Home » Guntakal
పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గుంతకల్లు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి ఉత్సవమూర్తికి ఆనవాయితీగా చేపట్టే బియ్యం కొలిచే పోసే కార్యక్రమాన్ని నిర్వహించా రు.
ఉగాది పండుగను పురస్కరించుకుని పట్టణంలో నిర్వహించే అక్కమాంబ జాతరను అత్యంత వైభవంగా జరిపిద్దామని టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ సూచించారు. ఆయన బుధవారం టీడీపీ నాయకులతో కలిసి ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతపురం జిల్లాలో మంగళవారం రాత్రి 11 మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కళ్యాణదుర్గంలో 19.0 మీ.మీ వర్షపాతం నమోదైంది. బెళుగుప్ప 14.6, డి.హీరేహాళ్ 13.4, కూడేరు 11.2, రాయదుర్గం 9.3, బ్రహ్మసముద్రం 9.2, శెట్టూరు 8.6, ఆత్మకూరు 6.4, గుమ్మఘట్ట 6.0, కణేకల్లు 5.0, పామిడి మండలాల్లో 3.4 మీ.మీ వర్షపాతం నమోదైంది.
విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, రుచి, శుచిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్బాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యాప్రమాణం ఓ మార్గదర్శకంగా కొనసాగుతుండటం అభినందనీయమన్నారు.
పట్టణంలో భారత గ్యాస్ ఏజేన్సీ వారు వారం రోజులుగా గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి పం పిణీ చేయలేదు. అయితే బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పంపిణీ చేస్తున్నారు. దీంతో వినియోగదారులు అక్కడికి పె ద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచి ఖాళీ సిలిండర్లను క్యూలైనలో ఉంచి వేచి ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ మూల సూత్రాల్లో సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్ర యాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ఏర్పాటుచేసిన దివ్యాంగ శక్తి పథకా న్ని బుధవారం ఆయన పట్టణంలో ప్రారంభించారు.
మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమర్చిన సీసీ కెమెరాలు కొంత కాలంగా పని చేయడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు తదితర అన్ని విషయాల సమాచారాన్ని నిఘానేత్రాలు నిక్షిప్తం చేస్తాయి. ఆ స మాచారం ద్వారా బాధ్యులపై చర్య లు తీసుకునే అవకాశం ఉంటుం ది.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గుత్తి మార్కెయార్డు చైర్మన ప్రతాప్, ఆసుపత్రి కమిటీ సభ్యుడు చికెన శీనా పేర్కొన్నారు. మండలంలోని టి. కొత్తపల్లిలో సోమవారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన పథకం సొమ్ము జమపై పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన సోమవారం స్థానిక పోలీస్ స్టేషన సర్కిల్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మండలంలోని బ్రాహ్మ ణపల్లి, పూలకుంట, గుర్రబ్బాడు గ్రామాల్లో పెద్దకదిరప్ప స్వామిని సో మవారం పల్లకిలో ఊరేగించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలను పుర స్కరించుకొని గుంతకల్లు గుత్తి, పామిడి మండలాల్లోని గ్రామాల్లో అన వాయితీగా ప్రతిఏడాది మార్చి నెలలో స్వామి ఉత్సవ విగ్రహాన్నా 25 రోజుల పాటు 35 గ్రామాల్లో పల్లకిలో ఊరేగిస్తామని అర్చకులు రామాం జునేయులు స్వామి తెలిపారు.