Home » International News
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా ఎగిసిపడుతున్నాయి. ఇరాన్కు చెందిన సౌత్ ఫార్స్ సహజవాయు రిఫైనరీపై, బుషెహర్ అణువిద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది.
ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై మరికొన్ని గంటల్లో ఇరాన్ దాడి చేయబోతోందని ఆ దేశ ప్రభుత్వ టెలివిజన్ కాసేపటి క్రితం ఒక కథనాన్ని ప్రసారం చేసింది.
సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనే మరణం తర్వాత ఇరాన్కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. టెహ్రాన్పై రాత్రికి రాత్రి జరిపిన దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మయిల్ ఖతీబ్ మృతి చెందినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ బుధవారంనాడు ప్రకటించారు.
ఇరాన్, ఇజ్రాయెల్ - అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్ గట్టి వార్నింగ్ ఇచ్చింది
ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల వల్ల ఇరాన్ భారీగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై దాడులు ఇంకా ముగియలేదని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్తో అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు లేదని.. ఇజ్రాయెల్తోపాటు అమెరికాలోని ఆ దేశ లాబీ ఒత్తిడితోనే యుద్ధాన్ని ప్రారంభించినట్టు స్పష్టంగా అర్థమవుతోందని అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం.....
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ స్టేట్స్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ చీఫ్ జెసెఫ్ కెంట్ తన పదవికి రాజీనామా చేశారు.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల సడలింపు, అమెరికాతో కాల్పుల విరమణకు గల అవకాశాలను ఇరాన్ కొత్త సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ తోసిపుచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకునే విషయంలో కఠిన వైఖరి ప్రదర్శించేందుకే ఆయన కట్టుబడి ఉన్నారు.
ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీని మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లారిజానీని లక్ష్యంగా చేసుకుని సోమవారం రాత్రి దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ సైనిక అధికారులు ప్రకటించారు.
అఫ్గానిస్థాన్లో పెను విషాదం చోటుచేసుకుంది. పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో 400 మంది ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కాబుల్లోని ఓ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి చేసిందని..