Home » Hero Vijay
వర్షాల కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటల్లో కంకులు మొలకెత్తినట్లే, రాష్ట్ర ప్రజల్లో డీఎంకే పాలనపై తీవ్ర వ్యతిరేకత మొలకెత్తి, పెరిగి పెద్దదై పాలకులను ఇంటికి సాగనంపటం ఖాయమైపోయిందని ‘తమిళగ వెట్రి కళగం’ నాయకుడు విజయ్ జోస్యం చెప్పారు.
గత నెలలో కరూర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని ‘తమిళగ వెట్రి కళగం’ అధ్యక్షుడు విజయ్ భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబీకులను వారిళ్లకే వెళ్లి పరామర్శించడానికి రాలేకపోయినందుకు తీవ్ర భావోద్వేగంతో క్షమాపణ అడిగారు. కరూర్లో రోడ్షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబ సభ్యులను, గాయపడినవారిని విజయ్ పరామర్శించారు.
తమ కూటమిలోకి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్ వస్తే ఘనంగా స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ పేర్కొన్నారు.
‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ మళ్ళీ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే వారం పర్యటన ప్రారంభించాలని విజయ్ భావిస్తున్నారు. ఈ విషయంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్తో పాటు పార్టీ సీనియర్ నేతలతో ఆయన సమాలోచన చేస్తున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అన్నాడీఎంకే కూటమిలో చేరకపోతే ఆ పార్టీ పత్తాలేకుండా పోతుందని మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనాయకుడు ఆర్బీ ఉదయ్కుమార్ హెచ్చరించారు.
కరూర్లో సెప్టెంబర్ 27రాత్రి నిర్వహించిన రోడ్షోలో జరిగిన తొక్కిసలాటలో గాయపడినవారికి కూడా త్వరలోనే తలా రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని టీవీకే నేత విజయ్ ప్రకటించారు. తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబాలకు ఆయన తలా రూ.20 లక్షల చొప్పున వారి బ్యాంక్ ఖాతాలలో జమచేసిన విషయం తెలిసిందే.
కరూర్లో ‘తమిళగ వెట్టి కళగం’ (టీవీకే) రోడ్షోలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందటానికి ఆ పార్టీ నాయకుడు ఏడు గంటలు ఆలస్యంగా రావటమే కారణమని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
అన్ని పార్టీల ఓట్లను తమిళగ వెట్రి కళగం (టీవీకే) తప్పకుండా చీలుస్తుందని, ఇందువల్ల కూటమికి నష్టంవాటిల్లకుండా అధికార డీఎంకే చర్యలు తీసుకోవాలని కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి (కేఎండీకే) ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ఈశ్వరన్ అభిప్రాయం వ్యక్తంచేశారు.
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో పొత్తు కుదుర్చుకోనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
కరూర్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారపర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలను దత్తత తీసుకుంటామని ఆ పార్టీ ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జునా తెలిపారు.