Home » International News
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. హోర్ముజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న నిర్బంధంపై ఇరాన్ తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ నిర్బంధం ఇలాగే కొనసాగితే వేలాది మంది అమెరికా సైనికులను బందీలుగా తీసుకునే అవకాశం ఉందని ఇరాన్ స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు చెక్ పెట్టేందుకు అమెరికా-ఇరాన్ రెండో సారి శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయి. మొదటి విడత చర్చలు పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో జరిగాయి. ఆ చర్చలు స్పష్టమైన ఒప్పందం లేకుండానే ముగిశాయి.
ఇరాన్తో యుద్ధం దాదాపు ముగింపు దశకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. సైనిక చర్య ద్వారా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించగలిగామని చెప్పారు.
ఇరాన్ ఓడరేవులపై అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే గల్ఫ్ ప్రాంతంలో పూర్తిగా వాణిజ్యాన్ని స్థంభింపచేస్తామని ఇరాన్ హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం, ఒమన్ సముద్రం, ఎర్ర సముద్రం అంతటా ఎగుమతులు, దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ పేర్కొంది.
అమెరికాతో రెండో సారి శాంతి చర్చలు ప్రారంభం కానున్న వేళ ఇరాన్ కీలక డిమాండ్ను ముందుకు తెచ్చింది. ఇటీవల జరిగిన యుద్ధంలో తమ దేశానికి భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంటూ, దాదాపు 270 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 లక్షల కోట్లు) పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేసింది.
ఇస్లామాబాద్ వేదికగా రెండోసారి అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయి. ఆ చర్చలు వారం రోజుల్లోపే ఉండొచ్చని ట్రంప్ తెలిపారు. సరైన వ్యక్తులు వాషింగ్టన్ను పిలిచారని, వారు ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారని ట్రంప్ పేర్కొన్నారు.
ప్రకృతి అందాలకు నిలయమైన అండమాన్ సముద్రం. నేడు వరుస ప్రమాదాలతో కన్నీటి సంద్రంగా మారుతోంది. అండమాన్ సముద్రం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇరాన్తో చేస్తున్న యుద్ధం అమెరికాకు అటు ఆర్థికంగా, ఇటు సైనిక పరంగా తీవ్ర నష్టాలను కలిగిస్తోంది. అంతేకాదు.. ఇరాన్తో చేస్తున్న యుద్ధం పట్ల చాలా మంది అమెరికన్లు ఆగ్రహంగా ఉన్నారు. తాజా సర్వేల ప్రకారం ఎక్కువ మంది అమెరికన్లు ఇరాన్తో యుద్ధం చేయడం వల్ల ప్రయోజనం లేదని భావిస్తున్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య మరో దఫా చర్చల కోసం రంగం సిద్ధమవుతోంది. లేదులేదంటూనే ఇరువర్గాలు కూడా సమావేశానికి సిద్ధమవుతున్నాయి.
అమెరికా-ఇరాన్ చర్చలకు వేదికగా నిలిచి అంతర్జాతీయ స్థాయిలో శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలనుకున్న పాకిస్థాన్కు ఘోర అవమానం ఎదురైంది. రెండు దేశాల మధ్య చర్చలకు వేదికైన ఇస్లామాబాద్లోని హోటల్ బిల్లు కూడా చెల్లించలేక అపఖ్యాతి మూటగట్టుకుంది.