Home » Heavy Rains
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా వర్షం నీరు చేరి ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. దీంతో విమానాల రాకపోకలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది.
నగరంలో, సబర్బన్ ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది.గత మూడు రోజులుగా పగటిపూట ఎండవేడి, రాత్రిపూట చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం చిరుజల్లుతో ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి కుండపోతగా మారింది.
కల్లోల వాతావరణం శాంతించింది. రైతుల గుండెల్లో మాత్రం అశాంతే మిగిలింది. విరామం లేకుండా కొన్నిరోజుల పాటు ఉధృతంగా కురిసిన వర్షం ఇప్పుడు లేదు. కానీ ఆ వాన మిగిల్చిన విపత్తు అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది. భారీ వర్షం..
ఢిల్లీ, పరిసర ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, భారీ వర్షాలకు, రాకపోకలపై తీవ్ర ప్రభావం ఉంటే అవకాశం ఉన్నందున ప్రజలు లోతత్తు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు.
రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఎడతెగని వర్షాలు కురుస్తుండంతో సామాన్య ప్రజాజీవనానికి అంతరాయం కలుగుతోంది. కోట, బుండి, సవాయ్ మాధోపూర్, టోంక్లలో వరదల తరహా పరిస్థితి కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రోడ్డు, రైల్ కనెక్టివిటీ దెబ్బతింది.
శ్రీశైలం ప్రాజెక్ట్కు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్ట్ 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు.
గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరద నదిలో చేరుతుండటంతో పలు జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.
ఎగువన భారీ వర్షాలకు వస్తున్న వరదతో పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా.. మంగళవారం 404.60 అడుగులకు చేరింది. దీంతో రాత్రి రెండుగేట్లను ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదలచేశారు.
ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటకతోపాటు రాష్ట్రంలోనూ భారీ వర్షాలు పడుతుండడంతో గోదావరి, కృష్ణ నదులు ఉగ్రరూపం దాల్చాయి. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం 6.65లక్షల క్యూసెక్కులకు చేరింది.
తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరిగిపోయింది. సోమవారం జలాశయం నుంచి నదికి 26 గేట్లు ద్వారా 1,07,000 క్యూసెక్కుల నీరు బోర్డు అధికారులు విడుదల చేశారు. కాలవల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండంతో కంప్లి కోటే తుంగభద్ర నది వంతెనపై బరువైన వాహనాలకు అధికారులు నిలిపివేశారు.