Home » Guntakal
స్థానిక రైల్వేస్టేషనకు వెళ్లేందుకు సమీపంలోనే ఉన్న లింక్రోడ్డును పూర్తిగా ఆచరణలోకి తీసు కురావాలని ప్రజలు కోరుతున్నారు. ఏళ్ల తరబడిగా దీని కోసం నిరీక్షిస్తు న్నారు. ముఖ్యంగా పట్టణంలోని ఓబుళాచారిరోడ్డు నుంచి రైల్వేస్టేషన చాలా దగ్గర గా ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను తగ్గించా ల్సిందేనని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త నిరస నలో భాగంగా వారు రాస్తారోకో నిర్వహించారు. గుంతకల్లు పట్ట ణంలోని హనుమాన సర్కిల్లో మంగళవారం రాస్తారోకో నిర్వహించా రు.
పట్టణంలో మంగళవా రం సాయంత్రం వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు వర్షం పడడంతో స్థానిక టవర్క్లాక్ కూడలిలో వర్షపు నీరు నిలబడి వాహనదారులు, పాదాచారులు, కూరగాయల వ్యాపారులు తీవ్ర ఇ బ్బందులు పడ్డారు.
ఖరీఫ్ సీజన లో వర్షాలు బాగా కురిసి, పం టలు బాగా పండాలని గ్రామ దేవత కుంటెమ్మను రైతులు వేడుకున్నారు. మండలపరిధి లోని పి. నాగిరెడ్డిపల్లిలో మం గళవారం గ్రామ దేవత కుంటె మ్మకు ఇంటింటి నుంచి అన్న దాతలు బోనాలు సమర్పించారు.
ప్రజా సమస్యలు పరిష్కరిం చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం పట్టణంలోని కృష్ణాపురం ఒకటో రోడ్డు, రెండో రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను పలకరిస్తూ, సమ స్యలను అడిగి తెలుసుకున్నారు.
వేసవి సెలవుల అనంతరం మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. చాలా చోట్ల పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు కనిపిం చడం లేదు. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నేటికీ విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదని విమర్శలు ఉన్నాయి.
పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తు న్నామని ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న పాత పోలీస్ క్వార్టర్స్ మైదానంలో సోమవారం పోలీస్ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు నిర్మాణానికి ఎస్పీ జగదీష్ సోమవారం భూమిపూజ చేశారు.
కర్నూలు జిల్లాలో వీ ఆర్వో మ హమ్మద్ హుసేన ఆత్మహత్యపై స్ధానిక తహసీల్దార్ కార్యాల యం వద్ద సోమవారం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యం లో నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.
తన ఇద్దరి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి, భీమలింగమ్మ అనే ఉపాధ్యా యురాలు ఆదర్శంగా నిలిచారు. వజ్రకరూరు మండలంలోని పీసీ కొత ్తకోట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు భీమలింగ మ్మ తన కుమారుడు సాయితేజను ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి లో చేర్పించేందుకు అంగీకారం తెలిపారు.
అమృత - 2 పథకం కింద రూ. 78 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టు పనులను త్వ రలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. పట్టణంలోని 29వ వార్డు పరిధిలో శుద్ధిచేసిన తాగునీటి సరఫరాను సోమవారం ఆయన ప్రారంభించారు.