Home » IPL
ఐపీఎల్ 2026 సమరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ కెప్టెన్ను ప్రకటించింది. యువ ప్లేయర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో ఆర్ఆర్కు నాయకత్వం వహించనున్నాడు.
ఆర్సీబీ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు కర్ణాటక మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
20 జట్లతో అట్టహాసంగా ఆరంభమైన టీ20 వరల్డ్కప్లో అభిమానుల దృష్టి మాత్రం కొందరిపైనే ఉండనుంది. అసలైన పోటీ కూడా ప్రధాన జట్ల మధ్యే సాగనుంది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగబోతున్న భారత్ మూడోసారి టైటిల్ పట్టేయాలని భావిస్తోంది.
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య సమరం.. కేవలం ఆట కాదు.. అంతకు మించిన భావోద్వేగం. టోర్నమెంట్ ఏదైనా ఆ రెండు జట్లపైనే కళ్లన్నీ.. వాటి మధ్య పోరు గురించే చర్చంతా. ఓ మ్యాచ్ జరుగుతుంటే ఇరుదేశాల అభిమానులే ఆసక్తిగా చూస్తారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. భారత జట్టుకు మూలస్తంభాలు. యువ ఆటగాళ్లుగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తమదైన ముద్రవేస్తూ దేశం గర్వించదగిన క్రికెటర్లుగా ఎదిగారు.
ఇటలీ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది ఫుట్బాల్. దాదాపు ఆరు కోట్ల జనాభా ఉన్న దేశంలో అత్యధికులు సాకర్ ఆటకు ప్రాణమిస్తారు. నాలుగుసార్లు ఆ దేశ జట్టు ఫిఫా వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది.
టీ20లు బ్యాటర్ల విన్యాసాలకు పెట్టింది పేరు. ఈ క్రమంలో పేసర్లయినా, స్పిన్నర్లయినా పొట్టి క్రికెట్లో వికెట్లు సాధించడంకంటే కూడా పరుగులను నియంత్రించడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తారు.
భారత్లో క్రికెట్ను ఓ ఆటగా కాకుండా, మతంగా భావించడం పరిపాటి. మరి.. అదే నేల ఏకంగా టీ20 ప్రపంచకప్నకు ఆతిథ్యమిస్తుంటే ఇక ఆ జోష్ గురించి వేరే చెప్పాలా? దునియాను కట్టిపడేసేందుకు వచ్చేసిన ఈ ధనాధన్ విశ్వపోరును వీక్షించేందుకు కోట్లాదిమంది అభిమానులు సిద్ధమయ్యారు.
ఈ ప్రపంచకప్లో టైటిల్ వేటకు ఏకంగా 20 దేశాలు సమరశంఖం పూరించాయి. ఇవి నాలుగు గ్రూపులుగా విడిపోయి అమీతుమీకి సై అంటున్నాయి. ట్రోఫీయే లక్ష్యంగా అడుగుపెట్టిన డిఫెండింగ్ చాంపియన్ భారత్ కచ్చితంగా హాట్ ఫేవరెట్ అనడంలో సందేహం లేదు.
వరల్డ్ కప్లో భాగంగా భారత్, శ్రీలంక దేశాల్లోని ఏడు నగరాలు, 8 స్టేడియాల్లో మ్యాచ్లు జరుగనున్నాయి. అంటే శ్రీలంకలోని కొలంబోలో రెండు మైదానాలను వేదికలుగా ఎంపికచేశారు.