Home » Jagtial
ఈయేడాది పంట రుణ పరిమితిని ప్రభుత్వం పెంచింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీ (ఎస్ఎల్టీసీ) సిఫార్సుల మేరకు ఈ పెంపు ఉంటుంది. ప్రధానంగా రైతులకు ఏటా సాగులో పెట్టుబడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రుణ పరిమితి పెంపు ద్వారా అన్నదాతకు బ్యాంకు లభించే రుణం పెరగనుంది.
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. జిల్లావ్యాప్తంగా 159 పెట్రోల్, డీజిల్ పంపులు ఉండగా 10 శాతం పంపులు మాత్రమే విక్రయాలు కొనసాగిస్తున్నాయి.
విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈనెల 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది.
సూర్యుడు చెలరేగిపోతున్నాడు.. భగ్గుమంటున్న ఎండవేడికి రాజన్న సిరిసిల్ల జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. తీవ్రమైన ఉక్కపోత.. ప్రాణాంతకంగా వడగా లులు వీస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్ మాసంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.
జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన శ్రీరాంసాగర్ కింద సాగు అవసరాలకు నీటి విడుదల ప్రక్రియ ముగిసింది. ప్రాజెక్టులో ప్రస్తుతం 20.518 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నీటిని తాగునీటి అవసరాలకు పక్కన బెట్టారు.
జిల్లాలో రబీ సీజన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత సీజన ధాన్యం నిల్వలకు స్థలాల కొరత ఏర్పడే అవకాశం ఉంది. గత సీజనలో ధాన్యం పలు మిల్లుల్లో పేరుకుపోయి ఉంది. కొత్త ధాన్యం రావడంతో నిల్వ స్థలం కొరత తీవ్రంగా ఉంది. ఆరు బయట, మిల్లుల వద్ద టార్పాలిన్ల కింద ధాన్యాన్ని నిల్వ చేశారు.
బీఆర్ఎస్లో చేరికపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే తాను గులాబీ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పోలీసు రికార్డుల ప్రకారం సరాసరి రోజుకు రెండు ప్రమాదాలు, ఇద్దరు గాయాలపాలవుతున్నారు. అనధికారికంగా ప్రమాదాల సంఖ్య, గాయపడినవారి సంఖ్య నాలుగురెట్లు ఉంటుంది.
మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ పదవికి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అందరి దృష్టి ఆ పదవుల వైపు మళ్లింది. ఇంతకాలం నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో మున్సిపాలిటీలో నలుగురికి అవకాశం లభించనుంది.
అందరిదీ ఒకే మాట.. ఒకటే తీర్మానం.. సెస్ను పరిరక్షించుకోవాలి.. విద్యుత్ పంపిణీ వ్యవస్థ యథావిధిగా సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ద్వారా జరగాలి.. విద్యుత్ సరఫరా కోసం లైసెన్స్ రెన్యూవెల్ వెంటనే చేయాలంటూ సెస్ గ్రామ ప్రతినిధులు డిమాండ్ చేశారు.