Home » International News
ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించాలంటే రాబోయే రోజుల్లో 200 బిలియన్ డాలర్లు (రూ.18 లక్షల కోట్లు) అవసరమవుతాయని పెంటగాన్ ఓ ప్రతిపాదనను సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అమెరికా పార్లమెంట్కు పెంటగాన్ ఓ నివేదికను పంపించిందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పటికే భారత్పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్ సరఫరా కొరత భయాందోళనలు కలిగిస్తోంది. ఇలాంటి తరుణంలో ఖతార్లోని కీలక గ్యాస్ కేంద్రం రాస్ లఫాన్పై ఇరాన్ క్షిపణి దాడి ప్రపంచ ఇంధన రంగాన్ని కలవరపెడుతోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో యుద్ధానికి సంబంధించి పలు వదంతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల మధ్య వెస్ట్బ్యాంక్పై క్షిపణి దాడి జరిగింది. ఇరాన్ క్షిపణి శకలాలు హీబ్రోన్ సమీపంలోని బేత్ అవా పట్టణంలో పడటంతో ముగ్గురు పాలస్తీనా మహిళలు మరణించినట్టు పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మూడో వారానికి చేరినప్పటికీ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా గుర్తుతెలియని డ్రోన్లు వాషింగ్టన్లోని పోర్ట్ మెక్నాయర్ సైనిక స్థావరంపై కనిపించినట్టు అధికారులు గుర్తించారు.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మూడో వారానికి చేరుకోవడంతో ఈ పోరును తదుపరి దిశకు తీసుకు వెళ్లేందుకు డొనాల్ట్ ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది. వేలాదిగా అమెరికా బలగాలను పశ్చిమాసియాకు తరలించేందుకు యూఎస్ మిలటరీ సన్నాహకాలు చేస్తోందని ఉన్నతాధికార వర్గాల సమాచారం.
తమ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా అమెరికా, ఇజ్రాయెల్పై ముమ్ముర దాడులు చేస్తున్న ఇరాన్.. అమెరికాలోని తమ ‘స్లీపర్ సెల్స్’ను యాక్టివేట్ చేసిందా...
ఇరాన్లో ఇంకా మిగిలినదేమైనా ఉంటే పూర్తిగా నాశనం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
ఒకవేళ పశ్చిమాసియాలో యుద్ధం జూన్ వరకు కొనసాగితే కొన్ని ప్రాంతాల్లో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని.. సుమారు 4.5 కోట్ల మంది ఆకలితో...
హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా.. సూడాన్లో 4 లక్షల మంది చిన్నారులకు అందాల్సిన మందులు పశ్చిమాసియాలో చిక్కుకుపోయినట్టు సేవ్ ది చిల్డ్రన్ సంస్థ...