విజయ్ వాహనాన్ని అనుసరిస్తూ గాయపడిన యువకుడి మృతి
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:48 PM
ఇటీవల తంజావూరు జిల్లా సింగిపట్టి పర్యటనకు వచ్చిన టీవీకే అధినేత విజయ్ కారు వెంట బైక్తో పరుగులుతీసి ప్రమాదానికి గురైన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
చెన్నై: ఇటీవల తంజావూరు జిల్లా సింగిపట్టి పర్యటనకు వచ్చిన టీవీకే అధినేత విజయ్(Vijay) కారు వెంట బైక్తో పరుగులుతీసి ప్రమాదానికి గురైన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఇటీవ ల తిరుచ్చి నుంచి విజయ్ రోడ్డుమార్గంలో సింగిపట్టికి వెళ్తుండగా కారు వెంట ఆయన వీరాభిమానులు మోటారు సైకిళ్లతో అనుసరించారు.
వారిలో వాహనం నడుపుతున్న విఘ్నేష్ అనే యువకుడు తంజావూరు జిల్లా వలంపక్కుడి వద్ద మరో మోటార్ సైకిల్ను ఢీకొట్టి, తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స ఫలించక ఆదివారం రాత్రి కన్నుమూశాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఓఆర్ఆర్ చుట్టూ ఆధునిక బస్టాండ్లు, టెర్మినళ్లు
Read Latest Telangana News and National News