Home » Guntakal
మహిళల ఆర్థిక స్వాలంబనతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివా సులు పేర్కొన్నారు. వెలుగు (సెర్ప్) ఆధ్వర్యంలో పట్టణంలోని డ్వామా కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా వెలుగు మహిళలకు సెల్ఫోన్లు పంపిణీ చేశారు. అలాగే కుట్టుశిక్షణ పూర్తి చేసు కున్న మహి ళలకు సర్టిఫికెట్లు, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రుణ మంజూరు పత్రాలు అందజేశారు.
మండలంలోని కలుదేవ నహళ్లిలోని నూతన ఆలయంలో శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి, అభయాంజనేయస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలను రెండో రోజు మంగళవారం ఘనంగా నిర్వహించా రు.
ఒకవైపు వేసవిలో దా హంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరోవైపు దాదాపు 15 రోజులుగా కళ్లెదుటే తాగునీరు వృథా అవుతున్నా పట్టించుకునే వారు కనిపించడం లేదు. మండలంలోని కలుదేవనహాళ్లి సమీపంలోని వేదావతి హగరి కాజువేపై పైపులైన లీకేజీతో నీరు రో డ్డుపై పారుతూ... అధికార యంత్రాంగం నిర్లక్ష్య్యానికి నిదర్శనంగా నిలు స్తోంది.
మండలంలోని తిమ్మన చెరువు లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా ఈనెల 30న అంగ రంగ వైభవంగా తిరుణాలను నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం దేవస్థానాన్ని పరిశీలించి అర్చకులు, ఆలయ కమిటీ వారితో మాట్లాడారు. తిరుణాల ప్రత్యేకంగా నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లను త్వరగా పూర్తిచేయాలని తెలిపారు.
ప్రజా సమస్యలను తె లుసుకుని పరిష్కరించడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం పట్టణంలోని టైలర్స్కాలనీ, శివానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
పట్టణంలో ఏడు పెట్రోల్ బంకులు ఉండగా ఆరింటిలో నో స్టాక్ బోర్డులు పెట్టేశా రు. దీంతో పెట్రోలు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటు న్నారు. పట్టణంలోని కోర్టు పక్కన ఉన్న పెట్రోల్ బంకులో మాత్రమే సోమవారం పెట్రోల్, డీజిల్ వేస్తుండగా వాహనదారులు బారులు తీ రారు.
పట్టణంలో భోగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వేదపండితులు ఉదయం గణపతి పూజ, గోపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసన, రక్షాబంధనం, దీక్షాధారణ, కలశస్థాపనతో పాటు సాయం త్రం హోమాలు నిర్వహించారు.
మండల పరిధిలోని శ్రీరంగాపురం రంగమ్మ చెరువులో అధికారుల పర్యవేక్షణ లోపంతో మట్టి మాఫియా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ చెరువులోని ఒండ్రుమట్టికి మంచి గిరాకీ ఉంది. దీంతో గ్రామానికి చెందిన ఇద్దరు వైసీపీ నాయకులు పది రోజుల నుంచి ఎక్స్కవేటర్లు పెట్టి తరలిస్తూ దోపిడీ చేస్తున్నారు.
పట్టణంలోని డబ్బిదార్ ఫిర్కా రుక్మిణి సమేత పాండురంగస్వామి పునః ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనం గా జరుగుతున్నాయి. టీటీడీ వేద పండితుల బృందం శనివారం మహా కుంభారాధన, మండలారాధన, చతుస్తానార్చన, మూర్తి హోమం, లఘుపూర్ణహుతి, వేద విన్నపం నిర్వహించారు.
విద్యార్థులు చదు వుతో పాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని గుంతకల్లు జ్యుడి షియల్ ఫస్ట్క్లాస్ కోర్టు న్యాయాధికారి జి. మంజుల పేర్కొన్నారు. స్ధాని క ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం లీగల్ లిటరసీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.