Home » IPL
ఐపీఎల్ 2026 సంబంధించి ఇప్పటికే మినీ వేలం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్షర్ పటేల్ను తొలగించి.. కేఎల్ రాహుల్కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ సంచలనం కృష్ణప్ప గౌతమ్.. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. 2012లో రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచులో కర్ణాటక తరఫున అరంగేట్రం చేశాడు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదింపుతూ ఆర్సీబీ కప్పును ముద్దాడింది. ఆ ఎమోషనల్ జర్నీ సాగిందిలా..
ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన ప్లేయర్.. ఆసీస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్. కేకేఆర్ అతడిని ఏకంగా రూ.25.20కోట్లు పెట్టి దక్కించుకుంది. అయితే గ్రీన్కు ఓ ప్రాణాంతక వ్యాధి ఉందన్న విషయం మీకు తెలుసా?
నిన్న(మంగళవారం) ఐపీఎల్ మినీ వేలం జరిగింది. ఈ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చేరారు. దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ అద్భుతమైన ఫామ్లో ఉన్న నేపథ్యంలో, ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై జట్టు అతడిని రూ. 75 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ పెస్ట్ షేర్ చేశాడు.
ఐపీఎల్2026 మినీ వేలం పలువురు ప్లేయర్లకు కాసుల పంట పండించింది. ఈ వేలంతో ఓ ఎంపీ కొడుకు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ వేలంలో భారత అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం కూడా కోల్కతా జట్టు తమ పర్స్లో ఉన్న మొత్తాన్ని వెచ్చింది. ఆ జట్టు కొనుగోలు చేసిన మొత్తం 13 మంది ఆటగాళ్లలో స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ కుమారుడు సార్థక్ రంజన్ కూడా ఉన్నాడు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరూన్ గ్రీన్ను రూ.25.20కోట్లకు కేకేఆర్ తీసుకున్న విషయం తెలిసిందే. కాగా యాషెస్ సిరీస్లో గ్రీన్ డకౌట్ అయ్యాడు. కేకేఆర్కు ఎలా ఆడతాడో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో రవి బిష్ణోయ్ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.20కోట్లకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అతడు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. జడేజాతో కలిసి ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
శ్రీలంక స్టార్ పేసర్ మతీశా పతిరనను ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ రూ.18కోట్లు పెట్టి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైతో తనకున్న అనుభవాన్ని, ధోనీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పతిరన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
అబుదాబీ వేదికగా జరిగిన ఐపీఎల్-2026 మినీ వేలం ముగిసింది. మొత్తం పది ఫ్రాంచైజీలు 77 స్ధానాలను భర్తీ చేశాయి. ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ గా ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ నిలిచాడు. రూ.25.20 కోట్ల భారీ ధరకు అతడిని కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది.