Home » IPL
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు స్టార్ ప్లేయర్లు వీడ్కోలు పలుకుతున్నారు. తాజాగా ఈ జాబితాలో స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ చేరాడు. ఈ ఏడాది వేలంలో తన పేరును రిజిస్టర్ చేయించుకోవద్దని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఐపీఎల్ కు గుడ్ బై చెప్పి... పాకిస్థాన్ సూపర్ లీగ్ లోకి వెళ్లనున్నట్లు ప్రకటించాడు.
ఐపీఎల్ 2026కి ముందు ఆండ్రీ రస్సెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సీజన్ వేలానికి ముందు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా ఎన్నో ఏళ్లుగా కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రస్సెల్ను.. ఈ సారి ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు.
ఐపీఎల్ 2026 సందడి ఇప్పటికే మొదలైంది. ఈసారి ఫ్రాంచైజీలు చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్సీబీని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్ఆర్ను కూడా అమ్మకానికి పెట్టినట్టు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గొయెంకా పోస్ట్లో పేర్కొన్నారు.
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఐపీఎల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ మినీ వేలాన్ని ఆపేసి.. ఏడాది పాటు ట్రేడ్ విండో తెరిచే ఉంచాలని సూచించాడు. రెండు నెలలు మాత్రమే ఉన్న ఈ టోర్నీని ఆరు నెలలకు పొడగించాలని తెలిపాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో సీఎస్కే జట్టు కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తాడని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్కు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో కెప్టెన్లు ఎక్కువ ఒత్తిడికి లోనవుతారని కేఎల్ వెల్లడించాడు. సరైన ప్రదర్శన చేయకపోతే యజమానులు బోలెడు ప్రశ్నలు వేస్తారని తెలిపాడు.
ఐపీఎల్ 2026 ముందు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ జట్టులో కీలక మార్పులు చేస్తోంది. తాజాగా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరను హెడ్ కోచ్గా నియమిస్తూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. రాహుల్ ద్రవిడ్ వైదొలగడంతో.. సంగక్కర ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడి సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆర్ఆర్ ఓనర్ మనోజ్ బాదలే మాట్లాడాడు. సంజూ కొత్త అధ్యాయం మొదలుపెట్టాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
ఐపీఎల్ 2026కి సంబంధించిన మినీ వేలంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. డిసెంబర్ 16న అబుదాబిలో ఈ వేలాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కాగా విదేశాల్లో వేలం వేయడం ఇది మూడో ఏడాది.