Home » Harish Rao
సింగరేణికి నైనీ కోల్ బ్లాక్ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సింగరేణిని అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటున్నాయని ఆరోపించారు.
సర్ (SIR) ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియతో ఓట్ల గోల్మాల్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే.. ఆయనలో సైకో కన్పిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పొలాల్లో నీళ్లు పారించమంటే బూతులు పారిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్లో రాజ్కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని హత్య చేయడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. ఈ ఘటన అత్యంత దారుణమైనదని, హృదయవిదారకమని ఆయన పేర్కొన్నారు.
మూడు నెలలు నీటిపారుదల మంత్రిగా అవకాశం ఇస్తే నీటి సమస్యను పరిష్కరించి చూపిస్తానంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. హరీశ్ రావు నిజంగా కాంగ్రెస్లోకి వస్తానంటే పార్టీలో చర్చిస్తామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెగిటివ్ మైండ్సెట్తో ఉన్నారని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయమంటే ఎన్డీఎస్ఏ సాకు చెబుతున్నారని.. మరి సమ్మక్క బ్యారేజీ మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లాలోని కొండపాక సత్యసాయి సంజీవని శిశు హృదయాలయ హాస్పిటల్ను సినీ నటుడు విజయ్ దేవరకొండ, మాజీమంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఆస్పత్రిలో 500 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు.. మంత్రి జూపల్లి కృష్ణారావుకు బహిరంగ లేఖ రాశారు. ఆర్బీఐ గణాంకాలు, అసెంబ్లీలో చేసిన ప్రసంగాల వీడియోలను వాట్సాప్ ద్వారా పంపినట్లు వెల్లడించారు.
తెలంగాణ అప్పులకు సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు రాసిన లేఖపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అప్పులపై మంత్రి జూపల్లి పంపిన వాట్సాప్ లేఖ అందిందని తెలిపారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో అప్పులపై కేసీఆర్ స్పందించాలన్నారు.