Home » Hyderabad
హైదరాబాద్ను ఫిల్మ్ ఇండస్ట్రీకి కేంద్రంగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాగాయకుడు గద్దర్ కళల ద్వారా సమాజానికి తన జీవితాన్ని అర్పించిన మహానుభావుడని కొనియాడారు డిప్యూటీ సీఎం.
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీ.. సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అని ఆరోపించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేఎల్ఎస్ఆర్కు అప్పగించారని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఆమె ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకోవడంపై భర్త సురేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విజయ మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
నాన్న నందమూరి తారక రామారావు ఆదేశాల మేరకు బసవతారకం ఆస్పత్రిలో అన్ని రకాల సేవలు అందిస్తూ రోగులకు ఓదార్పునిస్తున్నామని బాలకృష్ణ తెలిపారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు..
మున్సిపల్ ఎన్నికలపై సోషల్ మీడియా ప్రభావం చూపుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా కూడా విడుదల కావడంతో.. వారు ఇక సోషల్ మీడియాను వేదికగా మలుచుకుని ప్రచారాలను ప్రారంఢించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పాక్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పార్లమెంట్ సభ్యుడు ఘునందన్రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్లకు రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు.
కోఠి కాల్పుల కేసులో నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఘటన జరిగిన మరుసటి రోజే దుండగులు యూపీకి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు..
సంగారెడ్డి జిల్లా జగదేవ్పూర్ మండలం దౌలాపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందన్న వార్తలతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తముతోంది. బసంతపూర్లో లేగదూడపై పులి దాడిచేసినట్లు గుర్తించారు. దీంతో ఇక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండాపోతోంది.
మేడారం మహాజాతర ముగిసింది. అయితే.. జాతరకు విచ్చేసిన వారు వదిలివెళ్లిన వ్యర్థాలతో అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంది. దీంతో.. ఈ చెత్తను తొలగించేందుకు దాదాపు 5వేల మంది సిబ్బందితో పనులు నిర్వహిస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో రాయపూర్కు వెళ్లాల్సిన ఇండిగో విమానం నిలిచిపోయింది. టేకాఫ్ సమయంలో విమానంలో లోపాన్ని పైలెట్ గుర్తించారు..