Home » Iran War
ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకునే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని.. అలాకాకపోతే పూర్తిగా లొంగిపోవాలని తేల్చి చెప్పారు.
ఇరాన్పై దాడులకు తాత్కాలిక విరామం ఇచ్చి చర్చలు సాగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక సౌదీ అరేబియా ఒత్తిడి కూడా పని చేసినట్టు సమాచారం.
గల్ఫ్లో అంతకంతకూ పెరుగుతున్న ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ఫోన్లో మాట్లాడారు.
ఇరాన్తో సైనిక ఘర్షణలు 6వ నెలకు చేరుకున్నప్పటికీ ముగింపునకు రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఉన్నత సలహాదారుల బృందంలో తీవ్ర భేదాభిప్రాయాలే దీనికి కారణమని అంతర్జాతీయ మీడియా అంటోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రం అవుతున్నాయి. తాజాగా ఇరాన్ ఓ చైనా కంపెనీపై దాడి చేసింది.
ఇరాన్కు చైనా ఆయుధాలను విక్రయిస్తే తాను తీవ్ర నిరాశకు గురవుతానని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. జిన్పింగ్ గతంలో తనకు స్వయంగా హామీ ఇచ్చారని, ఆ మాటపై నిలబడతారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడికి దిగిన నేపథ్యంలో, దానికి ప్రతికారంగా యూఎస్ మిలిటరీ.. ఇరాన్లోని లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది.
మిడిల్ ఈస్ట్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ మిసైల్స్ దాడులు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్పై శక్తివంతమైన సైనిక చర్య తప్పదని హెచ్చరించారు.
ఇరాక్లోని ఇరాన్ ప్రోక్సీ స్థావరాలపై అమెరికా-సౌదీ అరేబియా సంయుక్త వైమానిక దాడులు నిర్వహించాయి. సౌదీలోని అమెరికన్ సిబ్బందిపై, కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేయమని ఇరాన్ ఆదేశించిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి.