాటి యజమానులు ఇబ్బందులు పడుతున్నారు.
మండలంలోని కటారు పల్లి పంచాయతీ ద్వారణా ల గ్రామంలో కాలిపోయిన తాగునీటి బోరు మోటా రుకు మరమ్మతులు చే యాలని గ్రామస్థులు కోరు తున్నారు. నెలరోజుల క్రితం మోటారు కాలిపోవ డంతో గ్రామంలో తాగునీటికి తీవ్ర సమస్య ఏర్పడిందంటున్నారు.
మండలపరిధిలోని పా లపాటి దిన్నె ఆంజనే య స్వామి ఆలయం శనివా రం భక్తులతో కిటకిటలా డింది. ఉదయం ఆలయ శుద్ధి, స్వామివారికి అభి షేకాలు, ప్రత్యేక అలం కరణ, ఆకుపూజ, అర్చన లు చేశారు. వివిధ రాష్ట్రా ల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకు ని మొక్కులు తీర్చుకు న్నారు.