Home » Guntakal
జాతీయ గ్రామీణ ఉపాధి హ మీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో మండలంలో వివిధ గ్రామాల్లోని వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. పల్లె పండుగ-2.0 కింద సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 2.86 కోట్ల నిధులు మంజూరు చేశారు.
పట్టణంలోని శ్రీ శంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాల విద్యార్థులు మేనేజ్మెంట్ ఫెస్ట్లో ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపా రు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంగళవారం కళాశాలలో అభి నందించారు.
మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీలక్ష్మీ వెంకటరమణస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా మంగళ వారం గరుడ వాహనంపై స్వా మివారు దర్శనమిచ్చారు. ఉద యాన్నే ప్రత్యేక పూజలు నిర్వ హించారు.
ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యు వల్ చేయాలని మండల కేంద్రంలోని ఫాదర్ ఆలయం ఎదుట మంగళ వారం వైసీపీ కళ్యాణదుర్గం సమన్వ యకర్త తలారి రంగయ్య ఆధ్వ ర్యంలో లక్ష పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభించారు. ఈ కార్యక్ర మాని కి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, నియోజకవర్గాల సమన్వయ కర్తలు సాకే శైలజానాథ్, విశ్వేశ్వరరెడ్డి, జడ్పీ చైర్పర్సన బోయ గిరిజమ్మ, నియోజకవర్గ పరిశీలకులు మహేం దర్ రెడ్డి, నాయకులు ఉమామహేశ్వర నాయుడు, తిప్పేస్వామి హాజర య్యారు.
‘నన్ను కమర్షియల్ ట్యాక్స్ కట్టమని అడిగేందుకు నువ్వెవరు? నువ్వేమైనా జిల్లా కలెక్టరా? లేక జిల్లా స్థాయి అధికారివా’? అంటూ ఓ వైసీపీ నాయకుడు పంచా యతీ కార్యదర్శిపై మంగళవారం చిందులు తొక్కాడు. వ్యాపార సము దాయాలకు హౌస్ ట్యాక్స్ కాకుండా కమర్షియల్ ట్యాక్స్ కట్టాలని పంచా యతీ కార్యదర్శి మహేష్ మంగళవారం నోటీసులు తీసుకుని ఆ వైసీపీ నాయకుడి ఇంటికి వెళ్లాడు.
మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి 554డీడీ లో గూబనపల్లి వద్ద మమవప్రమా దాలకు నిలయంగా మారిం ది. నిత్యం ఏదో ఒక చోట ప్ర మాదం జరుగుతూనే ఉంది. అయినా రోడ్డుపై అవసరమై న చోట్ల్ల స్పీడ్ బ్రేకర్లు, హె చ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దామని ఎంఈవో ఎర్రిస్వామి పిలుపునిచ్చారు. మన ఊరు- మన బడి కరపత్రాలను సోమవారం ఆయన విడుదల చే శారు. మూడు వేల కరపత్రాలను ముద్రించేందుకు కోర్టు ఉద్యోగి శ్రీ నివాసులు ముందుకు రావడం హర్షణీయమన్నారు.
క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల తర్వాత వ్యాధి లక్షణాలు ఉన్న వారికి అవసరమైన వైద్యసేవల్లో తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. పట్టణంలోని సీతారామాంజనేయస్వామి కల్యాణమండపంలో సోమవారం బసవతారక స్మారక క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో ఎ మ్మెల్యే ఆధ్వర్యంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎంఈఓ రవినాయక్ పిలుపునిచ్చారు. పట్టణంలోని కోట జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో పాఠశాల హెచ ఎం సబహాన అధ్యక్షతన సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో వెలసిన లక్ష్మీ వెంకటేశ్వరస్వామి సో మవారం హనుమద్ వా హనంపై భక్తులకు దర్శన మిచ్చారు. ఉదయాన్నే మూ లవిరాట్కు, హనుమద్ వా హనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.