Home » Jagtial
నగరపాలక సంస్థ పాలకవర్గం తొలి సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 16న పాలకవర్గం కొలువుతీరింది. నగరపాలక సంస్థలో 66 డివిజన్లు ఉండగా 46 మంది కార్పొరేటర్లు కొత్తగా ఎన్నికై బల్దియాలో అడుగుపెట్టారు.
అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం, కమిటీల నియామకంలో జాప్యం చేస్తుండడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల మళ్లీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను నియమించిన పార్టీ, తాజాగా కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలను ప్రకటించింది.
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యేటా వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఎస్సారెస్పీ నీటితో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండడం, ఆశించిన స్థాయిలో సాగునీరు అందడంతో వరి సాగు రైతుల సంఖ్య యేటా పెరుగుతూ వస్తోంది.
సమాజానికి మంచి చేయాలని, తమను గెలిపించిన ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడాలని కోరుతూ అంజన్న ఆలయానికి పాదయాత్రగా వెళ్తున్నామని కేంద్ర హోం శాఖ సాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. శనివారం ఉదయం కరీంనగర్లోని మహాశక్తి ఆలయం వద్ద అంజన్న ఆశీర్వాద యాత్రను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారుజ
మహిళల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా స్వయం సహాయక గ్రూపు (ఎస్హెచ్జీ) మహిళా సభ్యులకు పలు రకాల వైద్య పరీక్షలు చేయించాలని నిర్ణయించింది. అనంతరం డిజిటల్ హెల్త్ కార్డులు అందించేందుకు కసరత్తు ప్రారంభించింది.
పల్లెలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన సంక్షేమ ప్రగతి పనులను పూర్తి చేయడంపై దృష్టిపెట్టిన అధికారులు పాలనను పరుగులు పెట్టించేందుకు చర్యలు చేపడుతున్నారు.
రెండేళ్లకు పైగా ఖాళీగా దర్శనమిచ్చిన పంచాయతీల ఖజానాకు కేంద్రం నిధులు జమ చేయడంతో కళకళలాడుతున్నాయి. 2024 ఫిబ్రవరితో గత పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి జీపీలకు పాలక వర్గాలు లేకపోవడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులు పూర్తిగా నిలిచిపోయాయి.
వివాహాలు, శుభకార్యాల సందడి మొదలైంది. ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో భాజాభజంత్రీలు మోగనున్నాయి.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక సోమవారం జరగనుంది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది.
నోటికి తాళం వేశారు.. ఓటుకు నోట్ల బేరం మొదలైంది. సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారం 48 గంటల ముందు సోమవారం సాయం త్రం 5 గంటలకు ముగిసిపోయింది. గప్చుప్గా ఓటర్లను ఆకట్టుకోవడానికి చివరి ప్రయత్నంగా ఓట్లకు నోట్లు, నజరానాలతో ప్రలోభాలకు తెరలేపారు.