Home » Guntakal
హంద్రీనీవా కాలువ నుంచి చెరువులకు నీరందించే రాగులపాడు కాలువకు తప్పక నిధులు తెస్తా నని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హామీ ఇచ్చారు. స్థానిక పుర పాలక సంఘం వద్ద కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న రైతు సంఘం నిరాహార దీక్షా శిబిరం వద్దకు ఆదివారం వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడు తూ రాగులపాడు కాల్వకు నిధులివ్వాలంటూ తాను అసెంబ్లీలో గళమె త్తానన్నారు. ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై సానుకూలంగా ఉంద న్నారు.
గ్రామీణాభివృద్ధి దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పల్లె పండగ 2.0 కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మం డలం లోని తొమ్మిది పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
మండ లంలో కేబుల్ దొంగలు పేట్రేగిపోతున్నారు. వ్యవసాయ తోటల్లో వరుసగా కేబుల్, స్టార్టర్ బాక్సులు చోరీలకు పాల్పడుతున్నారు. తోటల్లో బోర్ల వద్ద కేబుల్ వైర్లు కత్తిరించి తీసుకెళుతు న్నారు. అదేవిధంగా స్టార్టర్ బాక్సులు ఎత్తుకెళు తున్నారు.
లక్ష్మీచెన్నకేశవస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా ఆది వారం స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని లయం లో స్వామివారి మూలవిరాట్ కు ప్రత్యేక పూజలు నిర్వ హించారు.
సామాజిక పింఛన్ల పం పిణీని ఏదో సాయంగా కాకుండా బాధ్యతగా తీసుకుని కూటమి ప్రభు త్వం పనిచేస్తోందని, ప్రతి పేదకు ఆర్థిక భరో సా కల్పిస్తోందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం రూరల్ మండలం లోని నాగిరెడ్డిపల్లిలో ఆయన శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పట్టణంలో సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు కేటాయించిన నిధులపై వైసీపీ డీసెంట్ నోటీసు ను సమర్పించి రూ. 3 కోట్ల అభివృద్ధిని అడ్డుకుంది. స్థానిక ము న్సిపల్ కౌన్సిల్ హాల్లో శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని ఛైర్పర్సన పొరాళు శిల్ప అధ్యక్షతన నిర్వహించారు. 28వ వార్డు కౌన్సిలర్ గోవింద రాజులు అజెండాలోని 5వ అంశంగా ఉన్న రూ. 3 కోట్ల అభివృద్ధి పనులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉన్నత పాఠశాల దశ లోనే అత్యుత్తమ ఫలితాలను సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు విద్యార్థులకు సూచిం చారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల మైదా నంలో నిర్మించిన ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని ఆయన శనివా రం ప్రారంభించారు.
విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రూ. లక్షలు వెచ్చించి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు ప్రస్తుతం మరమ్మతులకు చేరుకున్నాయి. దిష్టిబబొమ్మలా దర్శనమిస్తున్నా యి. పట్టణంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాలో ఒకటో తరగ తి నుంచి తొమ్మిదో తరగతి వరకు 325 మంది విద్యార్థులు చదువు కుంటున్నారు.
మం డలంలోని ఉప్పరహాళ్ గ్రామంలో వెలసిన నర సింహస్వామి, ఉప్పరల య్యస్వామి ఉత్సవాల సందర్భంగా జలధి కా ర్యక్రమం శనివారం అ త్యంత వైభవంగా జరి గింది. ఉదయం దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలను వేదావతి హ గరి నది వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ వాటిని నదీజలంతో అభిషేకించి, కొత్త బిదురుబుట్టలలో ఉంచి అలంకరించారు.
నియోజకవర్గంలో అభి వృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయని టీడీపీ నాయకుడు గుమ్మనూ రు నారాయణ స్వామి పేర్కొన్నారు. మండలంలోని ఎన వెంకటాంపల్లి లో కదిరప్ప స్వామి దేవస్ధానానికి రహదారి నిర్మాణం కోసం ఎంపీపీ మాధవి, టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి శుక్ర వారం భూమిపూజచేసి పనులను ప్రారంభించారు.