Home » IPL
జనవరి 9 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ 2026 కోసం ఎంఐ కొత్త జెర్సీని విడుదల చేసింది.
బంగ్లాదేశ్లో హిందూ సోదరులను సజీవదహనం చేస్తుంటే అక్కడి ప్లేయర్లను షారూక్ తన టీమ్ కోసం కొనుగోలు చేయడాన్ని తాము సహించలేది లేదని మీరా రాథోడ్ అన్నారు. షారూక్ పోస్టర్లకు మసిపూయడం, చెప్పులతో కొట్టడం ద్వారా తన నిరసనను తెలియజేశారు.
ఐపీఎల్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఎట్టకేలకు బీసీసీఐ వర్గాలు స్పందించాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడకుండా నిరోధించడంపై తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గనిర్దేశకాలు రాలేదని పేర్కొన్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి ఇంగ్లండ్ జట్టును తాజాగా ప్రకటించారు. బ్యాటింగ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్కు చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో లివింగ్స్టోన్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 13కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2026 సంబంధించి ఇప్పటికే మినీ వేలం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్షర్ పటేల్ను తొలగించి.. కేఎల్ రాహుల్కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ సంచలనం కృష్ణప్ప గౌతమ్.. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. 2012లో రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచులో కర్ణాటక తరఫున అరంగేట్రం చేశాడు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదింపుతూ ఆర్సీబీ కప్పును ముద్దాడింది. ఆ ఎమోషనల్ జర్నీ సాగిందిలా..
ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన ప్లేయర్.. ఆసీస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్. కేకేఆర్ అతడిని ఏకంగా రూ.25.20కోట్లు పెట్టి దక్కించుకుంది. అయితే గ్రీన్కు ఓ ప్రాణాంతక వ్యాధి ఉందన్న విషయం మీకు తెలుసా?
నిన్న(మంగళవారం) ఐపీఎల్ మినీ వేలం జరిగింది. ఈ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చేరారు. దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ అద్భుతమైన ఫామ్లో ఉన్న నేపథ్యంలో, ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై జట్టు అతడిని రూ. 75 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ పెస్ట్ షేర్ చేశాడు.
ఐపీఎల్2026 మినీ వేలం పలువురు ప్లేయర్లకు కాసుల పంట పండించింది. ఈ వేలంతో ఓ ఎంపీ కొడుకు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ వేలంలో భారత అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం కూడా కోల్కతా జట్టు తమ పర్స్లో ఉన్న మొత్తాన్ని వెచ్చింది. ఆ జట్టు కొనుగోలు చేసిన మొత్తం 13 మంది ఆటగాళ్లలో స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ కుమారుడు సార్థక్ రంజన్ కూడా ఉన్నాడు.