Home » Indian Railways
కన్ఫర్మ్డ్ టిక్కెట్స్ ఉన్న ప్యాసెంజర్లు తమ జర్నీ తేదీని ఉచితంగా మరో రోజుకు మార్చుకునే అవకాశం లభించనుంది. ఈ మేరకు రైల్వేకు మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
దక్షిణ్ ఎక్స్ప్రెస్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనతో పాటు ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఓ ప్రయాణికుడు రైలు నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయారు. ఘట్కేసర్ వద్ద ఈ దారుణం జరిగింది.
దక్షిణ మధ్య రైల్వే (SCR) అత్యధికంగా 48 రైళ్లను నడుపనుంది. 684 ట్రిప్పులు పూర్తి చేస్తుంది. ఈ నిర్ణయంతో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ నుంచి ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.
ప్రస్తుతం ప్రధాని మోదీ జపాన్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్లో బుల్లెట్ ప్రాజెక్టు అంశం కూడా చర్చకు రానుంది. మరి ఈ బుల్లెట్ రైలు ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తారు. సుదూర ప్రయాణాలంటే అందరూ రైళ్లనే ఎంచుకుంటారు. తమతో పాటు భారీగా లగేజ్ను కూడా తీసుకెళ్తుంటారు. అయితే ఇకపై లగేజ్ విషయంలో భారతీయ రైల్వే నిబంధనలను కఠినతరం చేసింది.
నికర కర్బన రహిత కార్యకలాపాల దిశగా రైల్వే శాఖ మరో పైలట్ ప్రాజెక్టును ఆవిష్కరించింది. సౌర విద్యుత్ వినియోగం పెంచేందుకు రైల్వే ట్రాక్స్ మధ్య సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేసింది. వారణాసిలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు చేపట్టింది.
Indian Railways Round Trip Package: పండగల వేళ రైల్వే శాఖ ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రౌండ్ ట్రిప్ టికెట్ బుక్ చేసుకునే ఒక్కో ప్రయాణికులకు టికెట్ పై 20 శాతం తగ్గింపు లభిస్తుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
భారత రైల్వే శాఖ సరికొత్త చరిత్ర సృష్టించింది.తూర్పు మధ్య రైల్వేకు చెందిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్ (DDU డివిజన్) నుంచి దేశంలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలు ‘రుద్రాస్త్ర’ను విజయవంతంగా నడిపి కొత్త రికార్డు నెలకొల్పింది. 354 వ్యాగన్లు.. 7 ఇంజిన్లు ఉన్న ఈ గూడ్స్ రైలు పొడువు ఏకంగా 4.5 కి.మీ. ఆసియాలోనే అత్యంత పొడవైన ఈ రైలు గురించి మరిన్ని విశేషాలు..
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లల్లో ఆక్యుపెన్సీ రేషియో 100కు పైగానే ఉందని కేంద్ర మంత్రి పార్లమెంటులో వెల్లడించారు. ఈ ఏడాది జూన్ వరకూ ఆక్యుపెన్సీ రేషియో 105.03 శాతంగా ఉందని తెలిపారు.
కన్యాకుమారి-పూణె జయంతి ఎక్స్ప్రెస్లోని ఓ బోగీలో అకస్మాత్తుగా పొగలు రేగడం చూసి ప్రయాణికులు హడలిపోయారు. నందలూరు వద్ద రైలును ఆపిన సిబ్బంది తనిఖీలు నిర్వహించగా సాంకేతిక లోపం బయటపడింది. రిపేర్ల అనంతరం రైలు యథావిధిగా గమ్యస్థానానికి బయలుదేరింది.