Home » IMD
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనుండటం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో చెన్నై నుండి కన్నియాకుమారి వరకు ఈ నెల 17 నుండి 18వరకు భారీగా వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్డీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వాతావరణంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఈనెల 16 నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అంచనా వేసింది. ఈ రుతుపవనాలపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 12 వరకు భారీ వర్షం కురుస్తుందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ విషయంపై గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో బాహ్య ఉపరితల ద్రోణి ఏర్పడి ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి రాష్ట్రంలో విస్తరించిన కారణంగా ఈ నెల 9వ తేదీ గురువారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది.
భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. వాన భారీగా పడుతోండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయిపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు గంటల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. భారీగా వాన పడుతోండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం ధాటికి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు. వాన దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.