Home » Hero Vijay
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రోడ్షోలో తమిళగ వెట్రి కళగం (టీవీకే)జెండాలు రెపరెపలాడటం చర్చనీయాంశమైంది. రెండేళ్లుగా పార్టీని నడుపుతున్న విజయ్ వ్యవహారశైలి అంతుబట్టని విధంగా మారింది.
టీవీకే అధినేత విజయ్కు ప్రాణహాని ఉందని, ఆ అనుమానంతోనే ఆయన కరూర్ వెళ్లేందుకు భద్రత కోరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. తిరునల్వేలిలో గురువారం నయినార్ నాగేంద్రన్ విలేఖరులతో మాట్లాడుతూ... కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటనలో విజయ్ ఇంకా బాధితులను పరామర్శించలేదన్నారు.
కరూర్ రోడ్షోలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబీకులను పరామర్శించేందుకు తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ తగు సన్నాహాలు చేపడుతున్నారు. ఆ దిశగా ఆయన తరఫు న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఊహించలేనిది జరిగింది... ఏ రకంగాను మీ నష్టాన్ని భర్తీచేయలేం... ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటా... త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటా’ అంటూ కరూర్ మృతుల కుటుంబాలకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఓదార్చారు.
కరూర్ తొక్కిసలాట ఘటనతో తీవ్రంగా నష్టపోయిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే).. నష్టనివారణ చర్యలకు దిగిందా?.. అధికార డీఎంకేను ఒంటరిగా అడ్డుకోవడం కష్ట సాధ్యంగా మారడంతో.. అన్నాడీఎంకేతో చేతులు కలిపేందుకు సిద్ధమైందా?.. ఆ పార్టీ అధినేత విజయ్ ఆదేశాల మేరకు క్రియాశీలక నేతలు.. అన్నాడీఎంకేతో మంతనాలు సాగిస్తున్నారా?.. అవుననే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ రాజకీయ వర్గాలు.
కరూరు దుర్ఘటనకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ టీవీకే నేత విజయ్కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్న వ్యవహరానికి రాజకీయ రంగు పులమద్దని కరూరు ఎంపీ జ్యోతిమణి అన్నారు.
కరూర్ తొక్కిసలాట దుర్ఘటనను అడ్డుపెట్టుకుని ఏ రాజకీయ పార్టీ రాజకీయ లబ్ధికోసం పాకులాడొద్దని డీఎంకే మహిళా నేత, తూత్తుకుడి ఎంపీ కనిమొళి విఙ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ఆమె మంగళవారం మాట్లాడుతూ, తొక్కిసలాట జరిగిన సమయంలో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
కరూర్లో టీవీకే అధినేత విజయ్ ప్రచారం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని, విద్యుత్ సరఫరాను నిలిపేశారని, ఉద్దేశపూర్వకంగా ప్రచారమార్గంలో అంబులెన్సులను నడిపారంటూ వస్తున్న విమర్శలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు సమాధానం చెప్పారు.
ఇటీవల ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్ కరూర్ పర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన వ్యవహారం రాష్ట్రంలో ఇంకా నిప్పు రాజేస్తూనే వుంది. ఈ దుర్ఘటన ద్వారా లబ్ధి పొందేందుకు అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతుండడంతో మరిన్ని కొత్త వివాదాలకు కారణమవుతోంది.
కరూర్ దుర్ఘటనలో అన్నివైపులా తప్పులు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం అభిప్రాయపడ్డారు.శనివారం సాయం త్రం కరూర్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పర్యటనలో ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు.