• Home » Jagtial

Jagtial

సహకార సంఘాల పెంపునకు కసరత్తు

సహకార సంఘాల పెంపునకు కసరత్తు

కొత్త మండలాలు, డీసీసీబీల ప్రకారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్‌వ్యవస్థీకరణకు సర్కారు కసరత్తు చేస్తోంది. జిల్లాలో 12 కొత్త సొసైటీలను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు.

నేడే మలి విడత పోరు

నేడే మలి విడత పోరు

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని జగిత్యాల, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 144 గ్రామ పంచాయతీలు, 1,276 వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారు. అయితే 10 గ్రామ పంచాయతీ సర్పంచ్‌ స్థానాలు, 330 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 134 సర్పంచ్‌ స్థానాలకు 521 మంది అభ్యర్థులు, 946 వార్డులకు 2,662 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

సర్పంచలుగా చేసి సర్వం కోల్పోయాం..

సర్పంచలుగా చేసి సర్వం కోల్పోయాం..

పంచాయతీ ఎన్నికల పర్వంలో తొలి విడత నామినేషన్లుపూర్తయి మలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తరుణంలో గ్రామాలు రాజకీయాలతో వేడెక్కాయి. కొత్తగా సర్పంచలు కాదలచుకున్నవారు నూతనోత్సాహంతో కొనసాగుతుండగా.. అదే గ్రామాల్లో మాజీ సర్పంచలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు.

ప్రచార వ్యూహాల్లో పంచాయతీ అభ్యర్థులు

ప్రచార వ్యూహాల్లో పంచాయతీ అభ్యర్థులు

పంచాయతీ ఎన్నికల తొలి విడతకు సంబంధించిన నామినేషన్ల గడువు శనివారం ముగిసింది. దీంతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. తొలి విడతలో 122 గ్రామ పంచాయతీలు, 1,172 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్‌ స్థానాలకు రాత్రి వరకు 773 నామినేషన్లు రాగా వార్డులకు 2,243 వచ్చాయి.

పత్తి పంట.. సీసీఐ తంటా

పత్తి పంట.. సీసీఐ తంటా

మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు చేపట్టి రైతులకు మద్దతు ధర లభించేలా చూడాల్సిన సీసీఐ (కాటన కార్పొరేషన ఆఫ్‌ ఇండియా) ఆ కొనుగోళ్ల విషయంలో తిరకాసుపెడుతున్నది. ఎకరాకు ఎంత దిగుబడి వచ్చినా 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో రైతులు మిగతా దిగబడిని ప్రైవేట్‌ వ్యాపారులకు మద్దతు ధర రాకున్నా అమ్ముకోవలసిన దుస్థితిని కలిగిస్తున్నది.

జూనియర్‌ కళాశాలలపై ఫోకస్‌

జూనియర్‌ కళాశాలలపై ఫోకస్‌

జిల్లాలోని జూనియర్‌ కళాశాలపై ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ కళాశాలలను ఇప్పటికే ప్రక్షాళన చేయగా, క్షేత్రస్థాయిలో ఆచరణ, పరిస్థితులు అధ్యయనానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

కరీంనగర్‌-జగిత్యాల రోడ్డుకు మోక్షమెప్పుడో?

కరీంనగర్‌-జగిత్యాల రోడ్డుకు మోక్షమెప్పుడో?

కేంద్ర ప్రభుత్వం కరీంనగర్‌-జగిత్యాల రోడ్డును జాతీయరహదారిగా-563గా ప్రకటించింది. ఈ రోడ్డును నాలుగులైన్లతో విస్తరించేందుకు ఏడేళ్ల క్రితమే 2,227 కోట్ల రూపాయలు కేటాయించింది.

పది మెమోలో తప్పులకు చెక్‌

పది మెమోలో తప్పులకు చెక్‌

పదో తరగతి మెమోల్లో తప్పులను అదిగమించడానికి విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థి చదువుకు ప్రధాన ఆధారం వయో నిర్ధారణ...సబ్జెక్ట్‌ జ్ఞానం వంటి అంశాల కోసం అవసరమైన పాఠశాల రికార్డులు అత్యంత ముఖ్యమైనవి. వీటిలో ముఖ్యంగా టెన్త మోమోలు, సర్టిఫికెట్లు కీలకపాత్ర పోషిస్తాయి. విద్యార్థి, తల్లిదండ్రులు, ఇంటిపేరు వంటి వివరాల్లో తప్పులు చోటు చేసుకుంటే భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

సాదాబైనామాలకు మోక్షం

సాదాబైనామాలకు మోక్షం

భూముల క్రయ విక్రయాలకు సంబంధించి సాదాబైనామాల క్రమబద్ధీకరణకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతుల ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడింది.

డీసీసీ పీఠం దక్కేదెవరికి?

డీసీసీ పీఠం దక్కేదెవరికి?

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు, నగర అధ్యక్ష పదవుల భర్తీ ప్రక్రియ కొలిక్కి వస్తున్నది. రెండు, మూడు రోజుల్లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేదెవరో తేలిపోనున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్ష పదవులకు, నగర అధ్యక్ష పదవులకు పరిశీలకులు అందించిన పేర్లను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో సమీక్షించి షార్ట్‌లిస్ట్‌ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి