Home » ICC
టీ20 ప్రపంచ కప్ 2026 కోసం పాకిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్ను ఐసీసీ ఈ టోర్నీ నుంచి తప్పించడంతో పాక్ కూడా వైదొలుగుతుందన్న వార్తలు వచ్చాయి. ఐసీసీ ఈ విషయంపై తీవ్రంగా స్పందించడంతో పీసీబీ వెనక్కి తగ్గి జట్టును ప్రకటించింది.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో బంగ్లాకు మద్దతుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వి పలు వ్యాఖ్యలు చేశాడు. దీంతో పాక్పై ఐసీసీ సీరియస్గా ఉన్నట్లు సమాచారం. పాక్ క్రికెట్పై తీవ్ర ఆంక్షలు విధించేందుకు ఐసీసీ రంగం సిద్ధం చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనంలో పేర్కొంది
వరల్డ్ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ను ఐసీసీ బహిష్కరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్కు రావడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిరాకరించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును టోర్నీలోకి తీసుకున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. ఈ టోర్నీలో ఎక్కువ శాతం మ్యాచులు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగానే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ, బీసీసీఐకి చెందిన ఉమ్మడి తనిఖీ బృందం గురువారం ఈడెన్ గార్డెన్స్ను సందర్శించింది.
టీ20 ప్రపంచ కప్-2026లో తమ మ్యాచులను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. ఐసీసీని కోరిన విషయం విదితమే. అయితే.. బుధవారం జరిగిన అత్యవసర సమావేశంలో బీసీబీ డిమాండ్ను ఐసీసీ తిరస్కరించింది. ఐసీసీ నిర్ణయంపై తాజాగా బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందించారు.
భారత్లో టీ20 ప్రపంచ కప్ ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లా కెప్టెన్ లిట్టన్ దాస్ ఈ విషయంపై స్పందించాడు. ప్రపంచ కప్ ఆడటంపై తాము మాట్లాడటం సురక్షితం కాదని వెల్లడించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్లో బంగ్లా ఆడనున్న మ్యాచుల వేదికలను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి మెయిల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ.. బీసీబీకి ఈ విషయంపై డెడ్లైన్ విధించినట్లు సమాచారం.
టీ20 ప్రపంచకప్-2026లో పాల్గోనేందుకు తమ జట్టును ఇండియాకు పంపబోమని మొండి పట్టుతో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో బిగ్ షాక్ తగిలింది. బీసీబీ తాజాగా చేసిన 'గ్రూప్ స్వాపింగ్' ప్రతిపాదనను ఐర్లాండ్ తిరస్కరించింది.
భారత్-బంగ్లాదేశ్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదానికి ఐసీసీ తెరదించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇద్దరు ఐసీసీ అధికారులు ఢాకా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్కు చెందిన ఓ అధికారికి బంగ్లాదేశ్ వీసా నిరాకరించింది.
ఆదివారం వడోదర వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ అంపైర్ సర్ఫుద్దౌలా సైకత్ విధులు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. ఈ విషయంపై బీసీబీ తాజాగా స్పందించింది. అతడికి బీసీబీకి సంబంధం లేదని తేల్చి చెప్పింది.