Home » Guntakal
శాంతిభద్రత పరిరక్షణ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న పోలీసుల నివాసం కోసం మండల కేంద్రంలో నిర్మించిన క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. దీంతో విధులు నిర్వహించి వచ్చిన సిబ్బందికి విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యం లేదు. నివాస గృహాల్లోనే కాదు స్టేషన భవనంలోకి పాములు వస్తున్నాయని స్థానిక స్టేషనలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయాందోళన చెందు తున్నారు.
మండలంలోని చేర్లోప ల్లి శివారులో చండ్రాయుని కుంట వద్ద వెలసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి రఽథోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో స్వామి వారికి వేకువజామున పంచా మృ తాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
ఆనారోగ్యంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని మంగళవారం మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్రగౌడ్ పరామర్శించారు. విషయం తెలుసుకున్న జితేంద్రగౌడ్ హాస్పిటల్కు వెళ్లి ఉన్నం ఆరోగ్య పరిస్థితి పై ఆయన కుమారుడు మారుతీ చౌదరిని ఆడిగి తెలుసుకున్నారు.
భక్తులు కోరిన కోర్కెలు తీర్చే మండలకేంద్రంలోని గ్రామదేవత కుందుర్పమ్మ ఆలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దఎ త్తున భక్తులు నాలుగో గిరి ప్రదక్షిణ చేపట్టారు.
చంద్రగ్రహణం సంద ర్భంగా జిల్లాలోని ఆల యాలను మంగళవారం మూసివేశారు. కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వా మి దేవాలయంతో పాటు బొమ్మనహాళ్, డీ. హీరేహాళ్ మండలాల్లోని నేమకల్లు, మురిడి గ్రామాల్లో వెలసిన ప్రముఖ ఆంజనేయస్వామి ఆలయాలను ఉదయమే మూసి వేశారు.
గ్రామీణ ప్రాం తాలలో గతంలో ఏర్పాటు చేసిన విద్యుతస్తంభాలు పెచ్చులూడి, కడ్డీలు తేలి, ప్రమాదకరంగా మారాయి. అయినా విద్యుత అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడడం లేదని మండలపరిధిలోని జుంజురంపల్లికి చెంది న పలు కాలనీవాసులు వాపోతున్నారు.
బ్రిటిష్ కాలంలో రూపొం దించిన డైక్లాట్లో కమ్మర కులస్థులకు కేటాయించిన ఈనాం భూమిని ఓ వైసీపీ నాయకుడి ఆధీనంలో ఉందని మండలంలోని జల్లిపల్లికి చెంది న కమ్మర కులస్థులు ఆరోపించారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజేఆర్కు మండలంలోని జల్లిపల్లికి చెందిన కమ్మర కులస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
స్థానిక తహసీల్దార్ కార్యా లయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంపై అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. అదేవి ధంగా సమస్యలు తెలిపేందుకు వచ్చే ప్రజలకు నిరాశ ఎదుర వుతోంది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగే పీజీఆర్ఎస్కు హాజరుకావాలని తహసీల్దార్, ఆర్ఐకి కలెక్టర్ నుంచి అదేశాలతో వారు అక్కడికి వెళ్తున్నారు.
ప్రభుత్వం విద్యార్థుల సౌక ర్యార్థం కోట్ల రూపాయలు ఖ ర్చు పెడుతున్నా, అందు కో సం క్షేత్ర స్థాయిలో చేసిన ప నులు అర్ధాంతరంగా ఆగిపోవ డంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. విద్యార్థులకు సరైన సౌకర్యాలు అందడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.
గ్రామ స్థాయి నుంచి జనసేన పార్టీబలోపేతానికి కృషి చేస్తామని ఆ పార్టీ సీనియర్ నా యకుడు పూల రమణ పేర్కొన్నారు. స్ధానిక కసాపురం రోడ్డులో ఆదివారం జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.