Home » Guntakal
మండలంలోని గౌనూరులో నూతనంగా నిర్మించిన ఆ లయంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం వైభ వంగా నిర్వహించారు. వేకువ జాము న గణపతి, నవగ్రహాలు, బొడ్రాయి, గోపుర కలశం, ధ్వజ ప్రతిష్ఠతో పాటు ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు.
హంద్రీనీవా కాలువ డిస్ర్టిబ్యూటరీల కాలువలపై ఏళ్లు గడుస్తున్నా వంతెనల నిర్మాణానికి మోక్షం లభించడంలేదు. దీంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్ల పైనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధానంగా ఉరవకొం డ- గుంతకల్లు, ఉరవకొండ- హోతూరు, ఉరవకొండ- చాబాల రహ దారులు ప్రమాదకరంగా మారాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హ్యాపీ-సండే కార్యక్రమాన్ని పట్టణంలోని రైల్వే క్రీడా మై దానంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమి షనర్ ఎం లక్ష్మీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్, ఇతర అధికారులు క్రికెట్, షటిల్, టెన్నిస్ ఆటలలో పాల్గొన్నారు.
పేదలకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. నియోజకవ ర్గంలోని 29 మందికి మంజూరైన రూ. 42 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆది వారం పట్టణంలోని ప్ర జావేదిక వద్ద పంపిణీచేశారు.
మండలంలోని పా ల్తూరులో సుంకులా పార్వతీ దేవి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంక రించి పూజలు చేశారు. అనంతరం ఆలయం లో కుంకుమా ర్చన చేశారు.
నేమకల్లు ఆంజనే యస్వామికి శనివారం విశేష పూజ లు జరిగాయి. ప్రధాన ఆర్చకులు అనిల్కుమార్ చార్యులు పూజలు జరిపించారు. ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం చేశారు. వెండి కవచ అలంకరణ, వడమాల సేవ చేశారు.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంమగా గుంతకల్లు పట్టణంలోని మాంటి స్సోరి పాఠశాలలో విద్యార్థులు అష్ట దిగ్గజ కవుల వేషధారణలో పా ల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రే యింబవళ్లు కష్టపడుతున్నారని ము న్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైసీపీ పాలకులు పోలవ రం సహా అన్ని పాజెక్టుల పనులను గాలికి వదిలేశారని, అప్పులు చేసి రాష్ర్టాన్ని నాశనం చేశారని విమర్శించారు.
చెత్తను తీసుకొని నిత్యసర సరుకులు అందజేసే స్వచ్ఛ రథాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో తేజోత్స్న పేర్కొన్నారు. మండల కేంద్రమైన పామిడి పంచాయతీ కార్యాలయంలో శనివారం జీరో వేస్ట్ లిట్టర్ ఫ్రీ గవర్నెన్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
గత ఖరీఫ్ సీజనలో సక్రమంగా వర్షాలు కురవక పోవడంతో మండలంలో పశుగ్రాసం కరువైంది. దీంతో మూగజీవాలు మేత కోసం అలమటి స్తున్నాయి. మండల వ్యాప్తంగా మాకొడికి తండా, చెర్లోపల్లి, మాలేపల్లి, ఐదుకల్లు, కనుకూరు, పెరుగుపాలెం గ్రామాలలో అధిక సంఖ్యలో గొర్రెల పెంపకం చేపట్టారు.