Home » Jubilee Hills
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అధికార కాంగ్రెస్ని గెలిపించాలని పొన్నం ప్రభాకర్ కోరారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలకు దసరా పండగ ఖర్చు భారీగానే అవుతోంది. మద్యం, మామూళ్లు ఇవ్వాలంటూ చోట, మోటా నేతలు ఆశావహుల ఇళ్ల వద్ద క్యూ కట్టారు. కొందరూ ఆశావహులు రెండు రోజులుగా పంపకాలను ప్రారంభించారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఎర్రగడ్డలోని షంషీర్ ఫంక్షన్ హాల్లో డివిజన్కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను మంగళవారం ప్రకటించారు. మొత్తం ఓటర్లు 3,98,982 మంది ఉన్నారని పేర్కొన్నారు. సెప్టెంబరు 17 రాత్రి వరకు కొత్తగా ఓటు నమోదుకు 6,563 దరఖాస్తులు, తొలగింపు కోసం 361, సవరణ కోసం 2,298 దరఖాస్తులు వచ్చాయి.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ కీలక చర్యలు చేపట్టింది.
కార్ల విషయంలో తాను తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్లో మాగంటి సునీత మంచి మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం కేసీఆర్కు ఉందని కేటీఆర్ ఉద్ఘాటించారు.
కేసీఆర్ చేసిన అభివృద్ధే తనను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపిస్తుందని మాగంటి సునీత ధీమా వ్యక్తం చేశారు. తాను ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తోందని ఎప్పుడూ అనుకోలేదని మాగంటి సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం చాలా బాగా జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు అన్నారు. ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం ముఖ్యనేతలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ తో కలిసి ఆయన సమావేశమయ్యారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం ఆసన్నమవుతుండటంతో ప్రధాన పార్టీలు తమ అభ్యుర్థుల ఎంపిక విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది.