Home » Guntakal
మండలకేంద్రంలో వైసీపీ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్ర జలను ఇబ్బంది పెడు తున్నట్లు విమర్శలు వ్య క్తం అవుతున్నాయి. మండల కేంద్రంలోని శు భోదయ ఇంగ్లీష్ మీడి యం పాఠశాల ఎదుట వైసీపీ నాయకులు డాబా ను ఏర్పాటు చేశారు. ఈ డాబాకు విద్యుత సౌక ర్యం కోసం కరకముక్కల గ్రామం నుంచి జీబీసీ కాలువ వరకూ ఉన్న ఏన్నో ఏళ్ల నాటి పచ్చని చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికి వేశారు.
మండల కేం ద్రంలోని తనకు చెందిన దా నిమ్మ తోటకు శుక్రవారం రా త్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని టీడీపీ నాయ కుడు విజయ్శెట్టి వాపోయా రు. దీంతో మూడు ఎకరా ల్లోని 1200 దానిమ్మ చెట్లు, డ్రిప్ వైర్లు, పైపులైన్లు మొ త్తం కాలి బూడిద అయ్యా యని తెలిపారు.
ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వక్త లు పేర్కొన్నారు. పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో శనివారం అం తర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
మండలంలో ఏసీబీ దాడులపై హాట్ టాపిక్ నడుస్తోంది. ఏసీబీ దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు మొ దలైంది. రెండేళ్ల వ్యవధిలో ఏసీబీ అధికారులు పామిడిలో ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రధానంగా కీలకమైన తహసీల్దార్, సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాలపై దృష్టిసారించడం చర్చనీయాంశమైంది.
మండల పరిధిలోని వై. రాంపురం గ్రామంలో వెలసిన ఎర్రిస్వామి రథోత్సవాన్ని శనివారం వై భవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు, పూజలను చేశారు.
మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామికి శనివారం విశేష పూజలు చేశారు. ప్రధాన ఆర్చకులు అనిల్కుమార్ చార్యులు స్వామికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, వెండి కవచ అలంకరణ, విశేషపుష్పా లం కరణ చేశారు. వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించు కున్నారు.
యశ్వంతపూర్-కాచిగూడ-యశ్వంతపూర్, కలబురగి-బెంగళూరు-కలబురగి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల వేళలను ఈనెల 15వ తేదీ నుంచి మార్పు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
మండల పరిధిలోని కంబదూరు వద్ద శుక్రవారం ఆటో బోల్తా పడి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కంబదూరు ప్రాంతానికి చెందిన బొమ్మలాట సుబ్బారావు అనే వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో అనంతపురం నుంచి రాజు, ఉమాపతి, రాఘవేంద్ర, లక్ష్మీదేవి శుక్రవారం ఆటోలో వస్తున్నారు. కంబదూరు చెరువు కట్ట ప్రాంతానికి చేరుకునే స మయంలో ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది.
మండల కేంద్రంలోని రాధా స్వామి విద్యాలయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ సైన్స దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు సుశీల అధ్యక్షతన ఏర్పాటు చేసిన సైన్స దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంఈవో తిప్పేస్వామి, ఎస్ఐ మహేష్ హాజరయ్యారు.
మున్సిపల్ మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ అనుబంధం ము న్సిపల్ యూనియన నాయకులు పేర్కొన్నారు. స్ధానిక మున్సిపల్ కార్యా లయం వద్ద శుక్రవారం ఆ యూనియన ఆధ్వర్యంలో మహిళా కార్మి కులు రిలే దీక్షలు ప్రారంభించారు.