Home » Jubilee Hills
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం జీహెచ్ఎంసీ యూసుఫ్గూడ సర్కిల్-19 కార్యాలయాన్ని ఎన్నికల పరిశీలకుడు సర్ఫరాజ్ అహ్మద్ సందర్శించారు. ఈఆర్ఓ, సర్కిల్-19 డీఎంసీ రజనీకాంత్ రెడ్డి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రహ్మత్ నగర్ డివిజన్ పరిధిలోని వివిధ బస్తీల్లో రూ.4.62 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీరు, డ్రైనేజీ పనులను బుధవారం ఆయన ప్రారంభించారు.
జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికలు సజావుగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉండాలని నోడల్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఈ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇందుకోసం కీలక నేతలతో కూడా కవిత సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే నాయకులు, కార్యకర్తలను నియోజకవర్గంలో మోహరించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ శాసనసభ స్థానం ఖాళీ అయింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని, అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం వెంగళరావునగర్ డివిజన్లో రూ.5.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. జూబ్లీహిల్స్లో తెలుగుదేశం పార్టీ పోటీపై తెలంగాణ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయాలని చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ తెలంగాణ పూర్వవైభవం రావాలన్న ఆశతో ఉన్నారని గుర్తు చేశారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర రాజధానిలో ఈ ప్రతిష్టాత్మక స్థానం కోసం కాంగ్రెస్ పార్టీలో టికెట్ రేస్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ రేస్ నుంచి తప్పుకోవడం, బీసీలకు టికెట్ ఇవ్వాలన్న టీపీసీసీ నిర్ణయం ఈ ఎన్నికను మరింత ఆసక్తికరంగా మార్చాయి.
మూసీ రివర్ డెవలప్మెంట్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్రెడ్డి కీలక సూచనలు చేశారు.