Home » Hyderabad City Police
యువ నటుడు చంద్రహాస్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది.
హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ముషీరాబాద్కు చెందిన దక్షిణ మధ్య రైల్వే ఇంజినీర్ను ఓ యువతి పెళ్లి పేరుతో నమ్మించింది. అనంతరం క్రిప్టో ట్రేడింగ్లో లాభాల పేరుతో పెద్ద మొత్తంలో ఊడ్చేసింది. బాధితుడు సుమారు రూ.54 లక్షలు నష్టపోయాడు. ఈ మోసంపై వెంటనే బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. దొంగలు ఎంత చాకచక్యంగా చోరీ చేస్తున్నారనేందుకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది..
పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుల్తాన్పురా ప్రాంతంలోని ఒక ఫ్లాట్లో రెండు మృతదేహాలు సంచలనంగా మారాయి. అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మృతదేహాలు.. మహమ్మద్ షకీల్, అతని సోదరి సర్వార్ బేగంగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ని సిట్ అధికారులు శుక్రవారం విచారించనున్నారు. ఈ నేపథ్యంలో నందినగర్లోని కేసీఆర్ నివాసానికి పోలీసులు చేరుకుని, ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని నిబంధనలను పాటిస్తూ పోలీసులు ఇంటి పరిసరాలను తనిఖీలు చేసినట్లు సమాచారం..
మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు శుక్రవారం హాజరైన విషయం తెలిసిందే. ఈ విచారణ అనంతరం సిట్ చీఫ్ సజ్జనార్ స్పందించారు. ఆధారాలు, రికార్డులు ముందుంచి కేటీఆర్ను విచారణ జరిపామని స్పష్టం చేశారు.
సాఫ్ట్వేర్, బిజినెస్ హబ్గా ఉన్న కొండాపూర్ ప్రాంతంలో ఒక వ్యాపారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి ఏకంగా రూ. 1.04 కోట్లు పోగొట్టుకున్నారు. అమెరికా స్టాక్ బ్రోకర్గా పరిచయం చేసుకున్న ఓ కేటుగాడు, భారీ లాభాల ఆశ చూపి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డాడు.
సైబర్ నేరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, బాధితులకు భరోసా కల్పించే విధంగా సీ-మిత్ర కార్యక్రమానికి హైదరాబాద్ పోలీసులు శ్రీకారం చుట్టారు.టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మానవీయ దృక్పథాన్ని మేళవించి రూపొందించిన ఈ కార్యక్రమం ప్రజలకు భరోసాగా నిలుస్తోంది.
సోషల్ మీడియాలో లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పాపులారిటీ ఉన్న ఇన్ఫ్లూయెన్సర్లు అయినాసరే చట్టానికి అతీతులు కాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.