Home » Guntakal
కణేకల్లు నుంచి రాయదుర్గం పట్టణానికి తాగునీటని సరఫరా చేసే పైప్లైన లీక్ అవుతోంది. దీంతో పట్టణానికి తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మున్సిపల్ కమిషనర్ దివాకర్రెడ్డి మంగళవారం తెలిపారు.
అనారోగ్యంతో మృతి చెందిన పట్టణంలోని వార్డు సచివాలయం అనిల్కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని మున్సిపాటిటీ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు కోరారు. వారు మంగళవారం అనిల్కుమార్ మృతికి సంతాపంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పాత మున్సిపల్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే నివాసం వరకు ర్యాలీగా వెళ్లారు.
ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య అందుతోందని ఎంఈవో గోవిందరా జులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మంగళవారం ఉపాధ్యాయ బృందంతో కలిసి మండలంలోని యలగలవంక ప్రాథమిక పాఠశాల పరిధిలో బడిబాట ఎనరోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు.
మున్సిపాలిటీ పరిధిలో టీడీపీ మహానా డు నిర్వహణకు పట్టణంలోని ఓ కన్వెన్షన హాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు పరిశీలించారు.
మండలంలోని అంచనహా లు గ్రామ సచివాలయ భవనం పూర్తిగా శిథిలమై పోయింది. సిబ్బంది తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఏ గోడ కూలుతుందో అనే భయాందోళన వారిలో నెల కొంది. గ్రామంలోని పాత పంచాయతీ కార్యాలయంలోనే గ్రామ సచివాలయా న్ని నిర్వహిస్తున్నారు.
మండలకేంద్రంలో సోమవారం ఉత్కంఠ భరితంగా సాగిన యాడికి ప్రీమియర్లీగ్ క్రికెట్ లీగ్ పోటీల్లో రాయలచెరువు జట్టు విజేతగా నిలిచింది. ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి జన్మదినాల వేడుకలను పురస్కరించుకొని యాడికి ప్రీమియర్లీగ్ నిర్వహించారు. పదిరోజులుగా పోటీలు జరిగాయి.
మండలంలోని మల్లాపురం గ్రామంలో వెలసిన విప్రమలై లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం విప్రమలై విశిష్టాద్వైత విశ్వశాంతి ఆశ్రమంలో లక్ష్మీనారాయణ హోమాన్ని ఘనంగా నిర్వహించారు.
పట్టణంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా మున్సిపల్, విద్యుతశాఖలు సమన్వ యంతో పనిచేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. ఆయన సోమవారం అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో మున్సి పల్, విద్యుతశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రమంతా కళ్యాణదుర్గం వైపు చూసేలా మహానాడు వేడుకలను వైభవంగా నిర్వహిద్దామని ఎమ్మె ల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపు నిచ్చారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద సోమవారం నియోజకవర్గంలోని ఐదు మండలాల టీడీపీ నాయ కులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ పరిశీలకులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్ రామకృష్ణ ముఖ్య అతి థిగా హాజరయ్యారు.
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో కనీ స వసతులు కరువై ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. తాగడానికి సరిపడా నీరు లేదు. అదే విధంగా చాలీ చాలనీ కూర్చీలతో ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క చోరీలతో బస్టాండ్ కు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.