Home » Heavy Rains
ఇంజనీరింగ్ , పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు మంత్రి నారాయణ. తాగు నీరు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై మంత్రులు, సీఎస్, ఆర్టీజీ అధికారులతో మాట్లాడారు సీఎం. యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
వెదురుకుప్పం మండలం దేవళంపేట వద్ద రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడి గ్రామస్తులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన మూడు రోజులకే ఉగ్రరూపం దాల్చటంతో చెన్నై(Chennai) పరిసర జిల్లాల్లో, కావేరి డెల్టా జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో శనివారం కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. 22 నుంచి ఏపీలో భారీ నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపారు.
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనుండటం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో చెన్నై నుండి కన్నియాకుమారి వరకు ఈ నెల 17 నుండి 18వరకు భారీగా వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్డీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వాతావరణంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.