Home » Hyderabad
ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఓ కార్యాచరణను సిద్ధం చేసింది. కూడళ్లు, రద్దీ ఏరియాల్లో ట్రాన్స్జెండర్ల ఆగడాలు మితిమీరిపోతుంటాయి. ఇది ప్రజలకు తీవ్ర ఇబ్బందుకు కలిగిస్తోంది. అయితే దీని నివారణకు గాను వారికి ఉపాధి కల్పించడం ద్వాకా సమస్యను నివారంచవచ్చని తలిచి వారికి నగరంలోని మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీ ఉద్యోగాలను ఇస్తోంది.
హైదరాబాద్ గాంధీభవన్లో ఈ ఉదయం పదిగంటలకు టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నియమక పత్రాలు అందజేయనున్నారు. పూర్వ డీసీసీ అధ్యక్షులను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించనున్నారు.
హైదరాడాద్ నగరంలో సైబర్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ తరహా మోసాలకు బలవుతూనే ఉన్నారు. ఈ మోసాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ఈ మోసాలు ఎక్కువై పోతున్నాయి. తాజాగా కాచిగూడకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 14.34 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.
విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం మంగళవారం హైదరాబాద్ నగరంలోని నిర్ణిత ఏరియాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.
న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, పర్మిషన్ ఉండాల్సిందే అంటున్నారు పోలీసులు.
టాలీవుడ్ హీరో ధర్మ మహేశ్ భార్య గౌతమి చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సోమవారం బిగ్బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గౌతమి చౌదరిపై కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.
ఫుడ్బాల్ దిగ్గజం మెస్సీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్లో సీఎం పాల్గొననున్నారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్యపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అంటూ విమర్శలు గుప్పించారు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్ కోసం పారదర్శక పాలసీలు తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణలోని మహిళా సాధికారతకు రేవంత్ రెడ్డి సర్కారు పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేక MSME పార్కులు ఏర్పాటు చేయబోతోంది. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఇందులో..