• Home » Hyderabad

Hyderabad

గ్యాస్ కొరతతో పెరిగిన ఇండక్షన్ స్టవ్‌ల అమ్మకాలు.. రేట్లు పెంచి అమ్ముతున్న వ్యాపారులు

గ్యాస్ కొరతతో పెరిగిన ఇండక్షన్ స్టవ్‌ల అమ్మకాలు.. రేట్లు పెంచి అమ్ముతున్న వ్యాపారులు

ఇండక్షన్ స్టవ్‌లకు డిమాండ్ గ్రేటర్‌లో భారీగా పెరిగింది. గ్యాస్ కొరత, బుక్ చేసినా సిలిండర్ ఆలస్యంగా రావడం వంటి కారణాలతో నగరవాసులు ఇండక్షన్ స్టవ్‌లు వినియోగిస్తుండటంతో వాటి అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. విక్రయాలు పెరగడంతో హోల్ సేల్ మార్కెట్‌లో వీటి ధరలు 20-30 శాతం పెరిగాయి.

నాలుగో రోజు ప్రారంభం కానున్న ఉభయ సభలు.. నేడు చర్చించే అంశాలివే..

నాలుగో రోజు ప్రారంభం కానున్న ఉభయ సభలు.. నేడు చర్చించే అంశాలివే..

శాసనసభలో ఈరోజు పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ, ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగునీటి సరఫరా, వేతన సవరణ కమిషన్ ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

బైక్ స్క్రాప్.. రూ.800.. ఆర్‌వీఎస్ఎఫ్‌ల ఇష్టారాజ్యం

బైక్ స్క్రాప్.. రూ.800.. ఆర్‌వీఎస్ఎఫ్‌ల ఇష్టారాజ్యం

హైదరాబాద్ గోల్నాకకు చెందిన ఓ వ్యక్తి 15 ఏళ్ల గడువు ముగిసిన తన ద్విచక్రవాహనం (యాక్టీవా) స్క్రాప్ చేయాలని రవాణా శాఖ అధికారిక గుర్తింపు పొందిన ఓ ఏజెన్సీని సంప్రదించాడు. వాహనం ఫొటోలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ), లోకేషన్ వాట్సప్‌లో పంపాలని సూచించారు.

నిరుపేదను ఆదుకోవాలన్న సంకల్పంతోటే జీవిత భీమా: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

నిరుపేదను ఆదుకోవాలన్న సంకల్పంతోటే జీవిత భీమా: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

మానవీయ కోణంలో ఆలోచించి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క నిరుపేదను ఆదుకోవాలన్న సంకల్పంతో జీవిత భీమా తీసుకువచ్చామని తెలిపారు.

హైదరాబాద్‌కు అనేక విద్యాసంస్థలు తీసుకువచ్చా: సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌కు అనేక విద్యాసంస్థలు తీసుకువచ్చా: సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌కు అనేక విద్యాసంస్థలు, నల్సార్‌, ట్రిపుల్‌ ఐటీ తీసుకువచ్చానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గతంలో కేవలం మంజీరా నుంచే తాగునీరు వచ్చేదని పేర్కొన్నారు.

పంజాగుట్టలో ఘోర ప్రమాదం: బాల్కనీ కూలి తండ్రీకొడుకుల మృతి

పంజాగుట్టలో ఘోర ప్రమాదం: బాల్కనీ కూలి తండ్రీకొడుకుల మృతి

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాదకర ఘటన నగరంలోని పాత అపార్ట్‌మెంట్‌ల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.

ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని ఢీకొట్టిన కారు..  ఒకరి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై హిమాయత్ సాగర్ సమీపంలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

బడ్జెట్ కేటాయింపులపై బీఆర్ఎస్ ఆగ్రహం.. ప్రజలకు మెుండిచెయ్యి చూపించారంటూ మండిపాటు..

బడ్జెట్ కేటాయింపులపై బీఆర్ఎస్ ఆగ్రహం.. ప్రజలకు మెుండిచెయ్యి చూపించారంటూ మండిపాటు..

బడ్జెట్ కేటాయింపులపై బీఆర్ఎస్ పార్టీ మరోసారి విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఈ బడ్జెట్‌లో కూడా ఆరు గ్యారెంటీలకు ఘోరీ కట్టారని, డిక్లరేషన్లకు పాతర వేశారని, సంక్షేమ పథకాలకు సమాధి కట్టారంటూ మండిపడింది.

మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్ల మోసం

మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్ల మోసం

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సైబర్ మోసం కేసులో ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్తను నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. మాజీ డీజీపీ మనుమరాలైన బాధితురాలికి చెందిన సంస్థలో వాట్సాప్ ద్వారా మోసం చేసి భారీగా నగదు కాజేశారు.

బిజీ రోడ్డులో క్వాడ్ ‌బైక్‌పై చిన్న పిల్లల రైడింగ్.. నెటిజన్ల మండిపాటు..

బిజీ రోడ్డులో క్వాడ్ ‌బైక్‌పై చిన్న పిల్లల రైడింగ్.. నెటిజన్ల మండిపాటు..

ఓ పిల్లాడు ఏమాత్రం భయపడకుండా క్వాడ్ బైక్ ( నాలుగు చక్రాలు ఉండే చిన్న పిల్లల వాహనం)పై హైదరాబాద్‌లోని బిజీ రోడ్డులో రయ్ రయ్ మంటూ చక్కర్లు కొట్టాడు. అది కూడా బైక్ వెనకాల ఓ చిన్నారిని కూర్చోబెట్టుకుని మరీ క్వాడ్ బైక్ నడిపాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి