Home » International News
ఇరాన్పై దాడులు చేయడంలో అమెరికా-ఇజ్రాయెల్కు సహకరించిన ఐదు అరబ్ దేశాలు తమకు నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇరాన్ రాయబారి, శాశ్వత ప్రతినిధి అమీర్-సయీద్ ఇరావానీ తాజాగా ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు.
దాదాపు 40 రోజుల యుద్ధం తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరిగాయి. 21 గంటల పాటు జరిగిన ఆ చర్చలు ఫలితం లేకుండానే ముగిశాయి. అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చల్లో అణు కార్యక్రమం కీలక అంశంగా మారింది.
అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో బలమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత 5.7గా ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ధృవీకరించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. భూకంప కేంద్రం నెవాడాలోని సిల్వర్ స్ప్రింగ్స్కు తూర్పు-ఆగ్నేయంగా సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు భూగర్భ సర్వే (USGS) తెలిపింది. వివరాల్లోకి వెళితే..
ప్రపంచ చమురు వాణిజ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధి పూర్తిగా దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. గల్ఫ్ దేశాల పోర్టులకు రాకపోకలు సాగించే నౌకలను ఇరాన్ ఇప్పటికే నిలిపివేయగా...
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్కు మరో కఠిన హెచ్చరిక జారీ చేశారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 7:30 గంటల నుంచి హోర్ముజ్ దిగ్బంధనం ప్రారంభమైందని తెలిపారు.
హోర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ప్రస్తుతం నౌకా రవాణాకు అంతరాయం కలిగిస్తున్నప్పటికీ, భారత నౌకలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ పేర్కొన్నారు.
ఇస్లామాబాద్లో అమెరికాతో జరిగిన శాంతి చర్చలు విఫలమైనప్పటికీ, తమ డిమాండ్లను అంగీకరిస్తే మరోసారి చర్చలకు సిద్ధమేనని భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా-ఇరాన్ యుద్ధం కీలక దశలోకి చేరిన సమయంలో అగ్రరాజ్యానికి నాటో మిత్ర దేశాలు షాక్ ఇచ్చాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన హార్ముజ్ దిగ్బంధనానికి నాటో మిత్రదేశాలు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి.
ఎంతో శక్తివంతమైన, అధునాతనమైన అమెరికా యుద్ధ విమానాలకు పశ్చిమాసియాలో గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎంతో గొప్పవి అని అమెరికా చెప్పుకుంటున్న యుద్ధ విమానాలు కూడా కూలిపోయాయి. ఇరాన్ యుద్ధంలో అమెరికా వైమానికి దళానికి భారీ నష్టం సంభవించింది.
ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. హోర్ముజ్ జలసంధిని అడ్డుపెట్టుకుని ఇరాన్ ప్రపంచ దేశాలను ఇబ్బందిపెడుతోందని మండిపడ్డారు.