Home » Hindupur
ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారవేదికకు పలుశాఖల అధికారులు డుమ్మాకొడుతున్నారు. తహసీల్దార్ సౌజన్యలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం రెవెన్యూ కార్యాలయంలో గ్రీవెన్సను నిర్వహించారు. మండలంలోని గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యలను విన్నవించడానికి ఆయాశాఖల అధికారులు ఉంటారన్న నమ్మకంతో ఎన్నో కష్టాలను ఓర్చుకుని కార్యాలయానికి వస్తున్నారు.
హిందూపురం భవిష్యత్తుకు పునాది వేసింది నందమూరి తారకరామారావని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా మూడోరోజు సోమవారం మండలంలోని కె.బసవనపల్లిలో రూ.64లక్షలతో నిర్మించిన అదనపు తరగతిగది, లైబ్రెరీని ప్రారంభించారు.
హిందూపురం ప్రాంతంలో పరిశ్రమలు, పాఠశాలలు స్థాపించింది దివంగత నేత, మాజీ సీఎం ఎన్టీ రామారావు అని గుర్తు చేశారు.తనకు చదువు పట్ల అంతగా శ్రద్ధ ఉండేది కాదని బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హిందూపురం నియోజకవర్గంలో స్మాల్స్కేల్ ఇండస్ర్టీస్ హబ్ ఏర్పాటు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాసులును ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లిని ఆయన చాంబర్లో ఎమ్మెల్యే కలిశారు.
దానిమ్మ ధరలు నేలచూపులు చూస్తున్నాయి. నానాటికీ తగ్గుతున్నాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నెలరోజుల క్రితం ఉన్న ధరలు అమాంతం తగ్గి సగానికి పడిపోతున్నాయి. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, మున్సిపల్ చైర్మన రమేష్ అన్నారు. టీడీపీ నాయకుడు మగ్బూల్ ఆధ్వర్యంలో ఎంజీఎం క్రీడా మైదానంలో నాలుగు రోజులుగా అబ్దుల్కాలం క్రికెట్ టోర్నీ నిర్వహించారు.
ఇటీవల పట్టణంలో ఎటుచూసిన గ్రామసింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏస్థాయిలో ఉన్నాయో చెప్పడానికి పై చిత్రమే నిదర్శనం. ఒక టో రెండో కాదు పదుల సంఖ్యలో ఒకేచోట చేరుతున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్లే పాదచారులు లేదా ద్విచక్రవాహన చోదకుల వెంటపడి దాడిచేస్తున్నాయి.
స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి రెగ్యులర్ తహసీల్దార్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లుగా కార్యాలయంలో ఇనచార్జి అధికారులతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో ప్రజలు విసిగిపోతున్నారు. పెనుకొండ్ డివిజనలో చిలమత్తూరు మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉంటున్నాయి.
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 200యూనిట్ల ఉచిత విద్యుత అమలు చేయాలని చేనేతలు కోరారు. ఆగస్టు నుంచి అమలులోకి వచ్చిన ఉచిత విద్యుత పథకం అధికారికంగా అమలు కాలేదన్నారు.
కేసుల పరిష్కారంలో రాజీమార్గం ఎంతో ఉత్తమమని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో మెగా లోక్అదాలత నిర్వహించారు. 95కేసులు పరిష్కారం చేశారు.