Home » Jagtial
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక సోమవారం జరగనుంది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది.
నోటికి తాళం వేశారు.. ఓటుకు నోట్ల బేరం మొదలైంది. సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారం 48 గంటల ముందు సోమవారం సాయం త్రం 5 గంటలకు ముగిసిపోయింది. గప్చుప్గా ఓటర్లను ఆకట్టుకోవడానికి చివరి ప్రయత్నంగా ఓట్లకు నోట్లు, నజరానాలతో ప్రలోభాలకు తెరలేపారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఇన్నాళ్లు మోత మోగిన మైక్లు సోమవారం సాయంత్రం మూగబోయాయి. గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్న అభ్యర్థులు చివరి రోజు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఇసుక బుకింగ్ విధానం ప్రవేశ పెట్టనుందని రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, మైన్స్ జియోలజీ డైరెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయాయి.. మున్సిపల్ ఎన్నికలు తెరపైకి వచ్చాయి. తర్వాత పరిషత్ ఎన్నికలు రాబోతున్నాయి... బరిలో నిలిచే అభ్యర్థులు మాత్రం ఓటర్ల మనసు దోచుకోవడానికి పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రాకపోయినా సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఇంటింటికి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆశావహులు పరుగులు తీస్తూనే ఉన్నారు.
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైన వెలువడే అవకాశాలు ఉండడంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఓటర్లకు గాలం వేసేందుకు కార్యాచరణ షురూ చేసిన ఆయా పార్టీలు.. కుల సంఘాల వారీగా మచ్చిక చేసుకునేందుకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి.
పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరడంతో సర్పంచ్లు, వార్డు సభ్యులకు గ్రామాభివృద్ధి కోసం 24 అంశాలపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత జిల్లాలో పది మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రేపోమాపో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి. జిల్లాలోని అయిదు మున్సిపాలిటీలు, 136 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నా యి.
మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు ఫిబ్రవరి మొదటి వారంలోనే జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. పోటీ చేయాలనుకునే ఆశావహులు రిజర్వేషన్లు ఇంకా ఖరారుకాక పోవడంతో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు సిలబస్ పూర్తి చేశాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధనలో వేగం పెంచారు. ఉదయం, సాయంత్రం గంట పాటు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు.