Home » Hyderabad City Police
నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్ గ్రామంలో ఓ భార్య దాష్టీకానికి భర్త బలయ్యాడు. భార్య నాగలక్ష్మి ప్రియుడు మహేష్తో కలిసి భర్త హరిచరణ్ను హత్య చేసింది. నాగలక్ష్మి అదే గ్రామానికి చెందిన మహేష్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఖైరతాబాద్ బడా గణేశ్ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ తెలిపారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అపార్ట్మెంట్ ఓనర్ను హాస్టల్ యజమాని అమర్నాథ్ రెడ్డి చితకబాదాడు. అపార్ట్మెంట్లో తనకున్న 25 ప్లాట్లను హాస్టల్ నిర్వహించడానికి అద్దెకు ఇంటి యజమాని పిచ్చయ్య ఇచ్చాడు. కరోనాకు ముందు 25 ప్లాట్లను అద్దెకు ఇచ్చాడు.
గర్భిణి అయిన భార్య స్వాతిని ఆమె భర్త మహేందర్రెడ్డి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన మేడిపల్లి బాలాజీహిల్స్లో జరిగింది. భార్య స్వాతిని చంపి మృతదేహాన్ని భర్త మహేందర్రెడ్డి ముక్కలు చేశాడు. తల, కాళ్లు, చేతులు వేరు చేసి భర్త మహేందర్రెడ్డి మూసీలో పడేశాడని డీసీపీ పద్మజారెడ్డి
ఈకో గణేశ్, గ్రీన్ గణేశ్ కాన్సెప్ట్ను ప్రోత్సహిస్తూ.. నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ చెప్పుకొచ్చింది. మట్టి వినాయక విగ్రహాల వాడకం ద్వారా ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణ పరిరక్షణకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు
పోలీస్ శాఖలో నకిలీ సర్టిఫికెట్లు వెల్కిరావడంతో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇలా నకిలీ సర్టిఫికెట్లతో ఎంతమంది పోలీసులు ఉద్యోగాలు చేస్తున్నారో.. అనే అనుమానాలకు ఈ ఘటన తావిస్తోంది.
గాంధీ ఆసుపత్రికి సోహెల్ అనే ఖైదీని రిమాండ్కు తరలించే ముందు వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు తీసుకొచ్చారు. అయితే సోహెల్ చాకచక్యంగా.. బాత్రూమ్ వస్తుందని చెప్పి బాత్రూమ్లోకి ప్రవేశించాడు.
ఊరేగింపు ముగించుకుని 9 మంది లోపలకి రథంను తోసుకుంటూ వెళ్తున్న సమయంలో రథంకు విద్యుత్ తీగలు తాకడంతో విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 5 మంది మృతి చెందాగా.. మరో 4 గురి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది.
కూకట్పల్లి వైష్ణవి కాలనీలోని ఓ గెస్ట్ హౌస్లో పేకాట శిబిరం ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారంతో దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఆగస్టు 14న పక్కా సమాచారంతో సరోగసి జరుగుతున్న ఓ ఇంట్లో సోదాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోదాల సమయంలో సరోగేట్ తల్లులతో పాటు వివిధ ఫెర్టిలిటీ హాస్పిటల్లకు చెందిన డాక్యుమెంట్స్ని గుర్తించినట్లు చెప్పుకొచ్చారు.