Home » Ishan Kishan
టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ అంశంపై అతడు మాట్లాడాడు. గతంలో జోక్స్తోనే కాలక్షేపం చేసేవాడినని.. ఇప్పుడు అంతా మారిందని తెలిపాడు.
టీ20 ప్రపంచ కప్-2026 కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అలానే ఇటీవల టీమిండియా ఓపెనింగ్ స్థానంలో పలు కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓపెనర్లుగా ఎవరు వస్తారనే సందేహం క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. అనూహ్యంగా సర్జరీ వల్ల జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ న్యూజిలాండ్తో చివరి టీ20 నాటికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడనే వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026కు తిలక్ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.
న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతుంది. టాపార్డర్లో అందరూ రాణిస్తున్నప్పటికీ.. కొంత ఆందోళన కలిగిస్తోంది మాత్రం వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్ మాత్రమే. ఈ విషయంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడాడు.
న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్(76) మెరుపు ఇన్నింగ్స్పై ప్రస్తుతం అంతటా ప్రశంసల జల్లు కురుస్తోంది.అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇషాన్ కిషన్పై కోపంగా ఉన్నాడట.
రాయ్పుర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. 37 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. 468 రోజులు, 24 ఇన్నింగ్స్ తర్వాత సూర్య హాఫ్ సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలో సూర్య చక్కగా బ్యాటింగ్ చేశాడని టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కొనియాడాడు.
న్యూజిలాండ్తో రాయ్పుర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 209 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 15.2 ఓవర్లలోనే ఆటను ముగించింది. ఈ నేపథ్యంలో టీమిండియా పలు రికార్డులను నమోదు చేసింది.
రాయ్పుర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 76 పరుగులతో చెలరేగి ఆడాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్పై ఇషాన్ మాట్లాడాడు. తన ప్రశ్నలన్నింటికీ సమాధానం పరుగులే అని చెప్పాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్.. న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్కు గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
భారత్-న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఓ బ్యాడ్ న్యూస్ అందుతోంది. టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ ఈ వన్డే సిరీస్కు దూరమైనట్టు తెలుస్తోంది. శనివారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి తగలడంతో ఆయనకు బలమైన గాయమైంది. దీంతో ఆయన్ను తప్పించినట్టు సమాచారం.