• Home » Jammu and Kashmir

Jammu and Kashmir

రంజీ ట్రోఫీ ఫైనల్.. 584 పరుగులు చేసిన జమ్మూకశ్మీర్

రంజీ ట్రోఫీ ఫైనల్.. 584 పరుగులు చేసిన జమ్మూకశ్మీర్

హుబ్లీ వేదికగా కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ దుమ్ము రేపింది. 527/6 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన జమ్మూ జట్టు 584 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. ప్రత్యర్థి కర్ణాటకు 585 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

పాక్, అమెరికా కరెన్సీతో సరిహద్దుల్లో బెలూన్ల స్వాధీనం

పాక్, అమెరికా కరెన్సీతో సరిహద్దుల్లో బెలూన్ల స్వాధీనం

జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో విదేశీ కరెన్సీ నోట్లు తగిలించిన రెండు బెలూన్లను అధికారులు సోమవారంనాడు స్వాధీనం చేసుకున్నారు. వీటిపై 5,000 రూపాయల పాకిస్థా్న్ కరెన్సీ నోటు, అమెరికా డాలర్ అంటించి ఉన్నాయి.

20 సార్లు తప్పించుకున్న పాక్ జైషే ఉగ్రవాది ఖేల్ ఖతం

20 సార్లు తప్పించుకున్న పాక్ జైషే ఉగ్రవాది ఖేల్ ఖతం

ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో భద్రతా బలగాలు మరోసారి పైచేయి సాధించాయి. పాకిస్థాన్‌ బేస్డ్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మోస్ట్ వాటెండ్ టెర్రరిస్ట్‌ సైఫుల్లా ను బలగాలు ఆదివారంనాడు విజయవంతంగా మట్టుబెట్టాయి.

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో (Kishtwar District) ఆదివారంనాడు ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

ఉగ్ర ముప్పు హెచ్చరికల వేళ.. కశ్మీర్‌లో ఐఈడీని గుర్తించిన సైనికులు

ఉగ్ర ముప్పు హెచ్చరికల వేళ.. కశ్మీర్‌లో ఐఈడీని గుర్తించిన సైనికులు

ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా మత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఉగ్రమూకలు దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘావర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి.

చరిత్ర సృష్టించిన జమ్మూకశ్మీర్ జట్టు.. 67 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి..

చరిత్ర సృష్టించిన జమ్మూకశ్మీర్ జట్టు.. 67 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి..

రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో జమ్మూకశ్మీర్‌ జట్టు బెంగాల్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో 67 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఫైనల్స్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది.

త్వరలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణ.. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్

త్వరలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణ.. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే విషయంలో త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు. ఇది చాలా సున్నితమైన అంశమని, అయితే ఈ ప్రక్రియకు కేంద్ర కట్టుబడి ఉందని చెప్పారు.

పాయింట్ బ్లాంక్‌లో గన్ను పెట్టి పోలీసులపై కాల్పులు.. సీసీటీవీలో రికార్డైన భయానక దృశ్యాలు..

పాయింట్ బ్లాంక్‌లో గన్ను పెట్టి పోలీసులపై కాల్పులు.. సీసీటీవీలో రికార్డైన భయానక దృశ్యాలు..

జువెనైల్ హోమ్‌లో ఖైదీ ఘాతుకానికి ఒడిగట్టాడు. నాటు తుపాకితో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. మరో ఇద్దరు ఖైదీలతో కలిసి జువెనైల్ హోమ్ నుంచి పారిపోయాడు.

మంచు తుఫానులో చిక్కుకున్న గర్భిణిని రక్షించిన భారత సైన్యం..

మంచు తుఫానులో చిక్కుకున్న గర్భిణిని రక్షించిన భారత సైన్యం..

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మంచు తుఫానుల వల్ల దారిపొడవునా గడ్డకట్టే చలి, భారీగా పేరుకుపోయిన మంచు ఉన్నప్పటికీ, ప్రాణాలకు తెగించి గర్భిణిని కాపాడారు భారత సైన్యం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన భారత సైన్యం పట్ల మరింత నమ్మకాన్ని పెంచిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతం..

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతం..

ఉదంపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో బుధవారం నాడు ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌‌కౌంటర్‌లో ఇద్దరు జైషే మమ్మద్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి