Home » IPL
టీమిండియా మాజీ క్రికెటర్, మన తెలుగు తేజం అంబటి రాయుడు మరోసారి తండ్రయ్యాడు. అతడి సతీమణి విద్య పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు. ఈ మేరకు రాయుడు.. ఓ ఫొటో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ను రవీంద్ర జడేజా నడిపించడం ఖాయమైంది. ‘ఎక్స్’లో జడేజా ఫొటోను పంచుకున్న రాజస్థాన్ ఫ్రాంఛైజీ.. ‘దళపతి’ అనే వ్యాఖ్యను జోడించింది. గత సీజన్ వరకు రాజస్థాన్కు కెప్టెన్గా ఉన్న సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్లో నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ముస్తాఫిజూర్ను ఐపీఎల్ నుంచి తప్పించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. చివరకు బీసీసీఐ సూచనలతో కేకేఆర్ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. ఈ విషయంపై బంగ్లాదేశ్ తీవ్రంగా స్పందిస్తోంది.
ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ను కేకేఆర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్తో బంగ్లా ఆడే మ్యాచుల వేదికలు మార్చాలని ఐసీసీని సంప్రదిస్తున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజూర్ రెహ్మాన్ను విడుదల చేయాలంటూ బీసీసీఐ అకస్మాత్తుగా ఆదేశాలు జారీ చేయడంతో కేకేఆర్ పరిస్థితి గందరగోళంగా మారింది. మరి ఆ డబ్బులు కేకేఆర్ పర్సులోకి జమ అవుతాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్ను బీసీసీఐ ఆదేశించింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్ను ఐపీఎల్లో ఆడించొద్దని డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే.
జనవరి 9 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ 2026 కోసం ఎంఐ కొత్త జెర్సీని విడుదల చేసింది.
బంగ్లాదేశ్లో హిందూ సోదరులను సజీవదహనం చేస్తుంటే అక్కడి ప్లేయర్లను షారూక్ తన టీమ్ కోసం కొనుగోలు చేయడాన్ని తాము సహించలేది లేదని మీరా రాథోడ్ అన్నారు. షారూక్ పోస్టర్లకు మసిపూయడం, చెప్పులతో కొట్టడం ద్వారా తన నిరసనను తెలియజేశారు.
ఐపీఎల్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఎట్టకేలకు బీసీసీఐ వర్గాలు స్పందించాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడకుండా నిరోధించడంపై తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గనిర్దేశకాలు రాలేదని పేర్కొన్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి ఇంగ్లండ్ జట్టును తాజాగా ప్రకటించారు. బ్యాటింగ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్కు చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో లివింగ్స్టోన్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 13కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.