Home » Guntakal
రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ అమల్లోకి రావడంతో గుంతకల్లు డివిజన్ కుదింపునకు గురైంది.
పట్టణంలోని శ్రీరాములపేటలో సోమవారం ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పింఛనల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటోతేది అంటే ఆనందం అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగలా జరుగుతోందని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్ర బాబు అన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 36504 పింఛన్లు ఉండగా రూ. 16.07 కోట్లు అందిస్తున్నామని, లక్ష్మంపల్లి పంచాయతీలోనే 535 పింఛన్లకు రూ. 23.77 లక్షలు అందిస్తున్నామన్నారు.
రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బం దుల్లో ఉన్నా పింఛనుదారులకు డబ్బును అందజేయడంలో ప్రభుత్వం ఒక్క రోజు కూడా ఆలస్యం చేయడంలేదని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ నగర్లో సోమవారం ఉదయం చేపట్టిన పింఛన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయరాం పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. నియోజకవర్గంలో 36,762 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ. 16.10 కోట్ల ఫింఛన మొత్తాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
సామాజిక భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి అందజేస్తామన్న ప్ర భుత్వ హామీ మండలంలోని కొన్ని గ్రామాల్లో నీరుగారుతోంది. ఇం టింటీకీ వెళ్లి పింఛన పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశా లు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలు కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భూమి లేని పేదలకు ప్రభుత్వం పట్టాలిచ్చిందని, అయితే ఆ పొలాలకు దారి లేదంటూ అధికారుల చు ట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండ లంలోని గుండ్లపల్లి ఎస్సీ కాలానికి చెందిన లబ్ధిదారులు వాపోతున్నారు.
పట్టణ పరిసర ప్రాంతాల్లో శని వారం ఈదురుగాలులతో కూడి భారీ వర్షం కురిసింది. పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ సమీపంలో, నాగులకట్ట, కూరగాయల మార్కెట్, యల్లనూరు రోడ్డు, కృష్ణాపురం జీరోరోడ్డు, హరిజన వాడ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు ప్రవహించడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు.
తాగునీటి సమస్య మీ ఇం టిదై.. తాగునీరు రావడం లేదని మీ ఇంట్లో వాళ్లు నిలదీస్తే.,.. ఇలాగే ఉంటారా..? అని మున్సిపల్, విద్యుత శాఖ అధికారుల ను ఎమ్మెల్యే కా లవ శ్రీనివాసులు సూటిగా ప్రశ్నించారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతి థిగృహంలో శనివారం ఆయన ఇరుశాఖల అధికారులతో సమీక్ష నిర్వ హించారు.
మండలకేంద్రం నుంచి ఆత్మకూ రు మండలంలోని సింగంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు చాలా అధ్వానంగా మారింది. మంత్రి వర్యా మీరైనా పట్టించుకోండి అంటూ కూడేరు, సింగంపల్లి గ్రామాల ప్రజలు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను వేడుకుంటున్నారు.