Home » Jagtial
జిల్లాలో ఉపాధిహామీ పథకం పనులు నింపాదిగానే జరుగుతున్నాయి. ఆశించిన విధంగా ఊళ్లల్లో చేతినిండా కూలీలకు పనులు దొరకడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం మొదలై అప్పుడే నాలుగు నెలలు దాటినా క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాదిలో నిర్దేశించిన లక్ష్య సాధన విషయంలో వెనుకబడుతున్నామనే ఆందోళనలో అధికారులున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. ఈసారి ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 40 రోజులపాటు వర్షాలే కురవలేదు. ఈ పరిస్థితుల్లో వర్షాలు కురవడంతో అన్నదాతలు వ్యవసాయ పనులు ప్రారంభించారు.
వృద్ధులు, ఇతర బాధితులకు ఆర్థిక భరోసానిచ్చే చేయూత పింఛన్ల పంపిణీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బడుగు బలహీన వర్గాలకు కాస్త భరోసాగా నిలిచే చేయూత పింఛన్ల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతోమంది అర్హులు ఎదురుచూస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జర్దా అక్రమ వ్యాపారం జోరుగా జరుగుతోంది. అదనపు ఆదాయమే లక్ష్యంగా పలువురు వ్యాపారులు ప్రభుత్వఆదాయానికి గండి కొడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. జి
జిల్లాలో స్టాంపు పేపర్ల విక్రయదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విలువ కంటే అదనంగా వసూలు చేస్తూ వెండర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో కొనుగోలుదారులు అడిగిన మొత్తాన్ని ఇవ్వక తప్పడం లేదు.
వరి నాట్లు వేయడంలో ఎదురవుతున్న కూలీల సమస్యలు అదిగమించేందుకు అన్నదాతలు పొరుగు రాష్ట్రాల కూలీలపై ఆధారపడుతున్నారు. సీజన్లో నాట్లు వేయడానికి కూలీలు లభించకపోవడం, దొరికిన కూలీల ధరలు ఎక్కువగా ఉండడం, అర్ధాంతరంగా పనులు వదిలి ఎక్కువ కూలీలు డిమాండ్ చేస్తుండడం తదితర సమస్యలను ఎదుర్కొంటున్న రైతులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీలకు పనులను అప్పగిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిర్లక్ష్యపు డ్రైవింగ్ వాహన దారుల ప్రాణాల మీదకు తెస్తోంది. జిల్లాలో ఈ యేడాది తొలి ఏడు నెలల్లోనే 238 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇందులో 78 మంది మృతిచెందగా, 140 మంది తీవ్ర గాయాలపాలు కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ యేడాది నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలల విద్యార్థుల మాదిరిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటించింది. ఉదయాన్నే కళాశాలలకు హాజరయ్యే విద్యార్థులు మధ్యాహ్నం ఖాళీ కడుపులతో పాఠాలపై శ్రద్ధ చూపరని భావించిన ప్రభుత్వం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అమలు చేయాలని నిర్ణయించింది.
జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయ(కేవీ) స్థల కేటాయింపు వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జీ భోగ శ్రావణిప్రవీణ్ల మధ్య జరిగిన పట్టు సడలింపుల ఫలితంగా, ప్రభుత్వం ఇటీవల చల్గల్ గ్రామంలో 5ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో వివాదం కొంతమేర సమసిపోయినట్లయింది.
పిల్లలు బడికి వెళ్లడానికి రెడీ అయినా క్షణంలోనే కడుపు నొప్పి అంటూ విల్లవిల్లాడుతారు. కొందరు బడి తప్పించుకోవడానికి అనుకుంటారు. మరికొందరు అకస్మాత్తుగా వచ్చిన నొప్పిని చూసి గాభరాపడుతారు.