Home » Jammu and Kashmir
విపరీతంగా మంచు కురుస్తుండటం, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో లాన్స్ హవాల్దార్ పలాష్ ఘోష్, లాన్స్ నాయక్ సుజయ్ ఘోయ్ల జాడ గల్లంతైంది. వీరి కోసం గ్రౌండ్ ట్రూప్స్, లోకల్ సపోర్ట్ టీమ్లు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టాయి.
కెరాన్ సెక్టార్లో కాల్పులు కొనసాగుతుండటం, ఎల్ఓసీ వెంబడి వాతావరణ ప్రతికూలతల కారణంగా మృతదేహాలను ఇంకా స్వాధీనం చేసుకోలేదని తెలుస్తోంది. మిలిటెంట్లు ఎవ్వరూ తప్పించుకుపోకుండా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
బాందిపొరా, కుప్వారా సెక్టార్లలోని ఎల్ఓసీ మీదుగా ఉన్న ల్యాంచ్ ప్యాడ్లలో ఉగ్రవాదుల ఉనికి ఉన్నట్టు గుర్తించామని బీఎస్ఎఫ్ ఐజీ తెలిపారు. వారు సమయం కోసం వేచిచూస్తున్నారని, అయితే ఆర్మీ, బీఎస్ఎఫ్ అధునాతన నిఘా సాధనాలతో అప్రమత్తంగా ఉందని చెప్పారు.
లెహ్లో నిరసనలను రెచ్చగొట్టారంటూ వాంగ్చుక్ను జాతీయ భద్రతా చట్టం (NSA)కింద శుక్రవారం నాడు అరెస్టు చేశారు. అనంతరం రాజస్థాన్లోని జోథ్పూర్ సెంట్రల్ జైలుకు ఆయనను తరలించారు.
షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాంగ్చుక్ మీడియా సమావేశంలో మాట్లాడాల్సి ఉండగా, దానికి ముందే ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. లద్దాఖ్కు రాష్ట్రహోదా కల్పించాలని, దానిని గిరిజన హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుక్ ఉద్యమం సాగిస్తున్నారు.
రాష్ట్రహోదా డిమాండ్లో భాగంగా పలువురు కొద్దిరోజులుగా నిరాహార దీక్షలు కొనసాగిస్తుండగా, తమ డిమాండ్లపై ఒత్తిడి తెచ్చేందుకు బుధవారంనాడు లద్దాఖ్ షట్డౌన్కు పిలుపునిచ్చారు.
లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించి, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని వాంగ్చుక్ డిమాండ్ చేస్తున్నారు. ఇందువల్ల భూములు, ఉద్యోగాలు, కల్చరల్ ఐడెంటిటీకి పరిరక్షణ లభిస్తుందని అంటున్నారు.
పహల్గాం ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఇటీవల చేపట్టిన 'ఆపరేషన్ మహదేవ్'లో పలు ఆయుధాలు, సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వీటి ఫోరెన్సిక్ విశ్లేషణ అనంతరం ఉగ్రవాదులకు సహకరించిన మహమ్మద్ కటారియా అనే వ్యక్తిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పట్నించి రాష్ట్ర హోదా పునరుద్ధరణకు డిమాండ్లు వినిపిస్తున్నాయి.
జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ అండ్ కశ్మీర్ (లెజిస్లేచర్తో సహా), లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగిందని, రాజ్యసభకు నాలుగు ఖాళీలు ఏర్పడిన సమయంలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఎలక్టరేట్లు లేరని ఈసీ తెలిపింది.