• Home » ICC

ICC

టీ20 ప్రపంచకప్ నుంచి పాక్ తప్పుకుంటే.. తప్పవీ శిక్షలు!

టీ20 ప్రపంచకప్ నుంచి పాక్ తప్పుకుంటే.. తప్పవీ శిక్షలు!

టీ20 ప్రపంచ కప్ 2026.. పాకిస్తాన్-బంగ్లాదేశ్ నిర్ణయాల వల్ల రోజుకో వివాదం తెరమీదకి వస్తోంది. ఈ టోర్నీలో పాక్ ఆడటంపై వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని పీసీబీ చెప్పింది. ఒకవేళ పాక్ ప్రపంచ కప్‌ను బహిష్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.

టీ20 ప్రపంచ కప్ 2026.. 100 మందికి పైగా బంగ్లా జర్నలిస్టుల అక్రిడేషన్ తిరస్కరణ

టీ20 ప్రపంచ కప్ 2026.. 100 మందికి పైగా బంగ్లా జర్నలిస్టుల అక్రిడేషన్ తిరస్కరణ

టీ20 ప్రపంచ కప్ 2026లో బంగ్లా విషయంలో ఐసీసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కవరేజీ కోసం అప్లై చేసుకున్న ఏకంగా వంద మందికి పైగా బంగ్లా జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలుస్తోంది. బంగ్లా మీడియాను ఐసీసీ దూరం పెట్టడం వెనుక కారణాలేమీ తెలియరాలేదు.

బంగ్లాను పాక్ రెచ్చగొడుతోంది: బీసీసీఐ ఉపాధ్యక్షుడు

బంగ్లాను పాక్ రెచ్చగొడుతోంది: బీసీసీఐ ఉపాధ్యక్షుడు

బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 విషయంలో బంగ్లాను పాక్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ బంగ్లాను రెచ్చగొడుతోందని.. ఇది పద్ధతి కాదని ఆయన వెల్లడించారు.

 పాక్ ప్రధానితో ముగిసిన భేటీ.. కీలక విషయాలు వెల్లడించిన నఖ్వీ

పాక్ ప్రధానితో ముగిసిన భేటీ.. కీలక విషయాలు వెల్లడించిన నఖ్వీ

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ భేటీ ముగిసింది. అనంతరం నఖ్వీ పలు అంశాలను వెల్లడించారు. టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనే అంశంపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు.

ప్రతిదాంట్లో మీ జోక్యం ఎందుకు?.. పీసీబీ ఛైర్మన్ నఖ్వీపై భజ్జీ ఫైర్

ప్రతిదాంట్లో మీ జోక్యం ఎందుకు?.. పీసీబీ ఛైర్మన్ నఖ్వీపై భజ్జీ ఫైర్

పీసీబీ ఛైర్మన్ నఖ్విపై టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌ను ప్రపంచ కప్ టోర్నీ నుంచి తొలగించడంపై నఖ్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి విషయంలో పాకిస్తాన్ జోక్యం ఎందుకు అంటూ భజ్జీ ప్రశ్నించాడు.

పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది వక్ర బుద్ధి.. మరోసారి భారత్‌పై అక్కసు

పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది వక్ర బుద్ధి.. మరోసారి భారత్‌పై అక్కసు

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సైతం తన వక్రబుద్ధిని చూపించాడు. భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. టీ20 ప్రపంచ కప్-2026 నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్‌ అంశంలో భారత్‌ను లాగి తన కుటిల బుద్ధిని చాటుకున్నాడు.

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా కన్నుమూత

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా కన్నుమూత

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ బింద్రా ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన 1993 నుంచి 1996 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అలాగే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు 1978 నుంచి 2014 వరకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్

ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్

టీ20 ప్రపంచ కప్ 2026 కోసం పాకిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్‌ను ఐసీసీ ఈ టోర్నీ నుంచి తప్పించడంతో పాక్ కూడా వైదొలుగుతుందన్న వార్తలు వచ్చాయి. ఐసీసీ ఈ విషయంపై తీవ్రంగా స్పందించడంతో పీసీబీ వెనక్కి తగ్గి జట్టును ప్రకటించింది.

 నఖ్వీ ఓవరాక్షన్..  గట్టిగా షాకిచ్చేందుకు సిద్ధమైన ఐసీసీ!

నఖ్వీ ఓవరాక్షన్.. గట్టిగా షాకిచ్చేందుకు సిద్ధమైన ఐసీసీ!

టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో బంగ్లాకు మద్దతుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వి పలు వ్యాఖ్యలు చేశాడు. దీంతో పాక్‌పై ఐసీసీ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. పాక్ క్రికెట్‌పై తీవ్ర ఆంక్షలు విధించేందుకు ఐసీసీ రంగం సిద్ధం చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనంలో పేర్కొంది

టీ20 ప్రపంచ కప్ 2026: బంగ్లాదేశ్‌పై వేటు.. స్కాట్లాండ్‌ను రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించిన ఐసీసీ

టీ20 ప్రపంచ కప్ 2026: బంగ్లాదేశ్‌పై వేటు.. స్కాట్లాండ్‌ను రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించిన ఐసీసీ

వరల్డ్ కప్‌ 2026 నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ బహిష్కరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) నిరాకరించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌ జట్టును టోర్నీలోకి తీసుకున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి