Home » Ishan Kishan
బీసీసీఐ నుంచి వార్షిక కాంట్రాక్ట్ రాకపోవడంతో ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ల భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) తొలిసారిగా స్పందించారు.
టీమిండియా స్టార్ క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ను సెంట్రల్ కాంట్రాక్ట్ల జాబితా నుంచి బీసీసీఐ తొలగించడంపై క్రీడా వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే, మరి కొంత మంది వ్యతిరేకిస్తున్నారు.
శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల సెంట్రల్ కాంట్రాక్టులను రద్దు చేసి భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) సరైన నిర్ణయం తీసుకుందని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. బీసీసీఐ కాంట్రాక్టు కలిగి ఉన్న ఆటగాళ్లు తప్పనిసరిగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలని ఆయన చెప్పాడు.
యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్లకు బీసీసీఐ షాకిచ్చింది. రంజీలు ఆడమని ఎంత చెప్పినా వినకుండా నిర్లక్ష్యంతో వ్యవహరించినందుకు వీరిద్దరికీ తనదైన శైలిలో గుణపాఠం చెప్పింది.
టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ రీఎంట్రీలో విఫలమయ్యాడు. 3 నెలలుగా క్రికెట్కు దూరంగా ఉంటున్న కిషన్ డివై పాటిల్ టీ20 కప్లో బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో ఆర్బీఐ జట్టు తరఫున బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ మంగళవారం ఆర్ఎంఎల్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విఫలమయ్యాడు.
టీమిండియా యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్కు బీసీసీఐ షాక్ ఇవ్వబోతుందా?.. త్వరలో వారి సెంట్రల్ కాంట్రాక్టులను రద్దు చేయబోతుందా?.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
Ishan Kishan: హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ కార్యదర్శి జై షా ఆదేశాలను వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ బేఖాతరన్నాడు. మానసిక సమస్యలతో సుదీర్ఘకాలంగా విశ్రాంతి
టీమిండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ వైఖరిపై బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సూచనలను ఇషాన్ కిషన్ లెక్క చేయలేదు. ఆ వెంటనే బీసీసీఐ సెక్రటరీ జై షా రంగంలోకి దిగారు. ఇషాన్ కిషన్ పేరు ప్రస్తావించకుండా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ గత నెల రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. దక్షిణాఫ్రికా టూర్లో విరామం కోరిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్కు బీసీసీఐ కూడా మద్ధతిచ్చింది. అయితే భారత్ తిరిగొచ్చిన ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో ఆడకపోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
పలువురు భారత ఆటగాళ్లపై బీసీసీఐ అసంతృప్తితో ఉందా? తమ ఆదేశాలను పాటించకపోవడంపై గుర్రుగా ఉందా? కొంతమంది ఆటగాళ్లు రంజీ క్రికెట్ కంటే ఐపీఎల్కు ప్రాధాన్యతం ఇవ్వడంపై ఆగ్రహంతో ఉందా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు.