Home » Heavy Rains
గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరద నదిలో చేరుతుండటంతో పలు జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.
ఎగువన భారీ వర్షాలకు వస్తున్న వరదతో పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా.. మంగళవారం 404.60 అడుగులకు చేరింది. దీంతో రాత్రి రెండుగేట్లను ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదలచేశారు.
ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటకతోపాటు రాష్ట్రంలోనూ భారీ వర్షాలు పడుతుండడంతో గోదావరి, కృష్ణ నదులు ఉగ్రరూపం దాల్చాయి. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం 6.65లక్షల క్యూసెక్కులకు చేరింది.
తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరిగిపోయింది. సోమవారం జలాశయం నుంచి నదికి 26 గేట్లు ద్వారా 1,07,000 క్యూసెక్కుల నీరు బోర్డు అధికారులు విడుదల చేశారు. కాలవల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండంతో కంప్లి కోటే తుంగభద్ర నది వంతెనపై బరువైన వాహనాలకు అధికారులు నిలిపివేశారు.
భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ముంబైతోపాటు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ...
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు.
Telangana heavy rains: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 17.9 సెం.మీ భారీ వర్షం కురిసింది. కౌడిపల్లి 17.2, పెద్ద శంకరంపేట 16.4, దామరంచ 15.8, మాసాయిపేట 14.8 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు అనేక జిల్లాలను అతలాకుతలం చేశాయి. వానల కారణంగా జూన్ 20 నుంచి ఆగస్టు 16 వరకు రాష్ట్రంలో ఏకంగా 261 మంది మరణించారని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా.. కొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు పడ్డాయి. చాలా చోట్ల చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రోడ్లు తెగిపోయాయి.