Home » Guntakal
నియోజకవర్గ ప్రజల కల నెరవేర్చేందుకు త్వరలో కళ్యాణదుర్గంలో నిర్వహిం చే నగరవనం పార్కు ప్రా రంభోత్సావానికి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన కళ్యాణ్ను ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు విజ యవాడలో శుక్రవారం ఆ హ్వానించారు. దీనికి ఆయ న సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మండల పరిధిలోని అపిలేపల్లి మండల పరిషత ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి సైన్స మేళా పోటీలలో గెలుపొందిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులు అభినందించారు.
మండల పరిధిలోని ఎనుములదొడ్డి గ్రామంలో మురు గునీరు రహదారిలోకి చేరి నిత్యం మురుగు గుంటగా మారు తోంది. స్థానిక ప్రధాన రహదారి నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వరకు సీసీ రోడ్డు లేదు.
పట్టణంలోని కూరగా యల మార్కెట్లో చెత్త పేరుకుపోయి దుర్వాసనకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. కూరగాయల మార్కెట్లో పబ్లిక్ టాయిలెట్ల పక్కన ఖాళీ స్థలంలో మున్సిపల్ శానిటేషన సిబ్బంది డస్ట్ బినలు ఏ ర్పాటు చే శారు.
నేర విభాగంపై పోలీసు లు ప్రత్యేక దృష్టి సారించాలని ట్రైనీ ఎస్పీ, ఐపీఎస్ అధికారి అశ్విన మణిదీప్ పోలీసుల కు సూచించారు. ఆయన గురువారం పట్ట ణంలోని యూపీఎస్ పోలీస్స్టేషనను కళ్యాణ దుర్గం డీఎస్పీ రవిబాబుతో కలిసి తనిఖీ చేశారు. పోలీస్స్టేషనలోని రికార్డులను పరిశీ లించారు.
మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే దారికి నేడు పల్లే పండుగలో మోక్షం లభించింది. ఆసుపత్రికి వెళ్లేందుకు 30 ఏళ్లుగా సరైన దారి లేక రోగులు, వైద్య సిబ్బంది చాలా అవస్థలు పడేవారు. పల్లె పండుగ 2.0లో బాగంగా మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలతో టీడీపీ నాయకులు ఆసుపత్రికి సీసీ రోడ్డును వేయిస్తున్నారు.
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు ఖాదర్బాషా పేర్కొన్నారు. ఇటీవల ఖో-ఖో పుట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బుధవారం స్థానిక జిల్లా పరిషత సెంట్రల్ ఉన్నత పాఠశాలలో అభినందించారు.
స్థానిక కొనకొండ్ల రోడ్డు లోని శ్రీవివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం ఆ పాఠ శాల వ్యవస్థాపకులు ఆర్ మంజునాథ్ ఆధ్వర్యంలో సైన్స ఫెయిర్ను ని ర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ గణిత ఉపాధ్యా యుడు అ స్లాంబాషా, వాణి విద్యానికేతన కరస్పాండెంట్ మల్లికార్జున రెడ్డి, నీటిపారుదలశాఖ ఏఈఈ పవనకుమార్ హాజరయ్యారు.
జనసేన క్రియాశీలక సభ్యత్వంతో భద్రమైన భవిష్యత్తు అని ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన చైర్మన పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. స్ధానిక మున్సి పల్ కార్యాలయం వద్ద బుధవారం జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త వాసిగిరి మణికంఠ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా బుధ వారం స్వామివారు అశ్వ వాహనంపై భక్తులకు ద ర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామి ఉత్సవ మూర్తు లను అశ్వవాహనంపై అ లంకరించి పురవీధుల్లో ఊరేగించారు.