Home » Hyderabad
ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్ కేసులో మరో కీలక నిందితుడిని తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన వరల్డ్లైన్ ఈ-పేమెంట్ గేట్వే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహిదీన్ను అదుపులోకి తీసుకున్నారు.
రాహుల్ గాంధీ పుట్టిన రోజున రైతు డిక్లరేషన్ను సీఎం రేవంత్ రెడ్డి బొందపెట్టారని హరీశ్ రావు విమర్శించారు. ధాన్యం ఏదైనా కనీస మద్దతు ధరతోపాటు బోనస్ కూడా ఇస్తామని నాడు రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.
వాన్పిక్ ఆస్తుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈడీ జప్తు చేసిన వాన్పిక్ ఆస్తులను విడుదల చేయాలని గతంలో ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ విచారణ ముగిసింది. దాదాపు గంటన్నరపాటు ప్రవీణ్ను సిట్ అధికారులు విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ సిట్ కార్యాలయంలో ఆయనను అధికారులు విచారించారు.
తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అమలుకు కేంద్రం నుంచి అధికారిక అనుమతి లభించింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హీరో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని అల్లు అర్జున్ను ఆదేశించింది.
విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పాటించడం అన్నది అలవాటుగా మారాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. ఇటీవల కాలంలో పిల్లలు క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారని... ఇది బాధ కలిగించే విషయమని తెలిపారు.
కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అన్న పరిస్థితిని సామాన్య ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి.
హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. హోటల్స్, రెస్టారెంట్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 45 ప్రముఖ ఫుడ్ లే అవుట్లు, 8 పన్నీర్ తయారీ కేంద్రాలపై దాడులు చేశారు.