Home » Guntakal
కేబుల్ లైన్ల ఏర్పాటు పేరుతో రహదారిని తవ్వేశారు. ఆ తర్వాత పట్టించుకోక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డి. హీరేహాళ్ మండలంలోని బాధనాల, దొడఘట్ట గ్రామాల రోడ్డు పక్కన ఓ మొ బైల్ నెట్వర్క కేబుల్ పనుల కోసం చేపట్టిన తవ్వకాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి.
మండల పరిధిలోని ఉద్ధేహాళ్ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం 2001-02 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత వివిధ ప్రాంతాల్లో స్థిరప డిన విద్యార్థులు ఒకేచోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు.
పుట్టిన బిడ్డ నుంచి ఆరేళ్ల పిల్లలు వరకూ వచ్చే వైకల్యాలను, లోపాలను, అభివృద్ధి ఆలస్యాలను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీడీపీవో బీఎన శ్రీదేవి, విడపనకల్లు తహసీల్దారు డీ వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు.
స్థానిక డంపింగ్ యార్డ్ లో చేపట్టిన చెత్తశుద్ధి ప్రక్రియ సెప్టెంబరు నాటికి పూర్తవుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపా రు. డంపింగ్ యార్డులో జరుగుతున్న చెత్తశుద్ధి, వ్యర్థాల నిర్వహణ పనుల ను శనివారం ఆయన పరిశీలించారు.
మండల కేంద్రంలోని పలు చి కెన సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడిస్తున్నా రు. దీంతో దుర్వాసనతో పాటు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మండలంలోని నేమక ల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి వారికి శనివారం విశేష పూజలు నిర్వహించారు.. ప్రధాన అర్చకులు అనిల్కుమార్ ఆచార్యు లు ఉదయం పంచామృతాభిషేకం, వెండికవచ అలంకరణ చేశారు.
మండలంలోని వడ్రవన్నూరు గేట్ సమీపంలో రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వి జయ్, భాస్కర్ అనే ఇద్దరికి గాయాలయ్యాయి. అందులో వి జయ్ పరి స్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపే తం చేసేదిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడిపిలుస్తోంది కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోం దని ఎంపీడీవో వీరరాజు, ఎంఈవో-2 సీతారామాంజనేయు లు తెలిపారు.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీవనోపాధి కోల్పోయేలా చేసే స్మార్ట్కిచెన ప్రతిపాద లను వెనక్కి తీసుకోవాలని గురువారం మధ్యాహ్న భోజన పథకం కా ర్మికులు, సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు గురువారం స్థానిక ఎమ్మార్సీలో ఎంఈవో-2 సీతారామాంజనేయు లుకు వినతిపత్రం అందజేశారు.
మండల కేంద్రంలో కుం దుర్పమ్మ జాతరలో భాగంగా చివరి రోజు గురువారం సాయంత్రం గావు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జాతర ముగుస్తున్న సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి కుందుర్పమ్మ, పాతప్ప ఆలయాల వద్ద మొక్కులు తీర్చుకున్నారు.