Home » Guntakal
పట్టణంలో పదో తరగతి పరీక్షలు సోమవారం సజావుగా ప్రారంభ మయ్యాయి. మండల వ్యాప్తంగా ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ రవినాయక్ తెలిపారు. మొత్తం 1518 మందికి గాను 26 మంది గైర్హాజరయ్యారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. రాయదుర్గం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇనచార్జ్ మంజునాథ్గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
పట్టణ సమీపంలోని యల్లనూరు రహదారిలో శనివారం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే అశ్మితరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే గేటు వేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో రూ.49 కోట్ల వ్యయంతో ఆర్వోబీ నిర్మిస్తున్నట్లు తెలిపారు.
రాయలసీమను టూరి జం సర్క్యూట్గా, తాడిప త్రిని టెంపుల్ సిటీగా అ భివృద్ధి చేయాలని మున్సి పల్ చైర్మన జేసీ ప్రభా కర్ రెడ్డి కోరారు. గుత్తి పట్టణం ఫుట్బాల్ క్రీడా మైదానంలో జరిగిన గు త్తికోట ఉత్సవాలలో ఆ యన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ ఆనంద్కు వినతి పత్రం సమర్పించారు.
మం డలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన అంజనేయస్వామికి శ నివారం విశేష పూజలు నిర్వ హించారు. ప్రధాన అర్చకులు అనిల్ కుమార్ ఆ చార్యులు ఉదయం మూలవిరాట్కు పం చామృతాభిషేకంచేసి అలంక రించారు.
మండలంలోని బీటీపీ ఎడ మకాలువ కింద ఆయకట్టు భూముల్లో వరి పంట పచ్చగా కళకళ లాడుతోంది. ఆరేళ్ల క్రితం కంపచెట్లు పెరిగి బీటలువారిన బీడు భూ ముల్లో నేడు పచ్చని వరిపైరు కనువిందు చేస్తోంది. కరువు ప్రాంతంగా పేరుపడ్డ కలుగోడు గ్రా మం నేడు కోనసామను తలపిస్తుండడంతో రైతు ల కళ్లల్లో ఆనందం వెల్లి విరుస్తోంది.
ముఖ్యమంత్రి చం ద్రబా బు పాలనలోనే మైనార్టీ లు అభివృద్ధి చెందుతు న్నారని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు అ న్నారు. రంజాన పండుగ ను పురస్క రించుకుని ఆయన గురువారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ముత వల్లీలకు, ఇమామ్లకు దుస్తులు పంపిణీ చేశారు.
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చ ర్యలు తీసుకోవాలని ఆ యాశాఖల ఇంజనీర్లు, అధికారులను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. స్థానిక ఆర్ఆండ్బీ అతిథి గృహంలో గురువారం సాయంత్రం గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఎంపీడీవోలు, మున్సిపల్, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
మండలపరిధిలోని కడదరకుం ట గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ తోటల్లో జరిగిన ప్రమాదంలో దానిమ్మ చెట్లతో పాటు బెండ, అలసంద పంటలు కాలిపోయాయి. దీం తో రూ. లక్షలో నస్టం వాట్టిల్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు.
శ్రీలక్ష్మీ వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో గురువారం స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలో మూలవిరాట్కు ఉద యాన్నే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథం వద్ద హోమాది కార్యక్రమాలు నిర్వహించారు.