Home » Jubilee Hills
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లు అవమానించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. మంత్రులకి అసలు మానవత్వం ఉందా...? అని ప్రశ్నించారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అడిగే అన్ని ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి వివేక్ తెలిపారు. మంత్రి అడ్లూరిని తాను ఏమి అనలేదని స్పష్టం చేశారు. అడ్లూరి గురించి తాను ఎక్కడ మాట్లాడలేదని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామని పలువురు వక్తలు తెలిపారు.
ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్కు పోటీగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 1000 మంది నిరుద్యోగులం 30 అంశాలపై నామినేషన్ దాఖలు చేసి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించే లక్ష్యంతో పని చేస్తామని నిరుద్యోగ జేఏసీ నాయకులు వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ మేరకు నేడు ఉదయం 10 గంటలకు రహమత్ నగర్లోని SPR గ్రౌండ్స్ వద్ద విస్తృత స్థాయి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్కి సోయి వస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్ తరఫున శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.
ఉప ఎన్నికలో ప్రలోభాలను కట్టడి చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని, అనుమానిత లావాదేవీలపై నిఘా పెట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో తనను సంప్రదించరా అని మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. లోకల్, నాన్లోకల్ ఇష్యూ ఇప్పుడే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని అంజన్కుమార్ యాదవ్ నిలదీశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నిర్వహణ ప్రక్రియపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. ఇప్పటికే అధికారులకు శిక్షణా కార్యక్రమాలు పూర్తికాగా, గురువారం చాదర్ఘట్లోని విక్టోరియా ప్టేగ్రౌండ్ భవనంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతర అధికారుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ జరిగింది.