Home » Harish Rao
కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
కేసీఆర్ స్థాయి.. రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు తెలుసని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని తెలిపారు. జగిత్యాల సభలో కేసీఆర్ హుందాగా మాట్లాడారని చెప్పుకొచ్చారు.
జీవన్ రెడ్డిని ఎప్పుడూ హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించలేదని ఎంపీ చామల కిరణ్ రెడ్డి తెలిపారు. కేటీఆర్.. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లినప్పుడు హరీశ్ రావు వెళ్లలేదని అన్నారు.
బీఆర్ఎస్లో కాలేశ్వరరావు అనే హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మాజీ మంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్లో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న అవమానాలతో హరీశ్ మానసిక స్థితి సరిగా లేదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ భారతదేశ ప్రజలను ఏకం చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని ఎంపీ చామల కిరణ్ రెడ్డి విమర్శించారు. డీలిమిటేషన్ బిల్లును పెట్టి మహిళా బిల్లుగా బీజేపీ ప్రొజెక్ట్ చేసుకుంటోందని ఎంపీ అన్నారు.
లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు తెలుస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పెదవులు మూసుకుని కూర్చున్నారని మండిపడ్డారు.
పార్లమెంట్ వేదికగా డీలిమిటేషన్ బిల్లుపై ప్రసంగించిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని అవమానించేలా మాట్లాడారంటూ అసభ్య పదజాలం వాడుతూ ఘాటుగా విమర్శించారు.
అంబేడ్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట రూరల్ మండలం తడకపల్లిలో బాబాసాహెబ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ కొందరివాడు కాదని.. అందరి వాడని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు రావడం వల్లే సిద్దిపేట జిల్లాకు పరిశ్రమలు వస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఈ ప్రాంతానికి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వచ్చినా, బయోగ్యాస్ ప్లాంట్ వచ్చినా రెండింటికీ కాళేశ్వరం ప్రాజెక్టే కారణమని చెప్పారు.
పాలమూరు వలస జిల్లాగా మారటానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 80 శాతం పూర్తి చేశామని ఆయన చెప్పారు.