Home » Jagtial
యాసంగి సీజన్లో కాలం కలిసి రావడంతో మంచి దిగుబడులు వచ్చాయి. కొనుగోలు కేంద్రాల ద్వారానే సుమారు రూ.2వేల కోట్లకు పైగా విలువైన పంట ఉత్పత్తులను సేకరించడం గమనార్హం. రైతులు బహిరంగ మార్కెట్లో మరో రూ.500 కోట్లకు పైగా విలువైన పంట ఉత్పత్తులను విక్రయించి ఉంటారన్న అంచనా ఉంది.
కరీంనగర్లో ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఉద్యమకారులతో రౌండ్టేబుల్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తెల్లవారి నుంచే తెలంగాణ భావజాలంపై దాడి ప్రారంభమైందని విమర్శించారు.
చేనేత సహకార సంఘాలకు సుదీర్ఘకాలం తర్వాత ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 11 చేనేత, పవర్లూమ్ సహకార సంఘాలకు ఎన్నికలు జరగనుండడంతో సొసైటీ సభ్యుల్లో సందడి నెలకొంది. జిల్లాలో ఎన్నికల పోరు ఏకగ్రీవంగానే
కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అన్న పరిస్థితిని సామాన్య ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలతో సామాన్య జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోతుల కొట్లాట ఓ మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది. మిద్దెపై కోతులు కొట్లాడుకుంటూ కింద ఉన్న మహిళ తలపై సిమెంట్ ఇటుక పడేశాయి. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
తొలకరికే తొందరపడి విత్తనాలు వేయొద్దని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వాతావరణంలో మార్పులతో వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ ప్రభావం వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన జగిత్యాలపై పడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎ
జిల్లాకు మంజూరు అయిన కేంద్రీయ విద్యాలయానికి స్థల కేటాయింపు సమస్య పరిష్కారం కావడం లేదు. కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించే వ్యవహారంలో బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కారుతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్ల మద్య వివాదం రోజురోజుకు ముదురుతోంది.
ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీ స్థాయిలో నిఘా పర్యవేక్షణ (విజిలెన్స్ మానిటరింగ్) కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉపాధి హామీ పథకంలో అవినీతికి అడ్డుకట్ట పడనుంది.
గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు) నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతీ యేటా ఆసుపత్రుల నిర్వహణ, చిన్న మరమ్మతులు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ బిల్లులు, ఫర్నీచర్, వైద్య పరికరాలు, అత్యవసర ఔషధాల కొనుగోలు వంటి అవసరాలకు ఇవ్వాల్సిన హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ (హెచ్డీఎఫ్) సమయానికి విడుదల కాకపోవడంతో పీహెచ్సీల పరిస్థితి దయనీయంగా మారుతోంది.
వాల్టా చట్టం అమలుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇక నుంచి కొత్త బోర్లు వేయాలంటే అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటారు. వేసవి నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతుండగా, మరోవైపు గ్రామాలు, పట్టణాలలో గృహ అవసరాల కోసం విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారు.