Home » Guntakal
గ్రామాల్లో ఎలాంటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి అధి కారులకు సూచించారు. ఆయన శనివారం పట్టణం లోని తన నివా సంలో యాడికి మండలం అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో తాగునీరు, విద్యుత, డ్రైనేజీ వంటి సమస్యల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యఽ దిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
ఈ ఏడాది వేసవికాలం ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఎండలకు బయట తిరగాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. బయట నుంచి ఇంటికి వస్తూనే చల్లటి నీరు తాగితే గాని దాహార్తి తీరడం లేదు.
పంచాయతీరాజ్ వ్యవస్థతో గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యం ఎంతో బలోపేతమైందని ఎంపీడీవో వీ ర్రాజు తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్క రిం చుకొని శుక్రవారం యాడికి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు
అధికారులు నిర్లక్ష్యం వీడి మంచి పరిపాలన అందించాలని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సూచించా రు. పట్టణంలోని తమ నివాసంలో ఆయన మున్సిపల్, సచివాలయం తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
మండల పరిధిలోని కమ్మూరులో శుక్రవారం పెద్దమ్మ, మారెమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఇం టింటి నుంచి బోనాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారికి సమ ర్పించారు.
మండల పరిధిలోని జంబు గుంపల ఆటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న ట్లు స్థా నిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విష యాన్ని ఆటవీ శాఖ అధికారులకు తెలియజేసి నా నిర్లక్ష్యం వహిస్తూ ఎర్రమట్టి తరలించేం దుకు వారే సహకరిస్తున్నారని మండిపడుతు న్నారు.
మా బండి. మా ఇష్టం అనే రీతిలో మండలంలో కొందరు ద్విచక్రవాహనదారులు వ్యవహరిస్తున్నారు. రవాణాశాఖ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టమొచ్చినట్లు నంబర్ ప్లేట్లు అమర్చుకుంటున్నారు. ప్లేట్ ఉంటుంది కానీ కొన్నింటిపై నంబర్ ఉండదు.
మండల కేంద్రంలోని ఎక్సైజ్ స్టేషనను డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య గురువారం తని ఖీ చేశారు. పలు రికార్డులను, కేసుల వివరాలను పరిశీలించారు. అ నంతరం పలు మద్యం దుకాణాలను తనిఖీ చేశారు.
కలెక్టర్ ఒ. ఆనంద్ పామిడి మండలంలో గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలోని ఎం లక్ష్మీదేవి ఇంటిపై అమర్చిన పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెల్ను పరిశీలించారు. పట్టణంలో 50 యూనిట్లకు ప్రస్తుతం 35 యూనిట్లు పూర్తయినట్లు ట్రాన్స కో ఏఈ మధుసూదనరావు పేర్కొన్నారు.