Home » Hyderabad
హయత్నగర్ పరిధిలోని పుల్లారెడ్డి స్వీట్స్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో పెండింగ్ అంశాల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ కోరారు.
భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుండటంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాధాగాయత్రి తన భర్తతో కలిసి ఉత్తరాఖండ్లోని ముస్సోరీకి ట్రిప్నకి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, రాధాగాయత్రి మృతిపై.. తన స్నేహితులు సంచలన విషయాలు వెల్లడించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) జనరల్ సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేశారు. టీజీ-20 లీగ్ కోసం హెచ్సీఏ ఏర్పాటు చేసిన బ్యాంక్ అకౌంట్లను వెంటనే నిలిపివేయాలని సీఐడీని ఆయన కోరారు.
హైడ్రాపై దుష్ప్రచారం జరుగుతోందని.. పనిగట్టుకుని తమను కొందరు బద్నాం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఉండాలని తెలిపారు.
ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిపై అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దర్యాప్తును ఏసీబీ అధికారులు ముమ్మరం చేశారు.
పోక్సో కేసులో రిమాండ్లో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు.. బండి భగీరథ్కు మేడ్చల్–మల్కాజిగిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని.. ఈ ఏడాది యోగా డేను అమరావతిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమంపై జాతీయ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి SIR ప్రారంభమవుతుందని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫాం అందజేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు