Home » Hyderabad City Police
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు, కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో పులువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ సీసీఎస్తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్లో నమోదైన సంచలన కేసుల్లో తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ సిట్కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నాయకత్వం వహించనున్నారు.
ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన జాబ్ ఫ్రాడ్ ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. ‘అబ్దుల్ కలామ్ ఓఎస్డీ’ అని తనను తాను పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి, గ్రూప్ వన్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసినట్లు బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
తెలంగాణలో 2025లో చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులు గతంతో పోలిస్తే అత్యంత వేగంగా పెరిగాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెల్లడించారు. చిన్నారుల భద్రతకు ముప్పుగా మారుతున్న ఈ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు.
భాగ్యనగరంలోని నానక్రామ్గూడలో ఈగల్ టీమ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో సుధీర్రెడ్డిని అదుపులోకి తీసుకుని చెక్ చేశారు.
గంజాయి, డ్రగ్స్పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న కేటుగాళ్లు మాత్రం మారడం లేదు. తాజాగా బిహార్కు చెందిన యువకుడు ఏకంగా కిస్మత్పురలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి సాగుచేస్తున్నాడు.
నూతన సంవత్సర వేడుకలకు భాగ్యనగరం సిద్ధమవుతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకల అనంతరం ప్రజలు ఇంటికి చేరుకునే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పలు సూచనలు చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ పరిధిలో జింక మాంసం విక్రయాలు కలకలం రేపాయి. అత్తాపూర్లోని సులేమాన్ నగర్ ప్రాంతంలో జింక మాంసాన్ని అమ్ముతున్న మహ్మద్ ఇర్ఫానుద్దీన్ను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సైబర్ మోసాలపై పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తున్న ఎక్కడో ఒక చోట అమాయకులు సైబర్ కేటుగాళ్ల బారిన పడుతునే ఉన్నారు. తాజాగా ఓ బాధితురాలని సైబర్ మోసగాళ్లు మోసం చేసి భారీగా నగదు దోచుకున్నారు.
ప్రముఖ సినీనటి మాధవీలతకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో సాయిబాబా దేవుడు కాదని తప్పుడు ప్రచారాలు, వ్యాప్తి చేసినందుకు మాధవీలతపై కేసు నమోదు చేశారు.