Home » IPL
ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ భారత్కు తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు. 2009 నాటి ఐపీఎల్ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం కేసులో లలిత్ మోదీకి అప్పిలేట్ ట్రైబ్యూనల్ అనుకూలంగా తీర్చునిచ్చింది.
సీఎస్కే తదుపరి హెడ్ కోచ్ కోసం ఫ్రాంచైజీ అన్వేషణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్గా ఉన్న హేమంగ్ బదానిని ప్రధాన కోచ్గా నియమించుకునేందుకు సీఎస్కే ఫ్రాంచైజీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్కు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని సీఎస్కే ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది. దీంతో సీఎస్కేతో ఉన్న 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి తెరపడింది.
టీమిండియా కోచింగ్ స్టాఫ్లో పలు కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. కోచింగ్ స్టాఫ్లోని ఓ కీలక సభ్యుడు తన పదవికి వీడ్కోలు పలికి.. ఐపీఎల్లోని ఓ ఫ్రాంచైజీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సదరు ఫ్రాంచైజీతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ బంధం సరికొత్త మైలురాయిని అందుకోబోతోంది. ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ టీ20 టోర్నీ 'బిగ్బాష్ లీగ్' చరిత్రలోనే మొదటిసారిగా ఆ దేశం వెలుపల నిర్వహించనున్నారు. అదే విధంగా ఐపీఎల్ కూడా...
ట్రేడ్ డీల్లో భాగంగా హార్దిక్ పాండ్యను దక్కించుకునేందుకు ఏకంగా ఏడు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు మినహా అన్ని ఫ్రాంచైజీలు హార్దిక్ను జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్ శశాంక్ సింగ్, అతడి తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్పై కేసు నమోదు అయింది. తనపై దాడి చేసి, అసభ్యకర పదజాలంతో దూషించారని ఇంట్లో పనిచేసే వంటమనిషి ఆరోపించాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ రిలేషన్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఐపీఎల్లో ఓ భారీ ట్రేడ్ డీల్ జరిగింది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తిరిగి తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) గూటికి చేరాడు. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లఖ్నవూ జట్టులో జాయిన్ అయ్యాడు.
ఐపీఎల్లో మరో భారీ ట్రేడ్ చర్చలు క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య ట్రేడ్ చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.