Home » IPS
హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో తనను లైంగింకంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ట్రైనీ ఐపీఎస్పై మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి.. ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు.
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మార్కాపూర్ జిల్లా ఓఎస్డీగా నవ్ జ్యోతి మిశ్రాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్ను ఏపీ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ను 2026 సెప్టెంబర్ 4 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజను హత్య చేసి.. ఆ ఇంట్లోని నగలతో ఉడాయించిన పని మనిషి, ప్రధాన నిందితురాలు కల్పన ఆచూకీ నేటికి లభ్యం కాలేదు. ఈ హత్య జరిగి నెల రోజులు గడిచినా నిందితురాలు ఆచూకీ కనిపెట్టక పోవడంతో పోలీసులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశంలో రిజర్వేషన్ల ఫలాలు అందుకొని సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలు.. తరతరాలుగా అదే కోటాను కోరుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులై, ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటూ పూర్తి స్థాయిలో స్థిరపడినప్పుడు, ఇక వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకని ప్రశ్నించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్య కేసులో విధినిర్వహణల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారులపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో దారుణ హత్య జరిగింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ సతీమణి తనూజ (55) హత్యకు గురయ్యారు.
తెలంగాణలో పెద్ద ఎత్తున సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర పరిపాలనలో కీలక విభాగాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలతో పోలీసు శాఖలో వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ జరిగిందని భావిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో సీపీ గౌస్ ఆలం పెద్ద ఎత్తున నగదు వసూల్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఆ ఆధారాలు అన్ని త్వరలోనే బయట పెడతానని తెలిపారు.
ఏపీ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఇవాళ(బుధవారం) ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సునీల్ నాయక్పై కేసు నమోదైన విషయం తెలిసిందే.