Home » IPL
వరల్డ్కప్నకు అర్హత సాధించలేకపోయిన స్కాట్లాండ్.. అదృష్టం కలసి రావడంతో ఆఖరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చింది. బంగ్లాదేశ్ మెగా టోర్నీని బాయ్కాట్ చేయడంతో ఐసీసీ ర్యాకింగ్స్లో మెరుగైన స్థానంలో ఉన్న స్కాట్లాండ్కు ఐసీసీ అవకాశం ఇచ్చింది.
ఐపీఎల్లో టాప్ జట్లలో ఒకటైన సీఎస్కే డబ్ల్యూపీఎల్లోకి అడుగుపెట్టనున్నట్లు ఆ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడే అమల్లోకి రాదని, తమ భవిష్యత్తు కార్యాచరణలో భాగమని ఆయన వివరించారు.
ఫుల్ క్రేజ్ ఉన్న ఐపీఎల్ ఫ్రాంఛైజీలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు త్వరలో చేతులు మారనుంది. ఆర్సీబీ కొనుగోలు కోసం బిడ్ వేస్తానంటూ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ సీఈవో అదర్ పూనావాలా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
రానున్న మార్చిలో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ తీవ్రంగా ఖండించాడు. ఫిక్సింగ్ చేయడం అసాధ్యమని వెల్లడించాడు.
ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్. ఆర్సీబీ హోం గ్రౌండ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్లకు నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించినట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం శనివారం ప్రకటించింది..
భారత్-బంగ్లాదేశ్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదానికి ఐసీసీ తెరదించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇద్దరు ఐసీసీ అధికారులు ఢాకా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్కు చెందిన ఓ అధికారికి బంగ్లాదేశ్ వీసా నిరాకరించింది.
ఆదివారం వడోదర వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ అంపైర్ సర్ఫుద్దౌలా సైకత్ విధులు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. ఈ విషయంపై బీసీబీ తాజాగా స్పందించింది. అతడికి బీసీబీకి సంబంధం లేదని తేల్చి చెప్పింది.
బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బీసీసీఐ ఆదేశాల మేరకు అతడిని కేకేఆర్ జట్టు ఐపీఎల్ నుంచి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముస్తాఫిజుర్ పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆడనున్నాడు.
భారత్తో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ ప్రసారాలను బ్యాన్ చేయాలంటూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తమ దేశానికి చెందిన అంపైర్ల విషయంలో కూడా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పొరుగు దేశం బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంలో ఆ జట్టు ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్లో ఆడించొద్దంటూ డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ వెంటనే అతడిని జట్టులోంచి రిలీజ్ చేయాలంటూ కేకేఆర్ను ఆదేశించింది.